కేసీఆర్ బీఆర్ఎస్ విషయంలో పునరాలోచనలో పడ్డారా?

Publish Date:Oct 17, 2022

Advertisement

ఓడిశా సీఎం నవీన్ పట్నాయక్ హైదరాబాద్ లో ఉన్నారు. సోమవారం (అక్టోబర్17న) హైదరాబాద్ వేదికగా ఒడిశా పెట్టుబడుల సదస్సు జరుగుతోంది. ఆ సదస్సులో పాల్గొనేందుకు నవీన్ పట్నాయక్ ఆదివారమే హైదరాబాద్ వచ్చారు. ఆయనకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ స్వాగతం పలికారు. అంతే అంతకు మినహా రాష్ట్ర ప్రభుత్వం కానీ, అధికార తెరాస కానీ ఆయనను ఇసుమంతైనా పట్టించుకోలేదు. గతంలో తన జాతీయ రాజకీయ ప్రస్థానం కోసం మద్దతు కోరేందుకు కేసీఆర్ ఒడిశా వెళ్లి మరీ నవీన్ పట్నాయక్ ను కలిశారు.

అప్పుడు నవీన్ పట్నాయక్ స్వయంగా కేసీఆర్ కు స్వాగతం పలికారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి వస్తే ఎటువంటి మర్యాదలు చేయాలో అన్నీ చేశారు. అయితే ఇప్పుడు మాత్రం తెలంగాణలో నవీన్ పట్నాయక్ కు అటువంటి స్వాగత సత్కారాలు లభించలేదు. కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఢిల్లీలో చేస్తున్నది ఏమిటన్నది ఎవరికీ తెలియని ఒక రహస్యోదమ్యంగా సాగుతోంది. ఆయన ఢిల్లీ పర్యటన విశేషాలు మీడియాలో కానీ, సామాజిక మాధ్యమంలో కానీ ఎక్కడా కనిపించడం లేదు. అసలు ఆయన ఢిల్లీలో ఏం చేస్తున్నారన్నది పార్టీ ముఖ్యులకైనా తెలుసా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. గత ఆరు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్ బీఆర్ఎస్ కోసం నిర్వహించిన సమావేశాలు కానీ, సదస్సులు కానీ ఏమీ లేవు. మీడియా ముందకు అసలే రాలేదు. ఒక జాతీయ పార్టీని పెట్టిన తరువాత తొలి సారిగా దేశ రాజధానిలో అడుగుపెట్టిన ఆయన తన జాతీయ రాజకీయ అజెండాను ఆవిష్కరిస్తారని అంతా భావించారు.

ఏదో మొదట ఓ రెండు రోజులు బీఆర్ఎస్ కార్యాలయం, తెలంగాణ భవన్ నిర్మాణాలను పరిశీలిస్తూ మీడియాలో కనిపించారు. అంతే ఆ తరువాత ఆయన హస్తినలో ఏం చేస్తున్నారు? ఎంత కాలం ఉంటారు అన్న దానిపై పార్టీ నుంచి కానీ, ఆయన నుంచి కానీ ఎటువంటి సమాచారం లేదు. ఇక నవీన్ పట్నాయక్ హైదరాబాద్ పర్యటన వద్దకు వస్తే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు సీఎం హోదాలో కేసీఆర్ స్వాగతం పలకడం విధాయకం. నిజంగా అత్యవసర పనుల నిమిత్తం ఆయన హస్తినలో ఉంటే.. అనుకోవచ్చు. అసలు అధికారిక కార్యక్రమాలంటూ ఏమీ లేకుండా వెళ్లి హస్తినలో కూర్చున్న కేసీఆర్ మర్యాద పూర్వకంగా ఒక ఆహ్వాన ప్రకటన కూడా జారీ చేయకుండా పట్నాయక్ పర్యటన విషయాన్ని పూర్తిగా విస్మరించడమేమిటని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. తనకు అవసరమైనప్పుడు పని గట్టుకుని వెళ్లి మరీ మంతనాలు జరిపి వచ్చారు. ఇప్పుడు అసలు పట్టించుకోవడం లేదు.. దీని వెనుక నవీన్ పట్నాయక్ తన జాతీయ పార్టీకి మద్దతుగా లేదా అనుకూలంగా ఎటువంటి ప్రకటనా చేయకపోవడమేనా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.   గతంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల కోణంలో ఆయనతో సమావేశం అయ్యారు. 2018 ముందస్తు ఎన్నికల్లో గెలిచిన తర్వాత వెళ్లి చర్చలు జరిపారు.  

సరే ఇప్పుడ కేసీఆర్ జాతీయ రాజకీయాలలో వేలే కాదు.. రెండు కాళ్లూ పెట్టేశారు. కలిసి వస్తారని అనుకున్నా.. అనుకోకపోయినా.. బీజేపీయేతర పార్టీల నేతలందరినీ కలిసి మద్దతు కోరాల్సిన అవసరం ఇప్పుడు కేసీఆర్ కు  ఎంతో ఉంది. అయినా స్వయంగా నవీన్ పట్నాయక్ తెలంగాణలో అడుగిడినా ఆయనతో చర్చలు జరపలేదు.

ఆయన సరే హస్తిన లో ఉన్నారు. కానీ బీఆర్ఎస్ కు మద్దతు కోరుతూ ఆయన తరఫున మరెవరైనా.. మరెవరి దాకాలో ఎందుకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కుమారుడు కేటీఆర్ ను అయినా నవీన్ పట్నాయక్ వద్దకు పంపి ఉండాలి అలాగా చేయలేదు.  దీంతో కేసీఆర్ జాతీయ రాజకీయాల విషయంలో పునరాలోచిస్తున్నారా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. బీఆర్ఎస్ ప్రకటన అయితే చేసేశారు కానీ.. దానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎటువంటి అడుగులూ వేయకపోవడమే తమ  అనుమానాలకు కారణమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

By
en-us Political News

  
సీనియర్ నాయకులను బుజ్జగించడానికి ఉప ముఖ్యమంత్రి పదవులను పంచుతుంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి రికార్డు సృష్టించారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన, శక్తిమంతమైన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ డైనమిక్ రోల్ పోషిస్తున్నారు.
దేశవ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీ.. చారిత్రాత్మకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో పాగా వేయడానికి ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడి ద్రవిడ రాజకీయాల ప్రభావం బలంగా ఉండటంతో కమలం ఆశించిన స్థాయిలో విస్తరించలేకపోయింది. ఈ క్రమంలోనే ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన అణ్ణామలై రూపంలో బీజేపీకి ఒక బలమైన ఆశాకిరణం లభించింది.
గతంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే.. ఇచ్చిన హామీని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు గా నిలబెట్టుకుంది. అయితే, ఈ కొత్త పదవి, అదనపు బాధ్యతలు వైఎస్ షర్మిలకు ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, మరోవైపు ఆమె ముందు అనేక సవాళ్లను ఉంచబోతున్నాయి.
సుపు రంగు అనేది భూమి పుట్టినప్పటి నుండి ఉనికిలో ఉందనీ.. ఆ రంగు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం కాదని తేల్చి చెప్పారు.
తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా ఉందని ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇరాన్ తో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోందన్నారు.
రాబోయే రోజుల్లో స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతను కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించే వారిగా మార్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని దర్శిత్ వెల్లడించారు. ఉత్తరాంధ్రను డిజిటల్ గేట్‌వేగా మారుస్తూ గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్, డెలాయిట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకొస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ శైలిని అభినందించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కుదిరిన ముందస్తు ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం (మే 28) తన పదవికి రాజీనామా చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖరారైంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన వాస్తవ వేదికలో దేశ రాజకీయ పరిస్థితుల
ఏమిటీ కాక్రోచ్ జనతా పార్టీ? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? దీనివల్ల ఇండియాలో కూడా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో వచ్చినట్లు ప్రజా విప్లవాలు వస్తాయా అనే చర్చలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. ఈ తీవ్రమైన రాజకీయ పరిణామాలపై ప్రముఖ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ లిబర్టీ అధినేత నలమోతు చక్రవర్తి తెలుగువన్ ఇంటర్వ్యూలో అనేక లోతైన విశ్లేషణ చేశారు.
ఇక తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు 2026 విషయానికి వస్తే.. ఈ సారి మహానాడు సరికొత్త రాజకీయ ఒరవడికి వేదికైంది. నెల్లూరులో భారీ ఎత్తున ఏర్పాటు చేయాలనుకున్న ఈ వేదికను, మోడీ ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా హైబ్రిడ్ మోడల్‌లోకి మార్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.