యాక్టివ్ అవుతున్న టీడీపీ యువతరం వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్ భేటీ

Publish Date:Oct 17, 2022

Advertisement

తెలుగుదేశం పార్టీలో యువ తరంగం మరింత యాక్టివ్ అవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీకి వైసీపీ గ్రహణం నుంచి విముక్తి కలిగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు అవిశ్రాంతంగా చేస్తున్న కృషికి ఆ పార్టీలోని డైనమిక్ యువ నేతలు మరింత ఉత్సాహంగా ప్రోత్సాహం అందించేందుకు ముందుకొస్తున్నారు. ఆ క్రమంలోనే ఏపీ టీడీపీ రాజకీయాల్లో తాజాగా అత్యంత అరుదైన ఘటన జరిగింది. అమరావతినే ఏపీకి ఏకైక రాజధానిగా ఉంచాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న అమరావతి టూ అరసవిల్లి పాదయాత్రకు మద్దతుగా పాల్గొనేందుకు వంగవీటి రాధా, పరిటాల శ్రీరామ్ రాజమండ్రి వచ్చారు.

ఈ నేపథ్యంలో వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్ రాజమండ్రిలో ఓ రహస్య ప్రాంతంలో భేటీ అవడం ఆసక్తికరంగా మారింది. ఈ భేటీకి సంబంధించిన విజువల్స్ ను పరిటాల శ్రీరామ్ తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు. రాధా, శ్రీరామ్ తో పాటు తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు క్రియాశీల నేత,  లోక్ సభ స్పీకర్ దివంగత  జీఎంసీ బాలయోగి కుమారుడు హరీశ్ కూడా భేటీ అయ్యారు. ఈ ముగ్గురు యువనేతల అపూర్వ కలయికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అందులోనూ ఇరు ప్రాధాన్యతా కుటుంబాల వారసులు రాధా- శ్రీరామ్ తొలిసారిగా భేటీ అవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

వంగవీటి రాధాకృష్ణ, పరిటాల శ్రీరామ్ ఇద్దరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చినవారే. వంగవీటి రాధాకృష్ణ కుటుంబానికి కోస్తాంధ్రలోను మరీ ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అంతకు మించి విజయవాడలో బలమైన రాజకీయ నేపథ్యం ఉంది.  అలాగే.. పరిటా శ్రీరామ్ కుటుంబానికి అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యం ఉంది. తాడిత పీడిత, పేద ప్రజలకు అండగా నిలిచిన చరిత్ర ఉన్న కుటుంబాలకు వారసులు రాధా- శ్రీరామ్. పేదలకు అండగా ఉన్న క్రమంలోనే వంగవీటి రంగా, పరిటాల రవి అసువులు బాసారు. ఈ రెండు కుటుంబాలకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరూ రాజమండ్రిలో భేటి అవడం, వారితో మరో యువనేత గంటి హరీశ్ కూడా జత కలవడం చర్చనీయాంశంగా మారింది. వీరి అపూర్వ సమావేశం  రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ ముగ్గురూ కూడా మూడు వేర్వేరు బలమైన సామాజికవర్గాలకు చెందినవారే కావడం గమనార్హం.

గతంలో వంగవీటి రాధాపై రెక్కీ ఘటన సందర్భంగా పరిటాల శ్రీరామ్ తీవ్రంగా స్పందించారు. వంగవీటి రాధా తెలుగుదేశం కుటుంబ సభ్యుడని, రాధాను టచ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ సందర్భంగా శ్రీరామ్ హెచ్చరించారు. వంగవీటి కుటుంబం అంటే మామూలు కుటుంబం అనుకుంటున్నారా? అని శ్రీరామ్ ఘాటుగా ప్రశ్నించారు. అప్పటికి ఈ యువనేతలిద్దరూ ప్రత్యక్షంగా కలుసుకున్నది లేదు. ఇరువురూ టీడీపీలో డైనమిక్ లీడర్లే. అలాంటి యువ నేతలు ఇప్పుడు తొలిసారిగా రాజమండ్రిలో సమావేశమై ఏ విషయాలు చర్చించారనే దానిపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్ తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్నారు. ఆ అక్కసుతోనే అధికార వైసీపీ వీరిరువురినీ ఇబ్బందులు పెట్టేందుకు యత్నాలు చేస్తోంది. ఆ క్రమంలోనే వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగింది. రాధాపై రెక్కీ నిర్వహించడంపై అనేక అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. రాధాను నిర్మూలించాలనే కుట్ర ఈ రెక్కీ వెనుక ఉన్నట్లు తర్వాత బయటపడింది.

వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్ భేటీపై సోషల్ మీడియాలో పలువురు విశేషంగా స్పందిస్తున్నారు. ఇద్దరు పులి బిడ్డలు కలిశారంటే చరిత్ర తిరగరాసినట్లే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పరిటాల రవి, వంగవీటి రంగా ఇద్దరూ సింహాలని, ఆ సింహాల కొడుకులు రాధా, శ్రీరామ్ తొలిసారి భేటీ అవడాన్ని స్వాగతిస్తూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్ సుమారు రెండున్నర నుంచి మూడు గంటల పాటు భేటీ అయినట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం టికెట్లు కేటాయిస్తానని టీడీపీ చీఫ్ చంద్రబాబు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్- గంటి హరీశ్ భేటీ అవడం కూడా టీడీపీలో యువతలో మరింత చైతన్యం తీసుకొచ్చే వ్యూహాల గురించి వీరు చర్చించి ఉండొచ్చనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే వీరి మధ్య ఏవో కీలకమైన అంశాల మీదే ఇంత సుదీర్ఘంగా చర్చ జరిగి ఉండొచ్చాని భావిస్తున్నారు.  మొత్తానికి రాధా- శ్రీరామ్ తొలిసారిగా భేటీ అవడమే ఆశ్చర్యకరమైతే.. వారితో బాలయోగి కుమారుడు హరీశ్ జత కలవడం అపురూపమైన, అరుదైన ఘటనగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. రాజకీయంగా వీరి కలయిక సంచలనం సృష్టిస్తోంది. ఈ ముగ్గురు యువనేతల కలయిక ప్రత్యర్థి పార్టీల నేతలు ముఖ్యంగా పెచ్చుమీరిన నియంతృత్వ వైఖరితో ఉన్న వైసీపీ నేతల్లో కలవరం సృష్టించే అవకాశం ఉందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.