జగనన్న ఉత్తుత్తి ఉప సంహరణ ఎందుకంటే..
Publish Date:Nov 23, 2021
Advertisement
మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కానీ, ఇది ఉపసంహరణ కాదు.ఇదొక ఎత్తుగడ. న్యాయస్థానాల కళ్ళు కప్పి మొట్టికాయల నుంచి తప్పించుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రయోగించిన కుట్ర పురిట ఎత్తుగడ. చట్టాల మీద కోర్టులో దాఖలైన కేసుల విచారణ ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో,ఇలాంటి నిర్ణయం కుట్రపూరిత నేరంగా భావించినా తప్పు లేదని న్యాయవ్యవస్థలో భాగమైన న్యాయవాదులు కొందరు అభిప్రాయ పడుతున్నారు. చట్టాలు పూర్తిగా ఉపసంహరించుకుంటే అదో రకం, కానీ, ఉపసహరించుకున్న చట్టాల స్థానంలో సమగ్ర వివరాలతో మళ్ళీ బిల్లు తెస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసన సభలో ప్రకటించారు. అంటే, వైసీపీ సర్కార్ మనసు మారలేదు. వ్యూహం మారింది. ఇలా న్యాయవ్యవస్థతో దాగుడుముట్లు ఆడడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న కూడా వినవస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ ‘చక్కటి’ సలహా ఎవరిచ్చారో, ఏమో కానీ, ఈ ‘ఉత్తుత్తి’ ఉపసంహరణతో ఏపీ నిర్దిష్ట రాజధాని లేని అనాధ రాష్ట్రంగా మిగిలి పోతుందనేది మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నేళ్ళు అనేది సప్ష్టంగా చెప్పలేక్ పోయినా, ఇప్పట్లో ఏపీ రాజధాని సమస్య పరిష్కారం కాదని న్యాయ నిపుణులు అంటున్నారు. నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం ‘అశ్వధామ హతః ... కుంజరః’ అన్నట్లుగా మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు బిల్లుల ఉపసహరణ క్రతువును, చాలా గోప్యంగా కానిచ్చింది. సుమారు నాలుగు గంటలు ఉత్ఖంట భరితంగా నడిపించి చివరకు వైసీపే ప్రభుత్వం మార్కు డొల్ల తనాన్ని ముఖ్యమంత్రి బయట పెట్టరు.చివరకు, ముఖ్యమంత్రి కరిమింగిన వెలగ పండును బయటకు తీశారు. రాజధాని మిధ్య, ఉపసంహరణ మిధ్య అని తేల్చి చెప్పారు. అయితే, ఇక్కడితో కథ కంచికి చేరినట్లు కాదు. నిజమే, మంత్రి ఒకరు అన్నట్లుగా, ఇది విరామమే .. శుభం కార్డు’ పడినట్లు కాదు. ఇల్లు అలకగానే పండగ రాదు... ప్రభుత్వం చట్టాలను ఉపసంహరించు కానీ, న్యాయస్థానం ఇంకా ఉపసంహరణకు ఒకే చెప్పలేదు.ఈ కేసుకు సంబదించిన పిటీషనర్ల తరపు న్యాయవాదుల అభ్యర్ధన మేరకు ప్రభుత్వం మెమో’తో మమ అనిపిస్తే కుదరదని,చట్టాల రద్దు ప్రేరేపించిన అంశాలు, రద్దు ఉద్దేశాలు (దురుద్దేశాలు అనాలేమో, కానీ కోర్టు ఆ మాట అనలేదు) , తాజా బిల్లు ఎందుకు మ ఏ ఉద్దేశాల (దురుద్దేశాల)తో తెస్తున్నారో సవివరంగా వివరిస్తూ, అఫిడవిట్ దాఖలు చేయాలని, న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, అఫిడవిట్’తో పాటుగా, మెమో, బిల్లును కూడా శుక్రవారం (నవంబర్ 26)లోగా కోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. సో ... చాట్ల ములుకు మాత్రమే కాదు, రద్దుకు కూడా ఇది ఇంటర్వెల్ మాత్రమే..రద్దు బిల్లును శాసన సభ ఆమోదించినా ... న్యాయస్థానాల్లో ఉన్న ఉన్న కేసులు కొనసాగీ అవకాశాలను పూర్తిగా కొట్టివేయలేమని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, న్యాయస్థానంలో చట్టాలను ఉపసంహరించుకుంటే, ఆ చట్టాలను సవాలు చేస్తూ విచ్రన్లో ఉన్నకేసులు అన్నీ కూడా, ఇన్ఫ్రుక్ట్యస్ (infructious) నిర్వీర్యం, నిష్ఫలం అయిపోతాయని, నుడ్కోసమే జగన్ రెడ్డి ప్రభుత్వం వ్యూహాత్మకంగా చట్టాలను ఉపసంహరించుకుందని న్యాయనిపుణులు అంటున్నారు. అయితే, చట్టాల ఉపసంహరించుకున్నా, అందుకు సంబంధించి విచారణ దశలో ఉన్న పిటీషన్ల విషయంలో నిర్ణయం తీసుకునే విచాక్షనాదికారం న్యాయస్థానాలకు ఉంటుందని, అంటున్నరు. అయితే ఏది ఏమైనా రాజధాని సమస్య మాత్రం ఇప్పట్లో పరిష్కారం కాదని, ఫలితంగా రాజధాని లేని రాష్ట్రంగా అవమానాలు ఎదుర్కొనవలసి రావడమే కాకుండా, అది రాష్ట్ర అభివృద్ధికి కూడా ప్రతిబంధకం అవుతుందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/why-jagan-govt-recall-3-capital-bill-39-126934.html





