political-news-img

ఈ నాలుగు అలవాట్లు ఉండే చాలు.. ఎప్పుడూ హ్యాపీగా ఉండొచ్చు!

సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా, సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు, నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు.. ఇలా జీవితం ఎంత సాఫీగా గడుస్తోంది అనుకున్నా.. మనిషి లోపల మాత్రం మనసు తృప్తిగా, సంతోషంగా అనుభూతి చెందడం లేదు. చాలామందిలో ఈ గందరగోళం కనిపిస్తూ ఉంటుంది. ఏదో కోల్పోయినట్టు కనిపిస్తూ ఉంటారు. అయితే దీనికి రివర్స్ గా.. సంతోషంగా ఉండే వ్యక్తులు మాత్రం జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సులువుగా అధిగమించగలరు, ఆరోగ్య సమస్యలను ఎదుర్కోగలరు, వీరికి జీవితం అసలు కష్టంగా అనిపించదు. కానీ సంతోషంగా ఉండటం ఎలా.. మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండటం కేవలం నాలుగు అలవాట్ల వల్ల సాధ్యం అవుతుందని అంటున్నారు మానసిక ఆరోగ్య నిపుణులు. ఆ నాలుగు అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. జాగ్రత్తగా వినడం.. కొంతమంది తమ గురించి మాత్రమే పట్టించుకుంటారు, ఇతరులు చెప్పేది వినడానికి ఇష్టపడరు. అలాంటి వారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. మీరు మాట్లాడే దానికంటే ఎక్కువగా వినడం నేర్చుకోవాలి. ఇతరులు చెప్పేది శ్రద్దగా వినగలిగే వ్యక్తులు జీవితంలో ఎన్నో సమస్యలను క్లిష్టతరం కాకుండా, అసలు సమస్యలుగా మారకుండా ముందుగానే వాటిని పరిష్కారం చేసుకోగలుగుతారు. తద్వారా జీవితాన్ని డిస్టర్బ్ చేసేంత సమస్యలు ఏవీ వారికి ఉండవు. పాజిటివ్ మైండ్ సెట్.. సానుకూల భావాలు అంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ తమ జీవితాలతో సంతోషంగా ఉంటారు, వారికి దొరికే ఏ కొద్ది సమయాన్ని అయినా సంతోషంగా గడపడానికి, ఆ సమయాన్ని మధురమైన జ్ఞాపకాలుగా మార్చుకోవడానికి, పదిలపరుచుకోవడానికి ఇష్టపడతారు. ఈ విషయాలు క్రమంగా వారిని సంతోషంగా ఉంచుతాయి. ఒత్తిడికి దూరంగా ఉండటం.. సంతోషంగా ఉండే వ్యక్తులకు ఒత్తిడి లేకుండా నిద్రపోవడం అలవాటుగా మారుతుంది. ఈ అలవాటు సంతోషంగా ఉంచడానికి సహాయపడుతుంది. నిద్రపోయేటప్పుడల్లా అస్సలు ఏ చింతా లేకుండా, ఏ సమస్య గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోయేందుకు ప్రయత్నం చేయాలి. ఇది ఒత్తిడిని దూరంగా ఉంచుతుంది. తమ మీద తాము జాలి పడటం.. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే వ్యక్తులు తమ మీద తాము జాలి పడటం అస్సలు పాటించరు. వారు ఏదో ఒకటి నేర్చుకుని, తప్పులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. తమ తప్పులను తాము దాచిపెట్టడం లేదా తమ అసమర్థతను ఒప్పుకోకుండా ఇతరులతో గొడవ పడటం లాంటివి చేయరు. పైన చెప్పుకున్న లక్షణాలు ఉన్న వ్యక్తులు తమ జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఆ లక్షణాలు వ్యక్తులను సంతోషంగా ఉండటానికి ప్రేరేపిస్తాయి, సహాయపడతాయి కూడా. *రూపశ్రీ

Publish Date: Apr 10, 2026 6:19PM

political-news-img

నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు.. ఇవి తింటే గుండెపోటు ప్రమాదం తగ్గుతుందట..!

ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో కొంతకాలంగా యువతలో గుండెపోటులు సంభవిస్తున్నాయి. గుండెను బలోపేతం చేయడానికి ఆహారంలో నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవడం ఎంతో ఉత్తమం అని ఆహార నిపుణులు అంటున్నారు. నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు గుండెను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అసలు గుండె బలంగా ఉండటానికి నైట్రేట్ ఎందుకు అవసరం? నైట్రేట్ ఆ కూరగాయలలో అధికంగా ఉంటుంది? ఆహార నిపుణులు ఏం చెబుతున్నారు? పూర్తీగా తెలుసుకుంటే.. ఆరోగ్యకరమైన గుండెకు నైట్రేట్ ఎందుకు ముఖ్యం? శరీరంలో నైట్రేట్, నైట్రిక్ ఆక్సైడ్‌గా మార్చబడుతుంది. నైట్రేట్ ఆక్సైడ్ రక్తనాళాలను విస్తరింపజేస్తుంది, ఇది రక్తపోటును నియంత్రిస్తుంది, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అధిక రక్తపోటు సమస్య.. కొన్ని సంవత్సరాల క్రితం అధిక రక్తపోటును వృద్ధాప్య వ్యాధిగా పరిగణించేవారు. ఆ తరువాత 40 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గలవారిలో అధిక రక్తపోటు కనిపించేది. ఇప్పుడు 20 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు కూడా అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. అధిక రక్తపోటును సకాలంలో కంట్రోల్ చేయలేకపోతే అది గుండె జబ్బులు, పక్షవాతం , మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది. అధిక రక్తపోటు అంటే ధమనులలో రక్తపోటు సాధారణం కంటే ఎక్కువగా ఉండటం. నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు.. పాలకూర.. పాలకూరలో ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో నైట్రేట్లు కూడా ఉంటాయి. పాలకూరను తినడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది , గుండె కండరాలను బలపరుస్తుంది. బీట్‌రూట్ .. బీట్‌రూట్ రసంలో నైట్రేట్లు ఉంటాయి. బీట్‌రూట్ రసం తాగడం వల్ల ఓపిక పెరిగి, గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఆకుకూర సలాడ్లు.. ఆకుపచ్చ ఆకు కూరల సలాడ్లలో నైట్రేట్లు ఉంటాయి. ఆహారంలో సలాడ్లను చేర్చుకోవచ్చు. ఆహారంలో ఆకుపచ్చ ఆకు కూరల సలాడ్లను చేర్చుకోవడం గుండె ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరం. మెంతులు.. మెంతిలో పీచుపదార్థం, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో నైట్రేట్లు కూడా ఉంటాయి, ఇవి గుండె జబ్బులను నివారించడంలో , చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. కాలీఫ్లవర్.. క్యాబేజీలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మాత్రమే కాకుండా ధమనులలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడే నైట్రేట్లు ఉంటాయి. *రూపశ్రీ.

Publish Date: Apr 10, 2026 6:10PM

political-news-img

కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ కి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి శుక్రవారం (ఏప్రిల్ 10) బిఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్‌ను చూడగానే జీవన్ రెడ్డి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అన్నా.. మన రాష్ట్రానికి నష్టం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను ఇక్కడికి పంపాడన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కాగా ఈ భేటీలో జీవన్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు, జగిత్యాల మాజీ జెడ్పీ చైర్ పర్సన్ వసంత సురేష్ దంపతులు కూడా కేసీఆర్‌ను కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు, కాంగ్రెస్ లో తనకు ఎదురైన పరిస్థితుల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి గులాబీ కండువా కప్పుకోవడం రాష్ట్రంలో కాంగ్రెస్ కు గట్టి ఎదురు దెబ్బేనని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు చేరుకున్న జీవన్ రెడ్డికి బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఘనస్వాగతం పలికారు. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులు కూడా జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ జీవన్ రెడ్డిని సన్మానించి, పార్టీలోకి ఆహ్వానించారు.

Publish Date: Apr 10, 2026 5:58PM

political-news-img

అణు ఇంధన చక్రం: యురేనియం సుసంపన్నం, ప్లూటోనియం ఉత్పత్తి, వ్యూహాత్మక ప్రభావాలు

సంకలనం, సేకరణ : కంఠంనేని సీతారాం అణు ఇంధన చక్రం పౌర ఇంధన ఉత్పత్తి మరియు వ్యూహాత్మక సైనిక సామర్థ్యాలు రెండింటికీ కేంద్ర బిందువుగా ఉంది. ప్రపంచ అణు విధానాలు, సాంకేతిక పురోగతులు, మరియు భౌగోళిక రాజకీయ ప్రమాదాలను అంచనా వేయడానికి, యురేనియం సుసంపన్నం మరియు ప్లూటోనియం ఉత్పత్తి మధ్య ఉన్న వ్యత్యాసాలను అర్థం చేసుకోవడం అత్యవసరం. 1. సహజ యురేనియం కూర్పు సహజ యురేనియంలో ప్రధానంగా రెండు ఐసోటోపులు ఉంటాయి: యురేనియం-238 (U-238): ~99.3% యురేనియం-235 (U-235): ~0.7% U-235 మాత్రమే అణు శృంఖల చర్యను కొనసాగించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, అందువల్ల ఇది ఇంధన ఉత్పత్తి మరియు రక్షణ సంబంధిత అనువర్తనాలకు చాలా కీలకం. 2. యురేనియం సుసంపన్నం: ఉద్దేశ్యం మరియు స్థాయిలు యురేనియం సుసంపన్నం అనేది U-235 యొక్క సాంద్రతను పెంచే ప్రక్రియ, ఇది సాధారణంగా గ్యాస్ సెంట్రిఫ్యూజ్‌ల వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా జరుగుతుంది. సుసంపన్నత స్థాయి దాని అనువర్తనాన్ని నిర్ధారిస్తుంది: తక్కువ సుసంపన్నత (3–5%) పౌర అణు విద్యుత్ ప్లాంట్లలో ఉపయోగిస్తారు ఆవిరిని ఉత్పత్తి చేయడానికి వేడిని సృష్టిస్తుంది, ఇది టర్బైన్‌లను నడిపి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది మధ్యస్థ సుసంపన్నత (~20%) సాధారణంగా నావికాదళ చోదక వ్యవస్థలతో, ముఖ్యంగా అణు జలాంతర్గాములతో సంబంధం కలిగి ఉంటుంది అధిక శక్తి సాంద్రతను అందిస్తుంది, ఇది దీర్ఘకాలిక, రహస్య కార్యకలాపాలను సాధ్యం చేస్తుంది అధిక సుసంపన్నత (60–80% మరియు అంతకంటే ఎక్కువ) వ్యాప్తికి సంబంధించిన తీవ్రమైన ఆందోళనలను పెంచుతుంది ఆధునిక అణు సామర్థ్యాలతో మరియు కొన్ని సందర్భాల్లో, ఆయుధ సంబంధిత సంభావ్యతతో సంబంధం కలిగి ఉంటుంది 3. అణు విద్యుత్ ప్లాంట్లు విద్యుత్తును ఎలా ఉత్పత్తి చేస్తాయి అణుశక్తి ఉత్పత్తి ఒక సునిర్వచిత ఉష్ణగతిక ప్రక్రియను అనుసరిస్తుంది: వేడి ఉత్పత్తి: రియాక్టర్ కోర్‌లో జరిగే అణు విచ్ఛిత్తి అధిక మొత్తంలో వేడిని విడుదల చేస్తుంది ఆవిరి ఉత్పత్తి: నీటిని వేడి చేసి అధిక పీడన ఆవిరిగా మారుస్తారు టర్బైన్ భ్రమణం: ఆవిరి టర్బైన్ బ్లేడ్‌లను అధిక వేగంతో తిప్పుతుంది విద్యుత్ ఉత్పత్తి: టర్బైన్ ఒక జనరేటర్‌ను నడిపి, గ్రిడ్ కోసం విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది ఈ ప్రక్రియ అణుశక్తిని అనుమతిస్తుంది పెద్ద ఎత్తున అధిక-ఉత్పత్తి, తక్కువ-కార్బన్ శక్తిని అందించే సామర్థ్యం. 4. ప్లూటోనియం ఉత్పత్తి: ఒక రియాక్టర్ ఆధారిత ప్రక్రియ సుసంపన్నమైన యురేనియంలా కాకుండా, ప్లూటోనియం సహజంగా ఉపయోగపడే పరిమాణంలో లభించదు మరియు దీనిని అణు రియాక్టర్ల లోపల ఉత్పత్తి చేయాలి. దశలవారీ ప్రక్రియ న్యూట్రాన్ శోషణ: U-238 ఒక రియాక్టర్ లోపల న్యూట్రాన్‌ను శోషించుకుంటుంది రూపాంతరీకరణ: ఈ పరమాణువు ప్లూటోనియం-239 (Pu-239)గా రూపాంతరం చెందుతుంది శీతలీకరణ దశ: వాడిన ఇంధన కడ్డీలను చాలా సంవత్సరాల పాటు లోతైన నీటి శీతలీకరణ కొలనులలో నిల్వ ఉంచుతారు ఇది వేడిని తగ్గించి, రేడియేషన్ స్థాయిలను స్థిరీకరిస్తుంది రసాయన పునఃప్రక్రియ: ఇంధన కడ్డీలను ముక్కలుగా చేసి, వేడి నైట్రిక్ ఆమ్లంలో కరిగిస్తారు శుద్ధమైన ప్లూటోనియంను సంగ్రహించడానికి ట్రిబ్యూటైల్ ఫాస్ఫేట్ వంటి రసాయన కారకాలను ఉపయోగిస్తారు 5. శీతలీకరణ కొలనుల పాత్ర శీతలీకరణ కొలనులు భద్రత మరియు ప్రాసెసింగ్‌లో ఒక కీలకమైన భాగం: ఉష్ణ నిర్వహణ: అధిక రేడియోధార్మిక ఇంధనం నుండి మిగిలిపోయిన వేడిని వెదజల్లడం రేడియేషన్ కవచం: హానికరమైన రేడియేషన్‌కు వ్యతిరేకంగా నీరు ఒక అవరోధంగా పనిచేస్తుంది ఈ దశ లేకుండా, అణు పదార్థాన్ని సురక్షితంగా నిర్వహించడం మరియు తదుపరి ప్రాసెసింగ్ చేయడం సాధ్యం కాదు. 6. సుసంపన్నం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యత యురేనియం సుసంపన్నం వెనుక ఉన్న ప్రాథమిక ప్రేరణ శక్తి సాంద్రత: అధిక U-235 సాంద్రత తక్కువ పరిమాణంలో ఇంధనం నుండి ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయడానికి వీలు కల్పిస్తుంది జలాంతర్గాముల వంటి, కాంపాక్ట్ మరియు దీర్ఘకాలిక శక్తి వనరులు అవసరమయ్యే అనువర్తనాలకు ఇది ప్రత్యేకంగా కీలకమైనది 7. ప్లూటోనియం vs. యురేనియం: కీలక వ్యత్యాసాలు అంశం యురేనియం సుసంపన్నం ప్లూటోనియం ఉత్పత్తి మూలం సహజ యురేనియం రియాక్టర్లలో ఉత్పత్తి చేయబడుతుంది విధానం సెంట్రిఫ్యూజ్ ఆధారిత సుసంపన్నం న్యూట్రాన్ పరివర్తన + రసాయన వెలికితీత అనువర్తనం శక్తి, నౌకా చోదనం, వ్యూహాత్మక ఉపయోగం అధునాతన అణు వ్యవస్థలు, పరిశోధన, రక్షణ సంక్లిష్టత సాంకేతికంగా అధిక శ్రమతో కూడుకున్నది రసాయనికంగా మరియు కార్యాచరణపరంగా సంక్లిష్టమైనది 8. భౌగోళిక రాజకీయ సందర్భం మరియు భద్రతాపరమైన ఆందోళనలు అణు సాంకేతికత ఇంధన భద్రత మరియు ప్రపంచ స్థిరత్వం అనే రెండు అంశాల కూడలిలో ఉంటుంది: ఇరాన్ వంటి దేశాల సుసంపన్న స్థాయిలను నిశితంగా పర్యవేక్షిస్తారు పౌర ఇంధన కార్యక్రమాలు మరియు వ్యూహాత్మక సామర్థ్యాల మధ్య వ్యత్యాసం అంతర్జాతీయ సమాజానికి ఒక కీలక ఆందోళనగా మిగిలిపోయింది వేగవంతమైన విస్ఫోటనాల సంభావ్యత కారణంగా మధ్యస్థ స్థాయి సుసంపన్నత కూడా ఆందోళనలను పెంచుతుంది ఉన్నత స్థాయిలకు తీవ్రతరం కావడం. 9. “డర్టీ బాంబ్” భావన “డర్టీ బాంబ్” (రేడియోలాజికల్ డిస్పర్సల్ డివైస్) అణు ఆయుధం నుండి భిన్నంగా ఉంటుంది: ఇది పూర్తి అణు విస్ఫోటనంపై ఆధారపడదు దానికి బదులుగా, ఇది కాలుష్యం మరియు అంతరాయం కలిగించడానికి రేడియోధార్మిక పదార్థాన్ని వెదజల్లుతుంది అణు విస్ఫోటనం కంటే తక్కువ విధ్వంసకరమైనది అయినప్పటికీ, ఇది గణనీయమైన మానసిక, పర్యావరణ మరియు ఆర్థిక ప్రమాదాలను కలిగిస్తుంది. ముగింపు అణు ఇంధన చక్రం అనేది భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్ మరియు భౌగోళిక రాజకీయాల యొక్క సంక్లిష్టమైన పరస్పర చర్య. యురేనియం సుసంపన్నం చేయడం మరియు ప్లూటోనియం ఉత్పత్తి చేయడం అనేవి శాంతియుత మరియు వ్యూహాత్మక ప్రయోజనాలకు ఉపయోగపడతాయి, అందువల్ల ఇవి ప్రపంచ ఇంధన వ్యవస్థలు మరియు భద్రతా చర్చలలో కీలక పాత్ర పోషిస్తాయి. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మారుతున్న కొద్దీ, పౌర ఇంధన అవసరాలను అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక లక్ష్యాలతో సమతుల్యం చేయగల సామర్థ్యం ఆధునిక ప్రపంచంలోని కీలక సవాళ్లలో ఒకటిగా నిలిచిపోతుంది.

Publish Date: Apr 10, 2026 5:50PM

political-news-img

ఇన్ స్టా గ్రామ్ వేధింపులు.. టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

ఇన్ స్టా గ్రామ్ వేధింపులు భరించలేక టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన హాయత్ నగర్ పరిధిలో జరిగింది. సినీమాలు, సోషల్ మీడియా ప్రభావం యువతను తప్పుదోవ పట్టిస్తు న్నదనడానికి తార్కానంగా ఈ సంఘటనను చెప్పుకోవచ్చు. హయత్‌నగర్ పరిధిలోని కుంట్లూరు ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ బాలుడు, బాలికల మధ్య పరిచయం ఇన్‌స్టాగ్రామ్‌ చాటింగ్ వరకూ వెళ్లింది. ఇదే అవకాశంగా తీసుకున్న ఆ బాలుడు బాలికను ఇన్ స్టాగ్రామ్ లో వేధించడం మొదలు పెట్టాడు. ఆ వేధింపులు భరించలేక ఆ బాలిక పలు మార్లు ఆ బాలుడిని మందలించింది. అయినా ఫలితం లేకపోగా, ఇటీవలి కాలంలో ఆ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఆ వేధింపులకు తాళలేక టెన్త్ చదువుతున్న ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హైదరాబాదుకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Publish Date: Apr 10, 2026 5:27PM

political-news-img

ప్రేమజంట ఆత్మహత్య

పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు కోట పరిధిలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమలో ఉన్న యువ జంట ఆత్మహత్యకు పాల్పడి, చికిత్స పొందుతూ వరుసగా మృతి విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గుంటూరు స్వర్ణ భారతి నగర్ కు చెందిన 20 ఏళ్ల రసిక మణికంఠ రాజు, అంకమ్మనగర్ కి చెందిన యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించక పోవడంతో పాటు ఆ యువతికి ఇటీవల వేరే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం అనంతరం మనస్తాపానికి గురైన యువతి తన భర్తతో ఉండలేనంటూ గుంటూరుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఇద్దరూ కొండవీడు కోట ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వారు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు గమనించి వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యువకుడు మణికంఠ రాజు ఈ నెల8న మరణించగా, ఆ యువతి గురువారం (ఏప్రిల్ 9)న కన్నుమూసింది.ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Publish Date: Apr 10, 2026 5:05PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img