కాంగ్రెస్ కొత్త సారథి ఎవరు? రాహుల్ అభీష్టం మేరకే గాంధీ కుటుంబం బయటి వ్యక్తికే పగ్గాలు?

Publish Date:Aug 25, 2022

Advertisement

కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి కొత్త అధ్యక్షుడు కచ్చితంగా గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తినే ఎన్నుకోవడం దాదాపు ఖాయమైపోయిందా అన్న ప్రశ్నకు పరిశీలకులు ఔననే అంటున్నారు. సోనియాగాంధీ ఆరోగ్య సమస్యలతో పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగడానికి సుముఖంగా లేని సంగతి విదితమే. ఇక రాహుల్ గాంధీ అయితే తాను పట్టిన పట్టు విడవబోనని ఖరాఖండీగా తేల్చేశారు.

తాను పార్టీ పగ్గాలు చేబట్టబోననీ విస్పష్టంగా తెలియజేయడంతో పార్టీ ప్రియాంక గాంధీవైపు మొగ్గు చూపినా ఆమె కూడా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు నిరాకరించారని చెబుతున్నారు. దీంతో అనివార్యంగా గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి గ్రాండ్ ఓల్డ్ పార్టీకి ఎదురైంది. దీంతో పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎవరన్న చర్చ పార్టీలో విస్తృతంగా సాగుతోంది. పార్టీ అధ్యక్ష పగ్గాలు ఎవరు చేపట్టినా వారు గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడే అయి ఉండాలన్నది బయటకు చెప్పని కండీషన్ గా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

పార్టీలో పాత తరం, కొత్తతరం నేతలను కలుపుకుపోగలిగిన వ్యక్తి... అదే సమయంలో గాంధీ కుటుంబానికి ఆమోదయోగ్యమైన వ్యక్తి కోసం అన్వేషణ ప్రారంభమైందని అంటున్నారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రేసులో ఉన్నారంటూ పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. వాటిలో ప్రముఖంగా అశోక్ గెహ్లాట్, అంబికాసోని, మల్లికార్జున్ ఖర్గే, ముకుల్ వాస్నిక్, కేసీవేణుగోపాల్, మీరాకుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ప్రస్తుత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అశోక్ గెహ్లాట్ వైపే మొగ్గు చూపుతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నారు. అశోక్ గెహ్లాట్ ను పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తే రాజస్థాన్ సీఎంగా రాహుల్ గాంధీకి సన్నిహితుడైనా రాజేష్ పైలట్ కు అవకాశం దక్కుతుందని, ఇది ఉభయతారకంగా ఉంటుందనీ ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే  సోనియాగాంధీ ఈ విషయమై అశోక్ గెహ్లాట్ ను ఢిల్లీకి పిలిపించి మాట్లాడినట్లు చెబుతున్నారు. వయోభారం కారణంగా ఆయన కూడా పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు సుముఖంగా లేరని, ఇదే విషయాన్ని ఆయన సోనియాకు చెప్పినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కానీ అసలు విషయమేమిటంటే.. తాను రాజస్థాన్ ను వదిలి వస్తే పైలట్ రాష్ట్ర సీఎం పగ్గాలు చేపడతారనీ, అదే జరిగితే రాష్ట్రంలో తన పట్టు సన్నగిల్లుతుందనీ ఆయన భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా అశోక్ గెహ్లాట్ కనుక పార్టీ పగ్గాలు చేపట్టడానికి ఇష్టపడకపోతే రేసులో  అంబికా సోనీ మల్లికార్జున్ ఖర్గే  మీరాకుమార్ కేసీ వేణుగోపాల్ ముకుల్ వాస్నిక్ లలో ఎవరో ఒకరికి ఆ పదవి దక్కే అవకాశం ఉందని పరిశీలకలు అంటున్నారు. వారందరూ కూడా గాంధీ కుటుంబానికి విధేయులేనన్న విషయం తెలిసిందే.

ఏది ఏమైనా ఈ నెల 28న జరగనున్న కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక కమిటీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) సమావేశంలో పార్టీ అధ్యక్ష ఎన్నికల తేదీని ఖరారు చేయడమే కాకుండా.. తదుపరి అధ్యక్షుడు ఎవరన్న విషయంలో కూడా పార్టీ కేడర్ కు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సీడబ్ల్యుసీ భేటీలో అధ్యక్ష ఎన్నిక తేదీని ప్రకటించడమే కాకుండా.. తదుపరి అధ్యక్షుడు ఎవరన్న క్లారిటీని కూడా క్యాడర్ కు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.  గాంధీ కుటుంబీకులు కాకుండా మరెవరైనా సరే కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టి పార్టీని నడపడం అంటే వారికి కచ్చితంగా కత్తిమీద సాము వంటిదే. ఆ పదవిలో ఉండి స్వతంత్రంగా వ్యవహరించడం అంత సులువు కాదు. పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానిగా సొంత నిర్ణయాలు తీసుకుని దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన పీవీ నరసింహరావుకు.. ఆ తరువాత పార్టీలో జరిగిన మర్యాద ‘తెలిసిందే’ అలాగే సీతారాం కేసరి కూడా. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు పార్టీలో ఎవరూ కూడా పెద్దగా ఆసక్తి చూపడంలేదని అంటున్నారు. అందరూ ముక్త కంఠంతో రాహుల్ గాంధీయే మా నాయకుడు అంటూ చివరి క్షణం వరకూ ఆయనే పార్టీ పగ్గాలు చేపట్టేలా ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. 

By
en-us Political News

  
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.