కాంగ్రెస్ లో పీకే చేరికను అడ్డుకున్నదెవరు?.. 2024ఎన్నికల్లో పీకేది ప్రేక్షక పాత్రేనా?

Publish Date:May 5, 2022

Advertisement

కాంగ్రెస్ పార్టీలో పీకే చేరికకు మోకాలడ్డిందెవరు? ఎవరికి పీకే రాకవల్ల నష్టం జరుగుతుంది? అంతా సిద్ధమయ్యాకా చివరి క్షణంలో పీకే కాంగ్రెస్ కు ఎందుకు దూరం జరిగారు? అసలింతకీ పార్టీలో చేరికకు పీకే పెట్టిన కండీషన్స్ ఏమిటి? సాధికారిక కమిటీలో భాగం కమ్మంటూ సోనియా బిగ్ ఆఫర్ ఇచ్చినా పీకే ఎందుకు వెనక్కు తగ్గారు. కాంగ్రెస్ కు దగ్గరై పీకే కోల్పోయిందేమిటి? గ్రాండ్ ఓల్డ్ పార్టీలో చేరడం లేదని ఆయన ప్రకటించినా నష్ట నివారణ కాకపోవడానికి కారణమేంటి. దేశంలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ గా గుర్తింపు పొందిన పీకే నేడు ఏకాకిగా మిగిలిపోవడానికి కారణమేమిటి?

ప్రస్తుతం రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు ఈ అంశాలపైనే చర్చలు చేస్తున్నారు. ఎవరికి వారుగా తమదైన విశ్లేషణలు చేస్తున్నారు. అసలింతకీ ఈ మొత్తం వ్యవహారం వెనుక జరిగిందేమిటి? కాంగ్రెస్ లో అధిష్టానానికి దగ్గరగా ఉండే వర్గాల కథనం ప్రకారం.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి, ఇప్పుడిప్పుడే పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్రియాశీలం అయిన ప్రియాంకా వధేరా గాంధీలే పీకే చేరికకు మోకాలడ్డారు.

 కాంగ్రెస్ లో గాంధీల ప్రాభవానికి చెక్ పెట్టి పార్టీని గుప్పెట్లో పెట్టుకుని చక్రం తిప్పాలనుకున్న పీకే కిశోర్ వ్యూహాలు బెడిసి కెట్టడానికి గాంధీ కుటుంబం ప్రతి వ్యూహమే కారణమని ఆ వర్గాలు చెబుతున్నాయి.  ముఖ్యంగా రాహూల్‌,ప్రియాంక   పీకే స్పీడుకు బ్రేకులు వేశారని చెబుతున్నాయి.   5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రియాంక వాద్రా ద్వారా కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని పీకే భావించారు. ప్రియాంక ఒత్తిడి మేరకే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తొలి రోజు సమావేశంలో పాల్గొన్న తర్వాత రాహుల్‌ గాంధీ విదేశాలకు వెళ్లిపోయారు. పీకే నియామకం జరగదని తేలడంతో ప్రియాంక కూడా విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు.

పార్టీ విజయానికి వ్యూహాలు రూపొందించాలని ప్రియాంక గాంధీ పీకేను కోరితే ఆయన అంతకు మించి..అన్నట్లుగా వ్యవహరించారనీ, రాహుల్ ప్రాధాన్యతను తగ్గించేలా పీకే చేసిన ప్రతిపాదనలను ప్రియాంక అంగీకరించలేకపోయారని అంటున్నారు. రాహుల్ ను పార్టీ పార్లమెంటరీ బోర్డుకే పరిమితం చేసి..ప్రియాంకను పార్టీ అధ్యక్షురాలిని చేయాలన్న పీకే ప్రతిపాదన తమ కుటుంబంలో చీలిక తేచ్చే వ్యూహంలా ఉందని ప్రియాంక తీవ్రంగా వ్యతిరేకించినట్లు చెబుతున్నారు. 

పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత రాహుల్ గాంధీ క్రియాశీలంగా పని చేస్తున్నారు. రాష్ట్రాల పర్యటనలతో పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ పీకే మాత్రం రాహుల్ లో నాయకత్వ లక్షణాలు లేవని బహిరంగంగా చేసిన ప్రకటన ప్రియాంక, రాహుల్ ఆగ్రహానికి కారణమైందని, అందుకే ఎన్నికల వ్యూహానికి మించి పార్టీ వ్యవహారాలలో వేలు పెట్టడానికి వీల్లేదని గట్టిగా చెప్పారనీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే పీకే పార్టీ విజయానికి చేసిన ప్రజంటేషన్ నచ్చిన సోనియా గాంధీ పార్టీ అంతర్గత వ్యవహారాల జోలికి కాకుండా సాధికార కమిటీలో భాగం అయ్యి సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ విజయానికి వ్యూహరచనకే పరిమితం కావాలని పీకేకు ప్రతిపాదించినట్ల తెలుస్తున్నది. అదే సమయంలో పీకేను రాకను పార్టీ సీనియర్ నేతలు, రాష్ట్రాల అధ్యక్షులు వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేయడం వెనుక రాహుల్, ప్రియాంక వ్యూహం ఉందని కూడా ఆ వర్గాలు వెల్లడించాయి. చివరకు సోనియా మొహమాటంతో సాధికార కమిటీలో సభ్యుడిగా పరిమితం కావాలని సూచించడంతో పీకే కాంగ్రెస్ చేరిక వ్యూహం బెడిసికొట్టిందంటున్నారు.

ఇక్కడి దాకా ఒకెత్తయితే..ఈ మెత్తం ఎపిసోడ్ లో పీకేకు రాజకీయంగా జరిగిన నష్టం మాత్రం అపరిమితం అనే చెప్పాలి. పీకే కాంగ్రెస్ గూటికి చేరేందుకు చేసిన ప్రయత్నాలు, గాంధీ కుటుంబంతో, పార్టీ అగ్ర నేతలతో ఆయన వరుస భేటీలూ ఆయనకు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో అంతవరకూ ఉన్న సత్సంబంధాలు బెడిసేలా చేశాయంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఇలా ఆయన ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న పార్టీలు పీకేను దూరంపెట్టాలని నిర్ణయించుకున్నాయి. పీకే కాంగ్రెస్ కు దగ్గర కావడానికి చేసిన ప్రయత్నాల కారణంగా ఆయన వ్యూహకర్తగా పార్టీకి సేవలందిస్తే బీజేపీకి ఆగ్రహం కలుగుతుందన్న బెదురుతో జగన్ ఆయన సేవలను వచ్చే ఎన్నికలలో ఉపయోగించుకోకూడదని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. 
ఇలా   వ్యూహాల బేహారికి దారులు మూసుకుపోవడంతో సొంత పార్టీ ప్రకటనతో రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షించడానికి చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. ఆయన పార్టీ ప్రకటనకు ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పీకే ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పాదయాత్ర పేరుతో ప్రజా సమస్యలు తెలుసుకుంటానంటూ చేసిన ప్రకటన కేవలం ఫేస్ సేవింగ్ ప్రయత్నంగా వారు అభివర్ణిస్తున్నారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతానంటూ చెప్పుకొచ్చిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు కేవలం సొంత రాష్ట్రం బీహార్ కే పరిమితం అని అంటున్నారు. బీహార్ లో కూడా ఆయన పాత్ర కీలకంగా ఉండే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
 
 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫ‌కేష‌న్ జారీ చేయ‌గానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయ‌కుడు, మాజీ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.