Publish Date:Jan 26, 2019
దేశంలోని అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ఈ ఏడాది ముగ్గురు ప్రముఖులను వరించింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, భారతీయ జనసంఘ్ నేత నానాజీ దేశ్ముఖ్, గాయకుడు భూపేన్ హజారికాలకు భారతరత్న పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. నానాజీ, హజారికాల పేర్లను మరణానంతరం పురస్కారానికి ఎంపిక చేసినట్లు ప్రభుత్వ అధికారిక ప్రకటన పేర్కొంది. నాలుగేళ్ల విరామం అనంతరం భారతరత్న పురస్కారాలను ప్రకటించారు. చివరిసారిగా 2015లో మోదీ ప్రభుత్వం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకులు మదన్మోహన్ మాలవీయలకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఇప్పటిదాకా భారతరత్న పొందిన వారి సంఖ్య 48కి చేరింది.
ఇందిరా నుంచి సోనియా వరకూ ట్రబుల్ షూటర్గా వ్యవహరించిన కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీకి మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం భారతరత్న ప్రదానం చేయాలని నిర్ణయించడం విశేషం. దాదాపు ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన 84 ఏళ్ల ప్రణబ్ రాజనీతిజ్ఞుడిగా, సంక్షోభ పరిష్కర్తగా గుర్తింపు పొందారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చేపట్టిన ఆయన.. ఆర్థిక మంత్రిగా ఎనలేని కీర్తిని ఆర్జించారు. 47 ఏళ్ల వయసులో భారతదేశానికి అతి పిన్న వయస్కుడైన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టింది కూడా ఆయనే. యూపీఏ హయాంలో అత్యంత కీలకమైన విదేశాంగం, రక్షణ, ఆర్థిక శాఖలను నిర్వహించారు. 2012-17 మధ్య కాలంలో రాష్ట్రపతిగా సేవలు అందించారు. పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రణబ్కు భారతరత్న ప్రకటించడం ద్వారా అటు బెంగాల్లో మమత, ఇటు కాంగ్రెస్ పార్టీలకు లోక్సభ ఎన్నికల ముందు మోదీ షాక్ ఇచ్చారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
కేంద్ర ప్రభుత్వం 2019 గణతంత్ర దినోత్సవం సందర్భంగా 112 మంది ప్రముఖులకు ‘పద్మ’ పురస్కారాల్ని ప్రకటించింది. ఇందులో నలుగురిని పద్మవిభూషణ్, 14 మందిని పద్మభూషణ్, 94 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి జాతీయ ఫుట్బాల్ జట్టు కెప్టెన్, ప్రపంచవ్యాప్తంగా క్రియాశీలకంగా ఉన్న క్రీడాకారుల్లో అత్యధిక గోల్స్ సాధించిన సునీల్ ఛెత్రి, 3 వేలకు పైగా సినీగీతాలు రాసిన సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఆంధ్రప్రదేశ్ నుంచి దశాబ్దకాలంగా చెస్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తూ 2011 చెస్ గ్రాండ్మాస్టర్గా నిలిచిన ప్రముఖ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక, ‘రైతునేస్తం’ ఫౌండేషన్ ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న వ్యవసాయ పాత్రికేయుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావులకు పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/what-the-bjp-hopes-to-get-out-of-bharat-ratna-for-pranab-39-85523.html
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు.
తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
Publish Date:Dec 31, 2025
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
Publish Date:Dec 31, 2025
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.