Publish Date:Jun 24, 2022
పిలవని పేరంటానికి తగుదునమ్మా అంటూ వెళ్లినట్లైంది వైసీపీ అధినేత జగన్ పరిస్థితి. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీ అడగకపోయినా బేషరతు మద్దతు ప్రకటించేసి వైసీపీ గిరిజన మహిళ కు మద్దతు ఇచ్చేశామంటూ సంబరపడిపోతోంది. అయితే రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ఇచ్చే విషయంలో రాష్ట్రానికి ఎంతో కొంత సాధించుకునేందుకు ప్రయత్నించాలన్న కనీస ప్రయత్నం కూడా జగన్ చేయకపోవడంపై పరిశీలకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పట్టుపట్టకపోయినా కనీసం అడిగే ధైర్యం కూడా చేయలేని జగన్ అసలు బీజేపీ నేతలకు కానీ, కేంద్రం కానీ ఎక్కడా బహిరంగంగా మద్దతు ఇవ్వాలని వైసీపీని అడిగిన దాఖలాలు లేవు. తనంత తానుగా మద్దతు ప్రకటించేసి ఘన కార్యం చేసినట్లు తన భుజాలను తానే తడిమేసుకుంటున్నారు జగన్. ఎన్డీయే నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటూ.. కేంద్రం నుంచి ఎవరూ జగన్ ను కోరలేదు. కనీసం ఆయన హస్తినలో పర్యటించిన సందర్భంలో ఆయన కలిసిన మంత్రులెవరూ కూడా కనీసం ఈ ప్రస్తావన తీసుకురాలేదు.
దీనిని బట్టే కేంద్రం వైసీపీకి ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటో అవగతమౌతుంది. కేంద్రం సంగతి ఎలా ఉన్నా వైసీపీ తనంత తానే రాష్ట్రపతి ఎన్నికలో తమ మద్దతు కేంద్రానికి ఎంతో కీలకమని ప్రకటనలు చేసుకున్నారు. దాంతోనే విపక్షాలు, పరిశీలకులూ కూడా జగన్ తమ కీలక మద్దతు ప్రకటించడానికి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఏమైనా సాధించుకునేందుకు ఉపయోగించుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే జగన్ కు అంత సీన్ లేదన్న వాదనలూ చేశారు. చివరికి జగన్ స్వయంగా తనకు అంత సీన్ లేదని ముర్ము అభ్యర్థిత్వానికి ఎవరూ అడగకుండానే బేషరతు మద్దతు ప్రకటించేసి రుజువు చేసుకున్నారు. గతతెలుగుదేశం ప్రభుత్వం అటు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా… బయటకు వచ్చినా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలో పోరాడింది. అందుకు భిన్నంగా జగన్ బలమున్నా వైసీపీ ఎన్డీయే భాగస్వామ్య పక్షం కాకపోయినా కనీసం నోరెత్తడానికే భయపడుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/what-is-the-reason-for-jagn-cancil-delhi-tour-25-138309.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.