మళ్ళీ వస్తా.. మాట్లాడు కుందాం.. నల్లారి రీ ఎంట్రీ సంకేతం

Publish Date:Jun 24, 2022

Advertisement

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, విభజన అనంతరం రాజకీయంగా తెరమరుగై పోయారు. రాష్ట్ర విభజన తర్వాత ‘జై సమైక్యాంధ్ర’ పేరుతో కొత్త పార్టీ పెట్టారు.2014 అసెంబ్లీ ఎన్నికలలో, చెప్పు గుర్తు, సమైక్యాంధ్ర నినాదంతో పోటీ చేశారు. అయితే, పార్లమెంట్ ఆమోదంతో, రాజ్యాంగ బద్దంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, సమైక్యాంధ్ర నినాదం ఇచ్చి ఏమి ప్రయోజనమని ప్రజలు, ఆయన గుర్తుతోనే ఆయనకు   సమాధాన మిచ్చారు. రాజీనామా చేయవలసిన సమయంలో ముఖ్యమంత్రి పదవి పట్టుకు వేళ్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు  రాష్ట్ర విభజన  జరిగిపోయిన తర్వాత  బయటకు రావడాన్ని  జనం జీర్ణించుకోలేక పోయారు. అందుకే  ఆయన్ని పట్టిచుకోలేదు. ఆ ఎన్నికలలో కిరణ్ కుమార్ రెడ్డి ఘోరంగా ఓడి పోయారు.ఇక అక్కడ నుంచి  ఆయన రాజకీయాలకు దూరంగా దాదాసే అజ్ఞాతవాసంలోకి వెళ్లి పోయారు. 

ఈ ఎనిమిదేళ్ళ కాలంలో  అప్పుడో సారి .. ఇప్పుడో సారి ఒకరి రెండు సందర్భాలలో ఆయన పేరు రాజకీయ చర్చల్లో వినిపించినా, ఆయన మాత్రం ఎక్కడా క్రియాశీలంగా కనిపించలేదు. అయిన బీజేపీలో చేరుతున్నారని లేదు ఇంకేదో పార్టీలో చేరుతున్నారని రాజకీయ చర్చలో వినిపించినా, అలాంటిదేమీ జరగలేదు. అందుకే ఆయన రాజకీయ జీవితానికి తెర పడినట్లేనని విశ్లేషకులు భావిస్తూ వచ్చారు. మధ్యలో 2018లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు, అయినా ఆ తర్వాత కూడా ఆయన సైలెంట్‌గానే ఉండిపోయారు. అయితే, ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన్ని పిలిపించి పీసీసీ బాధ్యతలు చేపట్టమని అడిగినట్లు వార్తలొచ్చాయి. అయితే, అలాంటిదేమీ లేదని వ్యక్తిగత పనుల మీదనే ఢిల్లీ వచ్చిన్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి మీడియాకు చెప్పారు. అయితే, ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు.

దీంతో, ఆయన మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారనీ, సోనియా గాంధీ ఆయనకు కీలక బాధ్యతలు ఆఫర్ చేశారనే చర్చ మొదలైంది.  అదలా ఉంటే తాజాగా, ఆయన సొంత జిల్లా అన్నమయ్య ( చిత్తూరు) జిల్లాకు రావడంతో మళ్ళీ మరోమారు, నల్లారి వార్తల్లో కనిపించారు. నిజానికి ఆయన తమ స్వగ్రామం నగరిపల్లెలో కొన్న  భూమి రిజిస్ట్రేషన్ పనుల నిమిత్తం అక్కడికి వెళ్ళారే కానీ రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనేందుకు వెళ్ళలేదు. భూమి కొనుగోలువ్యవహారం కాబట్టే, ఆయన వెంట కుమారుడు, నిఖిలేశ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.

అయితే, ఈసందర్భంగా ఆయనకు ఏపీసీసీ కార్యదర్శి అఘామోహిద్దీన్, జిల్లా కాంగ్రెస్ నేత శ్రీవర్ధన్, పలువురు నేతలు, కార్యకర్తలు అభిమానులు  స్వాగతం పలికారు. అయన వారిని పలరించారు. ఇవన్నీ సహజంగా, ఏ నాయకుడు, (మాజీ అయినా) జరిగే తంతే, అందులోనూ  మాజీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది. నల్లారి విషయంలోనూ అదే జరిగింది. అయితే,  ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులతో, ‘త్వరలోనే మళ్లీ వస్తా.. అందరినీ కలుస్తా.. ఇకపై అందుబాటులోనే ఉంటా.. అప్పుడు అందరం కూర్చొని మాట్లాడుకుందాం..’అంటూ ఆయన పలికిన వీడ్కోలు పలుకులు, రాజకీయ వర్గాల్లో ఉహాగానాలకు తెర తీశాయి.

ఆయన మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తుందని, అందుకే ఆయన మళ్ళీ వస్తా .. మాట్లాడుకుందాం  అన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే  నిజంగా, అయన రీ ఎంట్రీ ఇస్తారా ... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికిస్తారా? బతికించ గలరా? అంటే, ఆయన రీ ఎంట్రీ ఇస్తారా లేదా అనేది ఎలా ఉన్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించడం మాత్రం, ఇప్పట్లో అయ్యేపని కాదని, అ మాట  కొస్తే, కాంగ్రెస్సే కాదు బీజేపే సహా ఏ జాతీయ పార్టీకి ఇప్పట్లో ఎపీలోకి ఎంట్రీ చిక్కదని పరిశీలకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.