బస్సు ప్రమాద బాధిత కుటుంబాలపై పోలీస్ ప్రతాపం

Publish Date:Nov 30, 2013

Advertisement

 

మెహబూబ్ నగర్ పాలెం గ్రామం వద్ద వోల్వో బస్సు దగ్ధమయి అప్పుడే నెలరోజులవుతోంది. ఈ ఘోర ప్రమాదంలో45మంది నిండు ప్రాణాలు నిమిషాలలో గాలిలో కలిసిపోయాయి. అయితే అందుకు భాద్యులయిన వారిని ఒక్కరిని కూడా ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు. రవాణా అధికారులు మాత్రం అనుమతి లేకుండా తిరుగుతున్న ప్రైవేట్ బస్సులను పట్టుకొని, కేసులు వ్రాయడంతో సరిబెడుతున్నారు.

 

బాధిత కుటుంబాలకు ఇంత వరకు న్యాయం చేయలేకపోయినా, రవాణా మంత్రి బొత్ససత్యనారాయణ కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ ప్రభుత్వం తరపున మరెవరూ గానీ,  కనీసం మానవతాదృక్పదంతో వారిని కలిసి ఓదార్చాలని కూడా భావించలేదు. ఎందుకంటే రాష్ట్ర విభజన రాజకీయాలతో ఎవరికీ తీరిక లేకుండా పోయింది. ప్రజలు కూడా ఈ ఘోర దుర్ఘటన గురించి క్రమంగా మరిచిపోవచ్చు గాక. కానీ తమ ఆత్మీయులను, కొడుకులను, భర్తలను, తల్లులను పోగొట్టుకొన్న వారి దుఃఖం, బాధ ఎన్నటికీ తీరేది కాదు, మరిచిపోగలిగేది కాదు.

 

మంత్రులు, ప్రజా ప్రతినిధులు తమ వద్దకు రాకపోతే తామే వారి వద్దకు వెళ్లి గోడు వెళ్ళబోసుకొందామని బాధిత కుటుంబాలవారు కొందరు ఈరోజు మినిస్టర్స్ క్వార్టర్స్ వద్దకు వచ్చినప్పుడు, లోనున్న మంత్రులెవరు బయటకి రాకపోగా, పోలీసులు వారి నందరిని అరెస్ట్ చేసి పోలీసు వ్యానులో కుక్కి బలవంతంగా గోల్కొండ పోలీస్ స్టేషన్ కి తరలించారు.

 

అరెస్ట్ చేసిన వారిలో వృద్దులు, మహిళలు వాళ్ళ చేతుల్లో పసిపిల్లలూ ఉన్నారు. పోలీసుల తీరుతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నవారు, అక్కడకి చేరుకొన్నమీడియాతో మాట్లాడుతూ, “ఈ మంత్రులు, ప్రభుత్వానికి కనీసం మానవత్వం కూడా లేదు. ఈ దుర్ఘటన జరిగి నెల రోజులు అవుతున్నా ఇంతవరకు ఒక్కరిని కూడ అరెస్ట్ చేయకపోవడాన్ని ఏమని భావించాలి? అసలు ఇంతవరకు ఎవరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? కేసులు ఎందుకు నమోదు చేయలేదు? దోషులను వదిలి గోడు వెళ్ళబోసుకోవడానికి వచ్చిన బాధితుల మీదనా మీ ప్రతాపం చూపించేది? ఈవిధంగా అరెస్ట్ చేయడానికి మేమేమయినా ఉగ్రవాదులమా లేక క్రిమినల్స్ మా? పసిపిల్లలు, మహిళలు, వృద్ధులతో కూడా ఇంత నిర్దాక్షిణ్యంగా అసలు ఎలా వ్యవహరించగలుగుతున్నారు?మీకు ఎంతసేపు ఆంధ్ర, తెలంగాణా గొడవలే తప్ప ప్రజల ప్రాణాలకు మీ దృష్టిలో అసలు విలువ లేదా? ఒకవేళ మాకు న్యాయం చేయలేమని భావిస్తే మమ్మల్ని కూడా ఈ వ్యానులోనే పెట్టి తగులబెట్టేయండి. ఇక మీరు ఎవరికీ సంజాయిషీ చెప్పుకోనవసరం లేదు. మీకు ఎటువంటి సమస్యా కూడా ఉండదు.” అని ఆక్రోశిస్తున్నారు.

 

వారినందరినీ ఉంచిన వ్యానుని ప్రస్తుతం గోల్కొండ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిలిపి, పై అధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు.

By
en-us Political News

  
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.