బస్సు ప్రమాద బాధిత కుటుంబాలపై పోలీస్ ప్రతాపం

Publish Date:Nov 30, 2013

Advertisement

 

మెహబూబ్ నగర్ పాలెం గ్రామం వద్ద వోల్వో బస్సు దగ్ధమయి అప్పుడే నెలరోజులవుతోంది. ఈ ఘోర ప్రమాదంలో45మంది నిండు ప్రాణాలు నిమిషాలలో గాలిలో కలిసిపోయాయి. అయితే అందుకు భాద్యులయిన వారిని ఒక్కరిని కూడా ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు. రవాణా అధికారులు మాత్రం అనుమతి లేకుండా తిరుగుతున్న ప్రైవేట్ బస్సులను పట్టుకొని, కేసులు వ్రాయడంతో సరిబెడుతున్నారు.

 

బాధిత కుటుంబాలకు ఇంత వరకు న్యాయం చేయలేకపోయినా, రవాణా మంత్రి బొత్ససత్యనారాయణ కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ ప్రభుత్వం తరపున మరెవరూ గానీ,  కనీసం మానవతాదృక్పదంతో వారిని కలిసి ఓదార్చాలని కూడా భావించలేదు. ఎందుకంటే రాష్ట్ర విభజన రాజకీయాలతో ఎవరికీ తీరిక లేకుండా పోయింది. ప్రజలు కూడా ఈ ఘోర దుర్ఘటన గురించి క్రమంగా మరిచిపోవచ్చు గాక. కానీ తమ ఆత్మీయులను, కొడుకులను, భర్తలను, తల్లులను పోగొట్టుకొన్న వారి దుఃఖం, బాధ ఎన్నటికీ తీరేది కాదు, మరిచిపోగలిగేది కాదు.

 

మంత్రులు, ప్రజా ప్రతినిధులు తమ వద్దకు రాకపోతే తామే వారి వద్దకు వెళ్లి గోడు వెళ్ళబోసుకొందామని బాధిత కుటుంబాలవారు కొందరు ఈరోజు మినిస్టర్స్ క్వార్టర్స్ వద్దకు వచ్చినప్పుడు, లోనున్న మంత్రులెవరు బయటకి రాకపోగా, పోలీసులు వారి నందరిని అరెస్ట్ చేసి పోలీసు వ్యానులో కుక్కి బలవంతంగా గోల్కొండ పోలీస్ స్టేషన్ కి తరలించారు.

 

అరెస్ట్ చేసిన వారిలో వృద్దులు, మహిళలు వాళ్ళ చేతుల్లో పసిపిల్లలూ ఉన్నారు. పోలీసుల తీరుతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నవారు, అక్కడకి చేరుకొన్నమీడియాతో మాట్లాడుతూ, “ఈ మంత్రులు, ప్రభుత్వానికి కనీసం మానవత్వం కూడా లేదు. ఈ దుర్ఘటన జరిగి నెల రోజులు అవుతున్నా ఇంతవరకు ఒక్కరిని కూడ అరెస్ట్ చేయకపోవడాన్ని ఏమని భావించాలి? అసలు ఇంతవరకు ఎవరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? కేసులు ఎందుకు నమోదు చేయలేదు? దోషులను వదిలి గోడు వెళ్ళబోసుకోవడానికి వచ్చిన బాధితుల మీదనా మీ ప్రతాపం చూపించేది? ఈవిధంగా అరెస్ట్ చేయడానికి మేమేమయినా ఉగ్రవాదులమా లేక క్రిమినల్స్ మా? పసిపిల్లలు, మహిళలు, వృద్ధులతో కూడా ఇంత నిర్దాక్షిణ్యంగా అసలు ఎలా వ్యవహరించగలుగుతున్నారు?మీకు ఎంతసేపు ఆంధ్ర, తెలంగాణా గొడవలే తప్ప ప్రజల ప్రాణాలకు మీ దృష్టిలో అసలు విలువ లేదా? ఒకవేళ మాకు న్యాయం చేయలేమని భావిస్తే మమ్మల్ని కూడా ఈ వ్యానులోనే పెట్టి తగులబెట్టేయండి. ఇక మీరు ఎవరికీ సంజాయిషీ చెప్పుకోనవసరం లేదు. మీకు ఎటువంటి సమస్యా కూడా ఉండదు.” అని ఆక్రోశిస్తున్నారు.

 

వారినందరినీ ఉంచిన వ్యానుని ప్రస్తుతం గోల్కొండ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో నిలిపి, పై అధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు.

By
en-us Political News

  
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్ర‌జ‌ల్లో సంతృప్తి పెంచేలా వ్య‌వ‌హ‌రించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు.
తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ పట్లే కక్షగట్టినట్లుగా వ్యవహరించారు. ఇంత కాలం తన వెన్నంటి ఉండి, తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దౌర్జన్యాలకు దిగారు. పార్టీ అధినేతపైనా, అధినేత కుటుంబంపైనా కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తల్లిలాండి భువనేశ్వరిని సైతం దుర్భాషలాడారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.