Top Stories

dummy

political-news-img

ఆలస్యం అమృతం విషం.. యూపీఏ ఆలస్యమే భారత్ కు శాపమా?

వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియాకి ఇంధన భద్రత అన్నతి ఒక అతి పెద్ద అవరోధంగా మారింది. గత రెండు దశాబ్దాల్లో భారత్ వ్యూహాత్మక తప్పిదాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా యూపీఏ హయాంలో తీసుకున్న నిర్ణయాలపై ఇప్పటికీ పెద్ద ఎత్తున చర్చ నడుస్తూనే ఉంది. అంతర్జాతీయ రాజకీయాలు, పొరుగు దేశాలతో ఉన్న సంబంధాల కారణంగా ఈ రంగానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులను భారత్ చేజార్చుకుంది. వీటిలో ముఖ్యమైనది ఇరాన్ నుంచి పాకిస్థాన్ మీదుగా సహజవాయువు అందించేందుకు ఉద్దేశించిన పీస్ పైప్ లైన్ ప్రాజెక్టు అంటే ఇరాన్ పాకిస్థాన్ ఇండియా (ఐపీఐ) ప్రాజెక్ట్. ఇరాన్ నుండి పాకిస్థాన్ మీదుగా భారత్‌కు సహజ వాయువును అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టును పది బిలియన్ డాలర్ల వ్యయంతో 2,700 కిలోమీటర్ల పొడవుతో ఈ పైల్ లైన్ చేపట్టాలని భావించారు. అయితే.. అమెరికా ఒత్తిడి, అలాగే పాకిస్థాన్ ద్వారా గ్యాస్ తరలింపు విషయంలో తలెత్తిన భద్రతా పరమైన సందేహాలు, అనుమానాలు ఈ ప్రాజెక్టు ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అలాగే ఇరాన్‌పై ఉన్న ఆంక్షలు కూడా ఈ ప్రాజెక్ట్ నిలిచిపోవడానికి ప్రధాన కారణం. ఇక మయన్మార్ గ్యాస్ ప్రాజెక్టు. మయన్మార్‌లో గెయిల్ సంస్థ గ్యాస్ నిల్వలను కనుగొన్నప్పటికీ, దానిని భారత్‌కు తెచ్చుకోవడంలో ఇండియా విఫలమైంది. మయన్మార్ నుండి బంగ్లాదేశ్ మీదుగా భారత్‌కు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ తరలించే ప్రయత్నం జరిగినప్పటికీ బంగ్లాదేశ్ తో ఒప్పందం విషయంలో సమస్యలు తలెత్తాయి. దీంతో ఈ ప్రాజెక్టు విషయంలో భారత్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగింది. ఈ జాప్యాన్ని చైనా తనకు అనుకూలంగా మలచుకుని మయన్మార్‌తో ఒప్పందం చేసుకుంది. ఫలితంగా ఇండియాకు రావాల్సిన గ్యాస్ పైప్‌లైన్ ద్వారా చైనాకు చేరుతోంది. ప్రస్తుతం ఇండియా ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతోంది. ఇది డిపెండెన్సీ ఏటికేడు పెరుగుతూనే వస్తోంది. 2005లో ఇండియా ఇంధన దిగుమతులు 70 శాతం ఉండగా, 2025 నాటికి అవి 88 శాతానికి చేరాయి. యూపీఏ హయాంలో నిర్ణయాలు తీసుకోవడంలో జరిగిన తాత్సారం కారణంగానే ఇంధన భ్రదత విషయంలో భారత్ వెనుకబడిందన్న విమర్శలు నేటికీ ఉన్నాయి. ఇక గతంలోని లోపాలను విమర్శించుకుంటూ కూర్చోవడం కంటే దిగుమతులపై ఆధారపడటం తగ్గించి స్వయం సమృద్ధి సాధించే దిశగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగకుండా స్వతంత్రంగా దేశ ప్రయోజనాలే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. గతం గత: అన్నట్లుగా యూపీఏలో జరిగిన తప్పిదాలపై విమర్శలతో కాలం గడపడం మాని ఆ తప్పిదాలనుంచి గుణపాఠాలు నేర్చుకుని ఇంధన విషయంలో స్వావలంబనవైపు అడుగులు వేయడం ఇప్పుడు భారత్ ముందున్న తక్షణ కర్తవ్యం.

Publish Date: Apr 11, 2026 6:13PM

political-news-img

పులివెందుల పేరు అవిగొడ్డలి.. షర్మిల ట్రోలింగ్ మామూలుగా లేదుగా?

వైసీపీ అధినేత జగన్ ను ఆయన సొంత సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిల ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. జగన్ పై తెలుగుదేశం, జనసేనల పార్టీలను మించి షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా జగన్ ప్రతిపాదించిన మావిగన్ రాజధానిని టార్గెట్ చేస్తూ షర్మిల ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చవుతాయని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఆమె తిప్పికొట్టారు. ఇటీవల పార్లమెంటులో అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తించడంతో ఎన్డీయే ప్రభుత్వం మైలేజ్ సాధించగా, దానిని అడ్డుకునేందుకు వైసీపీ నెగటివ్ ప్రచారం మొదలుపెట్టింది. అమరావతి సాధ్యం కాదని, అది కేవలం భ్రమ అని ప్రచారం చేస్తున్న వైసీపీ తీరును షర్మిల ఎద్దేవా చేశారు. జగన్ ప్రతిపాదించిన మావిగన్ అనే పేరును షర్మిల జగన్ దిమ్మదిరిగేలా ఎద్దేవా చేశారు. మావిగన్ అమరావతికి ప్రత్యామ్నాయం అయితే.. పులివెందులకు అవి గొడ్డలి అని పేరుపెట్టడం సబబుగా ఉంటుందన్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరును, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వచ్చి గొడ్డలిని ముడపెడుతూ పులివెందులకు అవిగొడ్డలి అని పేరుపెట్టాలని జగన్ కు సూచించారు. అవినాష్ రెడ్డి పేరులోని అవి అక్షరాలను వివేకా హత్యకేసులో గొడ్డలికి ముడిపెడుతూ ఆమె జగన్ లక్ష్యంగా సంధించిన విమర్శనాస్త్రం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో తెగ వైరల్ అయ్యింది. జగన్ రాజధానికి ప్రతిపాదించిన మావిగన్ పేరు కంటే.. తాను పులివెందులకు సూచించిన అవిగొడ్డలి పేరు జనానికి తేలిగ్గా అర్ధమౌతుందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయాయి. జగన్ మావిగన్ ప్రతిపాదనను తిప్పికొడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు.. అమరావతి స్వయం సమృద్ధి నగరం అంటూ వివరణలు ఇచ్చుకుంటుంటే.. షర్మిల మాత్రం దూకుడుగా వైసీపీ అధినాయకత్వాన్నే లక్ష్యం చేసుకుని విమర్శలు గుప్పించా, కూటమి పార్టీల కంటే ముందున్నారు. ఇప్పుడు షర్మిల చేసిన అవి గొడ్డలి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Publish Date: Apr 11, 2026 5:20PM

political-news-img

విజయసాయి సెకండ్ ఇన్నింగ్స్!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు అది నిజమే. అలాగే రాజకీయ సన్యాసం అన్నది కూడా అంత తేలిక కాదు అని విజయసాయి చెప్పకనే చెబుతున్నారు. తాన రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి వ్యవసాయమే వ్యాపకంగా శేష జీవితం గడుపుతానని ప్రకటించిన విజయసాయి.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టడానికి రెడీ అయిపోయారు. అయితే ఈ సారి ఆయన పోలిటికల్ అవతారం డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ తో మొదలు కానుంది. ఔను ఆయన తాను దేశ వ్యాప్తంగా తన గళాన్ని వినిపించడం కోసం, తన అభిప్రాయాల ప్రచారం కోసం ఒక డిజిటల్ మీడియాను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తన మీడియా సంస్థ కార్యకలాపాలు సాగిస్తుందన్న విజయసాయి.. తన మీడియా ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయదనీ, ప్రజల సమస్యలపైనే గళమెత్తుతుందనీ చెబుతున్నారాయన. రైతులు, మహిళలు, యువత, అణగారిన వర్గాల గొంతుకగా తన మీడియా సంస్థ నిజాన్ని నిర్భయంగా వెల్లడిస్తుందని చెప్పారు విజయసాయి. వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయి.. ఇప్పుడు తన రాజకీయపంధాను ఒకింత మార్చుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భాషా సంస్కారంతో సంబంధం లేకుండా గతంలో ప్రత్యర్థులపై ఇష్టారీతిగా విమర్శలు చేసిన విజయసాయి.. ఇప్పుడు తాను ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయకుండా తటన్థంగా ఉంటానంటుండటమే ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మీడియా సంస్థలన్నీ ఏదో ఒక రాజకీయ పార్టీకి పరోక్షంగానో, ప్రత్యక్షంగానో మద్దతుగా ఉన్న తరుణంలో తటస్థం అంటూ మీడియా రంగంలోకి అడుగుపెడతానంటున్నారు విజయసాయిరెడ్డి. ఈ కొత్త నిర్ణయంపై పరిశీలకులు భిన్నరకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. జగన్ క్యాంప్ నుంచి బయటకు వచ్చినప్పటికీ విజయసాయిని తెలుగుదేశం కానీ, జనసేన కానీ దగ్గరకు రానీయడం లేదు. వైసీపీపైన ఆ పార్టీలకు ఎంత వ్యతిరేకత ఉందో, అంతకు ఏ మాత్రం తగ్గకుండా విజయసాయి మీద కూడా వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మీడియా ద్వారా బీజేపీకి దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో విషయమేంటంటే.. తెలుగు రాష్ట్రాలలో డిజిటల్ మీడియా రంగంలో నెలకొన్న తీవ్రమైన పోటీ మధ్య కొత్తగా విజయసాయి తన మీడియా సంస్థ ద్వారా ఏ మేరకు నిలదొక్కుకుంటారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఆయన వివాదాస్పద రాజకీయ ప్రస్థానం, నేపథ్యమే కారణమంటున్నారు. ఆయన మీడియా సంస్థను ఇటు వైసీపీ, అటు తెలుగుదేశం కూటమి పార్టీలూ కూడా విశ్వసించే పరిస్థితి ఉండదంటున్నారు. ఈ పరిస్థితుల్లో విజయసాయి సెకండ్ ఇన్నింగ్స్‌ ఎలా సాగుతుందన్నది ఆసక్తికరమేనంటున్నారు.

Publish Date: Apr 11, 2026 4:41PM

political-news-img

పశ్చిమాసియాలో శాంతి తక్షణావసరం.. విదేశాంగ మంత్రి జైశంకర్

పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని, అక్కడ తక్షణమే శాంతిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల సదస్సులో పాల్గొనేందుకు మారిషస్ పర్యటనలో ఉన్న ఆయన, అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లపై మాట్లాడారు. యుద్ధ వాతావరణం వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై భారత్ తన నిరసనను వ్యక్తం చేస్తోందని ఆయన తెలిపారు. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో నౌకల రాకపోకలకు ఆటంకాలు కలగడం పట్ల జైశంకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత రవాణా అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమన్న ఆయన.. దీనిని అడ్డుకోవడం మంచిది కాదన్నారు. పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగించే దాడులను భారత్ ఎప్పుడూ ఖండిస్తుందని, మానవతా దృక్పథంతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో భాగంగా జైశంకర్ కేవలం సదస్సుకే పరిమితం కాకుండా, వివిధ దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. నేపాల్, భూటాన్, సీషెల్స్ వంటి దేశాల విదేశాంగ మంత్రులతో భేటీ అయి, ఆయా దేశాలతో ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ప్రాంతీయ భద్రత, సహకారంపై కీలక చర్చలు జరిపారు. అంతర్జాతీయ నౌకాయాన భద్రతపై జపాన్ విదేశాంగ మంత్రితో కూడా జైశంకర్ ఫోన్లో సంభాషించారు. హర్మూజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో భద్రతా పరమైన ఇబ్బందులు కలగకుండా చూడాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడమే కాకుండా, సరఫరా గొలుసు పూర్తిగా తెగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న వేళ భారత విదేశాంగ మంత్రి జై శంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉద్రిక్తతలు సడిలేందుకు భారత్ చొరవ తీసుకుంటోందన్న సంకేతాలను ఇచ్చాయి.

Publish Date: Apr 11, 2026 3:29PM

political-news-img

జూనియర్ ధోనీ ముకుల్ కుటుంబ నేపథ్యం తెలుసా?

ఐపీఎల్ వేదికగా అనామక క్రికెటర్లు రాత్రికి రాత్రే స్టార్లుగా మారడం మనం చూస్తుంటాం. కానీ ఆ మెరుపుల వెనుక ఉండే చీకటి గాథలు, కుటుంబాల త్యాగాలు వర్ణనాతీతం. తాజా ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ తరపున మెరుపు ఇన్నింగ్స్ ఆడిన 21 ఏళ్ల ముకుల్ చౌదరి పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. తన ఆటతీరుతో జట్టును ఆదుకోవడమే కాకుండా, తన తండ్రి పడిన కష్టాలకు ఒక సార్థకతను చేకూర్చాడీ యువ సంచలనం. ముకుల్ ఈ స్థాయికి చేరడం వెనుక అతని తండ్రి దలీప్ చౌదరి అలుపెరుగని పోరాటం ఉంది. రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లాకు చెందిన దలీప్, తన కొడుకును ఎలాగైనా క్రికెటర్‌గా చూడాలని పెళ్లికి ముందే నిశ్చయించుకున్నారు. ఇందుకోసం ఆయన ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తనకున్న ఒకే ఒక్క ఇంటిని కూడా అమ్మేసి ముకుల్‌ను శిక్షణలో చేర్పించారు. రియల్ ఎస్టేట్, హోటల్ వంటి వ్యాపారాల్లో నష్టాలు రావడంతో బ్యాంకు అప్పులు తీర్చలేక ముకుల్ చౌదరి తండ్రి దలీప్ చౌదరి కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది. తండ్రి పడుతున్న బాధను కళ్ళారా చూసిన ముకుల్, తన లక్ష్యంపై దృష్టి సారించి అద్భుతమైన క్రీడాకారుడిగా ఎదిగాడు. వేలంలో లఖ్‌నవూ ఫ్రాంచైజీ ఇతని కోసం ఏకంగా రూ. 2.6 కోట్లు వెచ్చించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ.. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 భారీ సిక్సర్లతో విరుచుకుపడి, తన విలువ నిరూపించుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన ముకుల్, తన ఆరాధ్య దైవం ధోనీ తరహాలోనే హెలికాప్టర్ షాట్లతో మైదానాన్ని హోరెత్తించాడు. లఖ్‌నవూ జట్టు ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ ముందే చెప్పినట్లుగా, మైదానం నలుమూలలా షాట్లు ఆడగల సామర్థ్యం ముకుల్ సొంతం. ఈ విజయంతో ముకుల్ తండ్రి ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. కుమారుడికి వచ్చిన మొత్తంతో తన బ్యాంకు రుణాలను తీర్చేస్తానని ఆయన గర్వంగా చెబుతున్నారు. ముకుల్ రాబోయే మ్యాచుల్లోనూ ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే, భారత క్రికెట్‌లో మరో ఫినిషర్ దొరికినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ముకుల్ చౌదరిని అందరూ జూనియర్ ధోనీ అంటే పిలుస్తున్నారు. ఈ యువ ఆటగాడు నిలకడైన ప్రదర్శనతో టీమ్ ఇండియాలోకి అడుగుపెడతాడని ఆశిస్తున్నారు. అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తున్నారు.

Publish Date: Apr 11, 2026 3:16PM

political-news-img

చంద్రబాబు లెటర్ ప్యాడ్ లో అమరావతి అని ఎందుకు లేదు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడూ ఒక మండుతున్న నిప్పుకణమే. గత పదేళ్లుగా ఈ పేరు మారుతూ, రూపు మారుతూ ప్రజలను అయోమయంలో నెట్టేస్తోంది. తాజాగా అమరావతికి చట్టబద్ధత లభించింది. అయితే వైసీపీ అధినేత రాజధానిగా ప్లాన్ బి అంటూ చేసిన మావిగన్ ప్రతిపాదన సంచలనంగా మారింది. దానిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది కూడా. ఈ నేపథ్యంలోనే తెలుగువన్ వాస్తవ వేదిక లో జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్, తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ రాజధాని భవిష్యత్ పై సమగ్రంగా చర్చించారు. ఈ చర్చలో డోలేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అసలు ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్' అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై డోలేంద్ర ప్రసాద్ తెలుగువన్ వాస్తవ వేదికలో కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. ప్రభుత్వ విధానాల్లో ఉన్న అస్పష్టతను, రాజకీయ నాయకుల ద్వంద్వ విధానాలనూ ఎండగట్టారు. ముఖ్యంగా జగన్ మావిగాన్' కాన్సెప్ట్, ప్రస్తుత అమరావతి అభివృద్ధిపై ఆయన నిష్కర్షగా తన అభిప్రాయాలను వెల్లడించారు. రాజధాని అనేది కేవలం భవనాల సముదాయం కాదని, అది ఒక జీవకళతో ఉట్టిపడే నగరం కావాలన్నారు. 2014లో విభజన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం, అక్కడ భారీ స్థాయిలో భూసేకరణ చేపట్టింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులంటూ అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించి పాలన వికేంద్రీకరణ అంది. అయితే అది మాటలకే పరిమితమైంది. ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తింపు పొందిన తరువాత జగన్ అమరావతిపై తన వ్యతిరేకతను స్పష్టంగా చాటుతూ.. విజయవాడ-గుంటూరు ప్రాంతాన్ని కలిపి మావిగాన్ అంటూ చేసిన కొత్త ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాస్తవ వేదికలో డోలేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. అమరావతి పేరు ముఖ్యమంత్రి లెటర్ హెడ్ మీద ఉందా అని ప్రశ్నించారు. అమరావతి పేరు సీఎం లెటర్ హెడ్ మీదే లేకుంటేఇన్వెస్టర్లకు నమ్మకం ఎలా కలుగుతుందని నిలదీశారు. అమరావతి-విజయవాడ ప్రాంతానికి వాస్తు దోషం ఉందంటూ వస్తున్న ప్రచారాన్ని పాలకులు ఎలా విస్మరిస్తారన్నారు. రాజధానిలో కేవలం మాల్స్ కడితే సరిపోదని, అక్కడ జనం రాకపోకలు ఉండాలని, అప్పుడే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల జీవనోపాధికి అక్కడ చోటు ఉండాలన్నారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో రాజకీయ నాయకుల మధ్య సంకుచిత మనస్తత్వం ఎక్కువైందని, ఒక ప్రభుత్వం మొదలుపెట్టిన పనిని మరొక ప్రభుత్వం నాశనం చేయడం రాష్ట్ర దౌర్భాగ్యమన్నారు. రాజధాని ఒక డెడ్ సిటీలా మారకుండా ఉండాలంటే తక్షణమే అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండాలని చెప్పారు. చంద్రబాబు అమరావతి నిర్మాణం విషయంలో ఇసుమంతైనా జాప్యం లేకుండా మళ్లీ ఎన్నికలు వెళ్లేలోగానే పూర్తి చేయాలన్నారు. వచ్చే రెండు మూడేళ్లలో అమరావతికి ఒక స్పష్టమైన రూపురేఖలు వస్తాయని, ఆ తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా దాన్ని కాదనలేని విధంగా అభివృద్ధి జరగాలన్నారు. జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్, తెలుగువన్ ఎండీ కంఠంనేనిల చర్చను తెలుగువన్ వాస్తవ వేదికలో వీక్షించండి

Publish Date: Apr 11, 2026 2:21PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img