చిరంజీవికి కోపమొచ్చింది

Publish Date:Nov 30, 2013

Advertisement

 

రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం, తన మెగా పార్టీని పణంగాపెట్టి మరీ సంపాదించుకొన్న కేంద్రమంత్రి పదవికి ఎప్పుడో రాజీనామా గీకి పడేసినా, ఇంకా ఈ అశోక్ బాబు లాంటి వాళ్ళు అవాకులు చవాకులు వాగుతుంటే, అలుగుటయే ఎరుంగని ధర్మరాజు వంటి చిరంజీవికయినా కోపం రాకపోదు.

 

అయినపట్టికీ పంటి బిగువున ఓర్చుకొంటూ డిల్లీలో అధిష్టానం చుట్టూ తిరుగుతూ రాష్ట్రం విడగొడితే ప్యాకేజీలు ఇస్తే తప్ప ఊరుకొనేది లేదని, భద్రాచలం మాదేనని ఆయన ఎంత గట్టిగా వాదిస్తున్నారో ఆ అశోక్ బాబుకి తెలుసా?ఎంత సేపు చిరంజీవి రాజీనామా చేయలేదని ఆయన మీద పడి ఏడవడమే కానీ, ఆ అశోక్ బాబు రాజీనామా చేసారా? అంటూ ఆయన కూడా చాలా కోపడిపోయారు. తను పదవికి రాజీనామా చేసినా, ప్రధానమంత్రి ఆకాయితం ముక్కని ఎక్కడో పడేసుకొంటే దానికి కూడా తననే నిందించడం భావ్యమా? అని ఆ జీవి పాపం చాలా బాధ పడిపోయారు.

 

అయినా కాయలున్నచెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు నిస్వార్ధంగా ప్యాకేజీలకోసం కృషి చేస్తున్నతనవంటి ప్రజాసేవకులకే ఈ సూటిపోటి మాటలు తప్పవని సర్ది చెప్పుకొని, సోనియమ్మని కలిసి హైదరాబాదుని పదేళ్ళకో, పాతికేళ్ళకోసమో యూటీగా చేసి తీరవలసిందేనని, లేకుంటే తన కేంద్ర మంత్రి పదవికి ఈసారి నిజంగానే రాజీనామా చేస్తానని గట్టిగా చెప్పేందుకు బయలుదేరారు.

 

అయితే శుభమా అని బయలుదేరుతుంటే ఈ మీడియా వాళ్ళు పిల్లిలా ఎదురవడమే కాక అర్ధం పర్ధం లేని ప్రశ్నలు వేస్తూ అతితెలివి ప్రదర్శిస్తుంటారు. “ఈసారి మేడం గారిని ఏమేమి అడగబోతున్నారు?” అంటూ అమాయకంగా ప్రశ్నిస్తారు. తీరాచేసి జేబులోంచి ఓ పెద్ద లిస్టు బయటకి తీసి అంతా చెప్పిన తరువాత, “అయితే మీరు రాష్ట్రం విడిపోవాలని కోరుకొంటునట్లే కదా?”అని ప్రశ్నిస్తే ఎటువంటి జీవికయినా నిజంగా కాలుతుంది.

 

ఈసారి కూడా వాళ్ళు ఆ మెగామంత్రిగారు ఇంట్లోంచి బయటకు వస్తుంటే ఆయన మొహం మీద కెమెరా పెట్టి మళ్ళీ అదే ప్రశ్నను ఇంకోలా అడిగి ఇరికించేదామనుకొన్నారు.

 

ఒకసారి పొరపాటు చేస్తే మామూలు జీవి. రెండుసార్లు చేస్తే చిరంజీవి. మూడు సార్లు చేస్తే మెగాజీవి అవుతారు. కానీ, నాలుగయిదు నెలలుగా డిల్లీ నీళ్ళకి బాగా అలవాటుపడిన మీడియా వేసే ఈ చిలక ప్రశ్నలకి కూడా తడబడకుండా సమాధానం చెప్పలేకపోతే ఈ కాంగ్రెస్ జీవికి ఎంత నామోషీ అనుకొంటూ ‘అయితే అడుకోండి’ అన్నారు.

 

అప్పుడు మీడియా వాళ్ళు “అయితే మీకు రాయల తెలంగాణా ఓకేనా? కాదా?”అని చిన్న ప్రశ్న అడిగారు.

 

"హా..హా...నేను ‘ఓకే!’ అనో లేక ‘నాట్ ఓకే!’ అనో జవాబు చెపితే మళ్ళీ నన్ను ఇరికించేదామనుకొన్నారు ఈ వెర్రి సన్నాసులు" అని మనసులోనే నవ్వుకొంటూ, రాజీనామా చేసిన మన కేంద్ర మంత్రిగారు తన మొహం మీడియ వైపుకి ఓసారి గంభీరంగా టర్నింగ్ ఇచ్చుకొని, “నాకు రాయల తెలంగాణా టాపిక్ తో అసలు సంబంధం లేదు. అది నేను మాట్లాడే సబ్జక్ట్ కానే కాదు. దాని గురించి వెళ్లి కోట్ల గారిని అడగండి. నేను కేవలం ‘హైదరాబాద్ యూటీ’ అనే టాపిక్ గురించే మాట్లాడుతాను. మీకు ఆ సబ్జెక్ట్ మీద ఏవయినా డౌట్స్ ఉంటే అడుకోండి."

 

"రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా రెండు రాష్ట్రాలలో పరిపాలన సవ్యంగా జరగాలంటే హైదరాబాదుని వీలయితే శాశ్వితంగా లేకుంటే కనీసం పదేళ్ళకోసమయినా యూటీ చేసి తీరాల్సిందే. లేకుంటే బోలెడు ప్రొబ్లెంస్. అందుకే నేను ఇప్పుడే సోనియా మాడం వద్దకు వెళ్లి ఈవిషయం గురించి గట్టిగా చెప్పిరావాలని బయలు దేరుతున్నాను. కానీ మధ్యలో మీ వల్ల ఆలశ్యం అయిపోతోంది,” అంటూ కారులోకి ఎక్కబోయారు.

 

“అయితే మీరు రాష్ట్రం విడిపోవాలని కోరుకొంటునట్లేనని మమ్మల్ని రాసేసుకొమ్మంటారా?” అని అమాయకంగా మొహం పెట్టుకొని మీడియావాళ్ళు ప్రశ్నించారు.

By
en-us Political News

  
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఓ వైపు జగన్ ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి తన వంతు ప్రయత్నాలను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వారంతం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతున్నారు.
ఇటీవలి ఎన్నికలలో ఎదురైన ఘోర పరాజయాన్ని వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నాడు. త‌న రాజ్యాన్ని శ‌త్రువులు ఆక్ర‌మించుకున్నార‌న్న రీతిలో ఆయన వ్య‌వ‌హార‌శైలి ఉంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఢిల్లీ విమానాశ్రయంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
జగన్ తన కుర్చీలో నల్లులు కుట్టినట్టుగా టక్కుమని లేచి నిల్చున్నారు. జగన్ లేచి నిల్చున్న తీరు చూసి, అక్కడున్న జర్నలిస్టులకి జగన్ని కుర్చీలో వున్న  నల్లులు బాగా కుట్టాయేమో అనిపించింది.
గుంటూరుకు చెందిన సీనియర్ పాత్రికేయుడు శాఖమూరు శ్రీనివాస ప్రసాద్ కు గౌరవ డాక్టరేట్ లభించింది.
తాను ఈ నరకం ఇక భరించలేనని, అప్రూవర్ అయిపోతానని, ఆ దిశగా ప్రయత్నాలు చేయమని కవిత భర్తని రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి జగన్ ఐదేళ్ల పాలనలో అక్షరాలా ఆరులక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఔను తన ఆర్థిక అరాచకత్వంతో జగన్ రాష్ట్రాన్ని దివాళా అంచుకు చేర్చేశారు
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా పేర్కొంటూ ఐదేళ్లు గడిపేశారు. మూడు రాజధానులు అంటూ అమరావతిని నిర్వీర్యం చేయడం వినా ఆయన చేసిందేమీ లేదు. అయినా విశాఖ రాజధాని అంటూ ఉత్తరాంధ్రప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపడానికి శతథా ప్రయత్నించారు.
అమెరికా అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ పేరు ఖరారు అయ్యే దశలో వున్న నేపథ్యంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా నుంచి ఆమెకు మద్దతు లభించింది.
దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ళ సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ మరణించాడు.
పోలవరం జాతీయ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రతి పైసా కేంద్రమే భరించాలి. అలా భరిస్తామని కేంద్ర విత్తమంత్రి నిర్మలాసీతారామన్ ఇటీవలి తన బడ్జెట్ ప్రసంగంలో విస్పష్టంగా చెప్పారు కూడా.
ఫ్యాషన్‌కి పుట్టిల్లు అయిన ప్యారిస్ నగరంలో నేటి నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. విశ్వక్రీడలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ప్యారిస్ నగరం సిద్ధమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.