Publish Date:Dec 17, 2019
ఎదుటి వ్యక్తిని విమర్శించడం సంగతి తరువాత.. ముందు నువ్వు ఎలా ఉన్నవో చూసుకో అని పెద్దలు చెప్తుంటారు. ఈ విషయం వైసీపీ నేత విజయసాయి రెడ్డికి తెలిసినట్టు లేదు. అందుకేనేమో ట్వీట్ చేసి మరీ నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల వైసీపీ నేతలు నారా లోకేష్ ని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేగా గెలవలేకపోయారని విమర్శలు చేస్తున్నారు. ఆఖరికి అసెంబ్లీలో కూడా.. కొడుకుని గెలిపించుకోలేని చేతకాని సీఎం చంద్రబాబు అంటూ.. లోకేష్ ని ప్రస్తావిస్తూ రోజా విమర్శలు చేసారు. అయితే ఈ విమర్శలకి లోకేష్ కౌంటర్ ఇచ్చారు. నేను చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొనే బ్యాచ్ కాదు. నేను కావాలనుకుంటే మా నాన్న గెలిచిన కుప్పం నుంచి పోటీ చేసి.. గెలిచానని కాలర్ ఎగరేయొచ్చు. కానీ నేను ఆ బ్యాచ్ కాదు. ఎక్కడైతే టీడీపీ బలంగా లేదో అక్కడ పోటీ చేసి గెలవాలనుకున్నా. మంగళగిరిలో 1985 నుండి టీడీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. అందుకే అక్కడ పోటీ చేసి గెలిచి చరిత్ర తిరగరాయాలనుకున్నా. ఆ దిశగా పని చేశా. కానీ ఓటమి ఎదురైంది. అయినా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా అని లోకేష్ చెప్పుకొచ్చారు.
కాగా లోకేష్ వ్యాఖ్యలపై తాజాగా విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. "చరిత్ర సృష్టించేందుకే మంగళగిరిలో పోటీ చేశాడట చిట్టి నాయుడు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకనే కదా దొడ్డి దారిన ఎమ్మెల్సీ, మంత్రి అయింది. ఈ చరిత్ర సృష్టించాలన్న తాపత్రం ఏమిటో? రెండొందల కోట్లు వెదజల్లినా మంగళగిరిలో చిత్తుగా పరాజయం పాలయ్యావు. ఇకనైనా బడాయి మాటలు మానుకో చిట్టీ." అని విజయ సాయి ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ట్వీట్ ని ఎంజాయ్ చేస్తుండగా.. కొందరు మాత్రం విజయ సాయి పై విమర్శలు గుప్పిస్తున్నారు. "అక్కడకి నివేదో ప్రత్యేక్ష రాజకీయాల్లో పోటీ చేసి గెలిచినట్టు బిల్డప్ ఇస్తున్నావ్"... "నువ్వు ఎక్కడ పోటీ చేసి రాజ్యసభ mp అయ్యావు తాతా.. ఎన్ని సూట్ కేస్ లు మార్చితే ఎంపీ అయ్యావు చెప్పు తాతా".. అంటూ కామెంట్స్ తో విజయసాయిపై విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijayasai-reddy-satirical-tweet-on-nara-lokesh-39-92301.html
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. గురువారం (జులై 10) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 29 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
నటుడు ఫిష్ వెంకట్ చికిత్సకు అయ్యే మొత్తం వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వం భరించేందుకు ముందుకు వచ్చింది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉన్న ఫిష్ వెంకట్ చికిత్సకు అయ్యే వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఒక జర్నలిస్టు బలవన్మరణానికి పాల్పడ్డారు.
గత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం కారణంగా తెలంగాణకు పూడ్చలేని నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ నాయకత్వ బాధ్యతల్లో కీలక మార్పులు చేసింది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ విలియమ్స్ కంపెనీని వీడనుండటంతో.. సీఈవో టిమ్కు కుక్కు అదనపు బాధ్యతలను అప్పగించింది.
గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్ వడోదరాలోని మహిసాగన్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి ఒక్కసారిగా కూలింది.
గుంటూరు జిల్లా తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీల లెక్కింపులో రద్దైన పాత రూ.1000, రూ.500 నోట్లు ప్రత్యక్షమయ్యాయి.
గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామం గల గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎరువుల కొరత లేకుండా రాష్ట్రానికి సహకరిస్తామని తెలిపింది. యూరియా కోటా పెంచాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్రానికి ఇటీవల విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ టికెట్ల వివాదంలో విజిలెన్స్ నివేదికతో చర్యలు ప్రారంభించారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీలో ప్రభుత్వం రైతాంగానికి తీపి కబురు చెప్పింది. బుధవారం (జులై 9) వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ధాన్యం పాత బకాయిలు రూ.1000 కోట్లలో రూ. 672 కోట్ల నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా సాగుతోంది. తొలి అడుగుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం తుది దశకు వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలను వినూత్నంగా అభివృద్ధి చేస్తున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ బుధవారం అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు. భోజనం కోసం వచ్చిన సామాన్య ప్రజలతో పాటు నిలుచుని, జేబులో నుండి ఐదు రూపాయలు చెల్లించి క్యాంటీన్లో భోజనం అందుకున్నారు.