ఒకే ఒరలో రెండు కత్తులు.. టిఆర్ఎస్ లో మున్సిపల్ రగడ మొదలైంది!!

Publish Date:Dec 17, 2019

Advertisement

తాజాగా ఉన్నత న్యాయస్థానంలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో అధికార పార్టీ ఎన్నికల కసరత్తు మొదలు పెట్టింది. దీనిలో భాగంగానే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లకు సంబంధించిన అభ్యర్థుల వివరాలు అందించాలని పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేలను కోరింది. ప్రతి నియోజకవర్గంలో పూర్తి బాధ్యతలను అక్కడి ఎమ్మెల్యేలకే కట్టబెట్టారు. అయితే అసలు పంచాయితీ ఇక్కడే మొదలైంది. కొన్ని నియోజక వర్గాల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని చోట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరగా కొందరు ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చి టిఆర్ఎస్ టిక్కెట్ మీద గెలిచారు. దీంతో అక్కడ మాజీ ఎమ్మెల్యే వర్సెస్ తాజా ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ మొదట్నుంచీ నడుస్తోంది. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కసరత్తు నడుస్తున్న నేపధ్యంలో టిక్కెట్ల విషయంలో తాజా, మాజీ ఎమ్మెల్యేలకు పడటం లేదు. మావాడికి అవకాశమివ్వాలి అంటే మా వాడికి ఇవ్వాలనీ పోటా పోటీగా అభ్యర్ధులు తెరమీదకు తీసుకొస్తున్నారు.

రీసెంట్ గా ఉమ్మడి పాలమూరు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే జూపల్లి , ప్రస్తుత ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డిల మధ్య గొడవ జరిగాయి. ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల విషయంలో కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ ఇద్దరు నేతలు తమ అనుచరులను తెరమీదకు తీసుకొస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ అధిష్ఠానానికి ఇబ్బందిగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్డీ జానీ తానే చైర్మన్ అభ్యర్థి అని ప్రచారం చేసుకుంటున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలకు ఇది మింగుడు పడటంలేదు, ఇదే విషయాన్ని జిల్లా పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. ఇక రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.. స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఎన్నికల వేళ మహీందర్ రెడ్డి నియోజక వర్గాల్లో పర్యటిస్తూ తన అనుచరులను ఉసిగొలుపుతూ ఇబ్బందులు కలిపిస్తున్నారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఇలా దాదాపు వేరే పార్టీ ఎమ్మెల్యేలున్న ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి సమస్యలే ఎదురు కావడంతో ముందస్తు చర్యలు ప్రారంభించారు గులాబీ బాస్. కొత్త ,పాత పంచాయతీ లేకుండా చూసి ఎన్నికల సాఫీగా జరిగేలా చూడాలని మంత్రులు ఆదేశించినట్టు తెలుస్తోంది.

By
en-us Political News

  
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేం ఎవరితో కలిసి ప్రసేక్తే లేదు. తెలంగాణ ఉన్నంతకాలం మా పార్టీ ఉంటుందన్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్‌ మాట్లాడారు
తిరుమల శ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్ నాయుడు తో కలిసి తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీలో అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌ల మధ్య మాటల యుద్దం రెండు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. వారి డైలాగ్ వార్‌లోకి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంట్రీతో అగ్గికి మరింత ఆజ్యం పోసినట్లైంది.
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌‌ కేసులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. తన వద్దకు వచ్చిన దంపతులకు ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టలేరని, సరోగసితో పిల్లలు పుడతారని నమ్మించారు. సరోగసితో కోసం వేరే దంపతులకు రూ. 5లక్షలు ఇవ్వాలని చెప్పారు.
అన్నమయ్య జిల్లా నందలూరులో జయంతి ఎక్స్‌ప్రెస్ రైలు కింద భాగం లో పొగలు వచ్చాయి. కన్యాకుమారి నుండి పూణే మధ్య ఈ జయంతి ఎక్స్ప్రెస్ నడుస్తుంది. ఆదివారం రైలు లోని ఏసీ భోగి లోని కింద భాగంలో పొగలు రావడంతో గమనించిన ప్రయాణికులు గార్డుకు సమాచారం ఇచ్చారు.
బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురైన విద్యార్థులను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలోని బాలిక వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ 150 మంది విద్యార్థులు ఆస్పపత్రిలో చేరారు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం సింగపూర్‌లో దౌత్య కార్యక్రమాల్లో బిజీగా మారింది. ఈ క్రమంలో తాజాగా భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు 2009 ఎన్నికల్లో సిరిసిల్ల ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు బృందం భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో భేటీ అయ్యింది. హైకమిషనర్ శిల్పక్ అంబులే సింగపూర్‌‎లో ఆరోగ్యం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమీ కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు.
హైదరాబాద్ కొండాపూర్‌లో రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. శనివారం రాత్రి ఎస్వీ నిలయం అపార్ట్ మెంట్ లో కొంతమంది రేవ్ పార్టీకి ఏర్పాట్లు చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి పార్టీని భగ్నం చేశారు.
తిరుమల శ్రీవారి సేవలో నేడు ప్రముఖులు పాల్గోన్నారు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ, మంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీ ఛీఫ్ సెక్రటరీ కె.విజయానంద్, కింగ్‌డమ్ మూవీ టీమ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, నిర్మాత నాగ వంశీ ఉదయం శ్రీవారిని దర్శంచుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ చేరుకున్నారు. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు సీఎం సింగపూర్ లో పర్యటించనున్నారు.
యూపీలోని హరిద్వార్ మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనల్లో ఆరుగురు భక్తులు మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యానట్లు తెలుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.