జగన్ ని తప్ప ఎవ్వర్నీ నమ్మనంటున్న బుట్టా రేణుక.. త్వరలో పదవి!
Publish Date:Dec 17, 2019

Advertisement
2014 ఎన్నికల్లో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన బుట్టా రేణుక వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి సంచలనం సృష్టించారు. అలాంటి బుట్టా రేణుక కొన్ని కారణాల వల్ల కొందరి ఒత్తిడి కారణంగా టిడిపిలో చేరారు. మొదట భర్తతో పాటు పార్టీలో చేరాలని వెళ్లి..తనకు జగన్ పై అభిమానంతో చేరకుండా వెనక్కి వచ్చారు. ఆమె భర్త మాత్రం టిడిపిలో చేరారు. అప్పటి నుంచి రేణుకపై ఒత్తిడి పెరిగింది. చివరకు చేసేదేమీ లేక టిడిపిలో చేరారు. టిడిపిలో చేరి అక్కడ అవమానాలు తట్టుకోలేక మళ్లీ వైసీపీలో ఎలాంటి షరతులు లేకుండా చేరి.. పొరపాటుకు క్షమాపణలు కూడా చెప్పారు.
టిడిపిలో కర్నూలు పార్లమెంట్ టికెట్ లేదా అసెంబ్లీ టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆమె ఆవేదనను వ్యక్తం చేశారు. మళ్లీ వైసీపీలో చేరిన రేణుక పార్టీ విజయం కోసం కర్నూలు జిల్లాలో ప్రచారం చేశారు. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెకు ఏదో ఒక పదవి వస్తుందని అందరూ భావించారు. అయితే ముందస్తుగా ఎటువంటి షరతులు లేకుండా పార్టీలో చేరిన కారణంగా పదవుల్ని అడగటానికి సంకోచిస్తున్నారు. అయినప్పటికీ బుట్టా రేణుకకు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇచ్చేందుకు జగన్ సుముఖంగా ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బుట్టా రేణుక తమ వ్యాపారంలో బిజీ అయ్యారు. హైదరాబాద్ లోని మెరిడియన్ స్కూల్ నిర్వహణను తనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం కొడుకు పెళ్లి వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు, ఆమెకి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇచ్చే అవకాశాలున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తదితరులు హామీ ఇచ్చినట్టుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. అయితే దీని పై బుట్టా రేణుక ఎలాంటి ప్రకటన చేయడం లేదు. జగన్ ఏ బాధ్యతలు అప్పగించిన విజయవంతంగా నిర్వహిస్తానంటున్నారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ ను తప్ప మరొకరిని నమ్మను అని కుండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/butta-renuka-likely-to-get-either-mlc-or-rajya-sabha-seat-39-92296.html












