political-news-img

రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖరారయ్యారు. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి మరోసారి అవకాశం కల్పించగా, ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు రేపు వారిద్దరూ అసెంబ్లీ సెక్రటరీకి తమ నామినేషన్ పత్రాలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఇతర కీలక నేతలు పాల్గొననున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ బలం దృష్ట్యా వేం నరేందర్ రెడ్డితో పాటు అభిషేక్ మను సింఘ్వీ ఎన్నిక దాదాపు ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి ఎంపికతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Publish Date: Mar 4, 2026 10:14PM

political-news-img

రో-కోల కోసం కివీస్ టూర్ షెడ్యూల్లో కీలక మార్పులు..

టీమిండియా వెటరన్ స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల కోసం బీసీసీఐ న్యూజిలాండ్‌తో సిరీస్‌నే మార్చేసింది. రో-కోలు ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. వారికున్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్యాష్ చేసుకోవడానికి కివీస్ క్రికెట్ బోర్డు చేసిన ప్రతిపాదనకు బీసీసీఐ నిరభ్యంతరంగా అంగీకరించిందంట. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. షెడ్యూల్ ప్రకారం అక్కడ ఐదు టీ20లు, రెండు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే టీ20 సిరీస్‌ను తగ్గించి.. వన్డే సిరీస్‌లో అదనంగా రెండు మ్యాచ్‌లు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. వన్డే ప్రపంచ కప్ సమీపిస్తోన్న తరుణంలో రోహిత్, విరాట్ కోసం బీసీసీఐ ఈ మార్పు చేయనుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ఈ ప్రతిపాదనను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డే బీసీసీఐకి పంపినట్లు తెలుస్తోంది. వన్డే మ్యాచ్‌లు పెరిగితే రోహిత్, విరాట్ లాంటి స్టార్ ప్లేయర్లు ఎక్కువగా మైదానంలో ఉండే అవకాశం ఉంటుంది. దీంతో టీవీ రేటింగ్స్, స్పాన్సర్ల ఆదాయం కూడా పెరుగుతుందని న్యూజిలాండ్ భావిస్తోంది. ఈ ప్రతిపాదనకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ అంశంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ ఏడాది టీమిండియా.. జూన్‌లో అఫ్గానిస్తాన్, జులైలో ఇంగ్లండ్, ఆ తర్వాత వెస్టిండీస్, ఏడాది చివరిలో శ్రీలంక జట్లతో వన్డే సిరీస్‌లు ఆడనుంది. సిరీస్‌లన్నీ వరల్డ్ కప్‌నకు సన్నాహకంగా ఉపయోగపడనున్నాయి.

Publish Date: Mar 4, 2026 9:58PM

political-news-img

వైసీపీ సభ్యుల నిరసనలతో మండలి రేపటికి వాయిదా

ఏపీ శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ఆందోళనతో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో చైర్మన్ మోషేన్ రాజు సభను గురువారానికి (5-3-26) వాయిదా వేశారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతుండగా వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. చైర్మన్ పోడియం ఎక్కి నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. అంతకముందు.. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో మండలిలో రగడ చోటుచేసుకుంది. మాజీ సీఎం జగన్‌ను క్రిస్టియన్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు ఆందోళకు దిగారు. దీంతో సభను ఒకసారి వాయిదా వేశారు చైర్మన్. తిరిగి మొదలైన తర్వాత కూడా.. జగన్‌కు క్షమాపణ చెప్పాలని వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘జగన్‌ను నేను క్రిస్టియన్ అని అన్నాను, ఆ మాటకు కట్టుబడి ఉన్నాను’ అని స్పష్టం చేశారు. జగన్ క్రిస్టియన్ కాదని చెప్పమనండి అంటూ సవాల్ విసిరారు. ‘జగన్ కూడా టీవీలో చూసి ఉంటారు కదా ... కాదని చెప్పమనండి’ అని మంత్రి అన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కుటుంబంతో తిరుమల దర్శనానికి ఎందుకు రాలేదని నిలదీశారు. వైసీపీ సభ్యులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. దీంతో వైసీపీ సభ్యులు పోడియం వద్దకు వచ్చి జగన్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రసంగించారు. వైసీపీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ వారిపై తీవ్ర వ్యక్తం చేశారు. ‘రూ.320లకు కిలో ఆవు నెయ్యి ఎక్కడైనా దొరుకుతుందా?’ అని ప్రశ్నించారు. వీళ్లు హిందువులు ఎలా అవుతారంటూ వైసీపీ సభ్యులను ఉద్దేశించి అన్నారు. రూ.320లకు ఆవు నెయ్యి కొనాలని అడుగుతున్న వైసీపీ సభ్యులు.. ఎమ్మెల్సీలు ఎలా అయ్యారని నిలదీశారు. సోమువీర్రాజు మాట్లాడుతున్న సమయంలో పోడియం వద్ద వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో చైర్మన్ సభను గురువారానికి(మార్చి 5) వాయిదా వేశారు.

Publish Date: Mar 4, 2026 9:41PM

political-news-img

రాజ్యసభకు నితీష్‌కుమార్...బీహార్ సీఎంగా బీజేపీ అభ్యర్ధి?

కేంద్రంతో పాటు బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశాలున్నాయని, అలాగే నితీశ్ తనయుడు నిషాంత్ కుమార్‌ బిహార్ ఉప ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం జరుగుతోంది. తద్వారా నితీశ్ కుమార్ స్థానంలో బీజేపీ తమ సొంత అభ్యర్థిని ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, నిషాంత్ కుమార్‌ను రాజ్యసభకు నామినేట్ చేయవచ్చనే ప్రచారం కూడా ఇంతకుముందు జరిగింది. అయితే ఇంతవరకూ ఆయన అభ్యర్థిత్వానికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు సిద్ధం కాలేదు. నిషాంత్ కుమార్ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టడం ఖాయమని మాత్రం జేడీయూ వర్గాలు చెబుతున్నాయి. బిహార్‌లో 5 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. జేడీయూ రెండు స్థానాలకు గెలుచుకునే అవకాశం ఉంది. జేడీయూ శాసనసభా పక్షం కూడా గురువారం (5-3-26న) సమావేశమవుతోంది. ఈ సమావేశంలో కేంద్రంలో నితీశ్ ప్రధాన పాత్ర పోషించడానికి అంగీకరించే విషయంపై చర్చ జరగవచ్చని తెలుస్తోంది. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 200 సీట్లకు పైగా స్థానాలను గెలుచుకుని విజయకేతనం ఎగురవేసింది. బీజేపీ 89 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మిత్రపక్షాలైన జేడీయూ 85 స్థానాలతో రెండో స్థానంలోనూ, లోక్‌జన్‌శక్తి పార్టీ (రామ్‌విలాస్) 19 స్థానాలతో మూడో స్థానంలోనూ నిలిచాయి.

Publish Date: Mar 4, 2026 9:08PM

political-news-img

అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణ పోలీసులకు మావోయిస్టు అగ్రనేతలు టచ్‌లోకి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా పార్టీకి దీర్ఘకాలం ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ముప్పాళ్ల లక్ష్మణరావు (గణపతి) లొంగుబాటుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు భద్రతా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గణపతి తరఫున తెలంగాణ పోలీసు లకు సంకేతాలు వెళ్లినట్లు సమాచారం. భద్రతా సంస్థలతో మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు ప్రారంభమయ్యాయని, సురక్షిత లొంగుబాటు కోసం నిబంధనలు, హామీలపై చర్చలు సాగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా పోలీసులు ఎలాంటి ప్రకటన చేయ లేదు. ఇటీవల మావోయిస్టు నేత దేవ్‌జీ లొంగిపోయిన సందర్భంలో గణపతి ఆచూ కీపై కీలక సమాచారం లభిం చిందని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. దేవ్‌జీ సమర్పణ తర్వాత మావో యిస్టు అగ్రనేతల కదలికల పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గణపతి ఆరోగ్య పరిస్థితి, వయసు, అలాగే మావోయిస్టు కార్యకలాపాల బలహీనత నేపథ్యంలో ఆయన లొంగుబాటుకు ఆసక్తి చూపుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తు న్నాయి. కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థలు సమన్వయంతో పరిస్థితిని గమనిస్తున్నట్లు సమాచారం.గణపతి లొంగుబాటు అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. పోలీసులు లేదా ప్రభుత్వ వర్గాల నుంచి అధికారిక ప్రకటన వెలువ డితేనే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాలు నిజమైతే, తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఇది కీలక మలుపు కావచ్చని భద్రతా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి అమిత్ షా తో భేటీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి , ఐజీ సుమతి కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాట్ల ప్రక్రియ వేగవంతం కానున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా మావోయిస్టు పార్టీ సెక్రటరీ దేవూజీ తో సహా పలువురు కీలక నేతల లొంగుబాట్లపై చర్చించినట్లు సమాచారం. లొంగుబాటు తర్వాత వారికి కల్పించాల్సిన భద్రత, పునరావాసం, కేసుల పరిశీలన తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోం మంత్రితో వివరణాత్మకంగా చర్చించినట్లు తెలుస్తోంది. దేవూజీతో జరిగిన సమావేశంలో మావోయిస్టులు ఉంచిన డిమాండ్లు, శాంతి చర్చలకు సంబంధించిన ప్రతిపాదనలు, అభివృద్ధి హామీలు వంటి అంశాలను కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు వర్గాలు వెల్లడిస్తున్నాయి.ఈ నెల మార్చి 31వ తేదీన నిర్వ హించనున్న “మావోయిస్టు రహిత భారత్” కాన్ఫరెన్స్‌కు సంబంధించి కూడా ఈ భేటీలో చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అమలు చేస్తున్న చర్యలు, రాష్ట్రాల సమన్వయం,కేంద్ర-రాష్ట్రాల మధ్య వ్యూహాత్మక సహకా రం వంటి అంశాలపై సమ గ్రంగా సమీక్షించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం శాంతి, భద్రత, అభివృద్ధి అనే మూడు అంశాలను సమన్వయం చేస్తూ ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్రంతో కలిసి సమగ్ర వ్యూహంతో మావోయిస్టు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Publish Date: Mar 4, 2026 8:31PM

political-news-img

ఈ వార్ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా?

తెలుగువన్ ‘వాస్తవ వేదిక’లో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పాల్గొని ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై విశ్లేషణాత్మకంగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతుందని పీవీ రమేష్ పేర్కొన్నారు. చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులపై ఈ పరిణామాలు ప్రభావం చూపుతాయని వివరించారు. ఈ సందర్భంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు గురయ్యారనే ప్రచారం జరుగుతోందని, రవిశంకర్ ప్రశ్నించారు. అలాగే సౌదీ అరేబియాలో మహమ్మద్ బిన్ సల్మాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చోటుచేసుకున్న మార్పులను పీవీ రమేష్ విశ్లేషించారు. మధ్యప్రాచ్య రాజకీయాల్లో శక్తిసామ్యాలు ఎలా మారుతున్నాయో వివరించారు. యుద్ధాల్లో మతపరమైన అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని, దీని ప్రభావం ప్రాంతీయ స్థాయిని దాటి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోందని పీవీ రమేష్ తెలిపారు. “ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా?” అనే ప్రశ్నను రవిశంకర్ సంధించగా, ఈ యుద్ధాన్ని ఆపగల శక్తి ఎవరిదన్న అంశంపై కూడా చర్చ సాగింది. ఇలాంటి అనేక కీలక, ఆసక్తికర అంశాలపై కంఠంనేని రవిశంకర్, పీవీ రమేష్ మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో రేపు సాయంత్రం 7 గంటలకు తప్పక వీక్షించండి.

Publish Date: Mar 4, 2026 8:12PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img