Top Stories

political-news-img

ఉప్పు ఎక్కువ తినకపోయినా బీపి ఎక్కువ ఉంటుందా? అసలు నిజం ఇదే..!

ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు. అయినప్పటికీ వారి బీపి నార్మల్ గా కాకుండా ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో ప్రతి ముగ్గురు వ్యక్తులలో ఒకరు హై బీపి తో బాధపడుతున్నారని ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. అసలు ఆహారంతో తక్కువ ఉప్పు తీసుకున్నా బీపి ఎందుకు ఎక్కువ ఉంటుంది? అసలు శరీరంలో సోడియం పెరిగితే ఎందుకు ప్రమాదంగా మారుతుంది? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు తెలుసుకుంటే.. ఉప్పు డేంజర్ ఇందుకే.. ఉప్పులోని సోడియం శరీరంలో నీటిని నిలుపుకుంటుంది. ఇది రక్త నాళాలలో ఒత్తిడిని పెంచుతుంది. దీని కారణంగా గుండె కష్టపడి పనిచేయవలసి వస్తుంది. సోడియం ఎక్కువ కాలం శరీరంలో ఎక్కువగా ఉంటే రక్త నాళాలు దెబ్బతింటాయి. గుండెపోటు, స్ట్రోక్, గుండె వైఫల్యం, మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. అన్నింటికంటే షాకింగ్ పాయింటే ఏంటంటే.. ఎక్కువ ఉప్పు తింటున్నాం అనే విషయం తెలియకుండానే శరీరంలోకి అధిక ఉప్పు వెళ్లిపోతుంది. దీన్ని చాలామంది తెలియకుండానే చేస్తారు. బ్రెడ్, బన్.. బేకరీ.. రోజూ బ్రెడ్ లేదా బన్ వంటివి తినేవారు చాలామంది ఉంటారు. ఇవి ఆరోగ్యానికి మంచిది అనుకుంటారు. మరీ ముఖ్యంగా చాలామంది మల్టిగ్రైన్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ వంటివి ఆరోగ్యానికి చాలామంచివి అనుకుంటారు. కానీ ఈ బ్రెడ్ లేదా బన్ లు శరీరానికి చాలా సోడియంను అందిస్తాయి. అలాగే బేకరీలలో లభించే ప్రతి ఆహార పదార్థంలో చాలా సోడియం, సుగర్ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా బయట ప్యాకెట్స్ లో లభించే స్నాక్స్, బిస్కెట్స్, చిప్స్ వంటి ఆహారాలలో సోడియం శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో వండే ఆహారంలో ఉప్పు తక్కువ తీసుకున్నా, బయటి ఆహారాల ద్వారా సోడియం ఎక్కువగా శరీరంలోకి వెళుతుంది. వీటిలో చాలా ఎక్కువ.. టొమాటో కెచప్, సోయా సాస్, చిల్లీ సాస్, శాండ్‌విచ్ స్ప్రెడ్‌లు, ప్యాక్ చేసిన చట్నీలు, ఏడాది పాటు నిల్వ ఉంచే భారతీయ సాంప్రదాయ పచ్చళ్లు.. వీటి షెల్ఫ్ లైఫ్‌ను పెంచడానికి ఉప్పు ఎక్కువ జోడి్స్తారు. వీటిని ఎంత తక్కువ మొత్తంలో తీసుకున్నా సరే.. శరీరంలోకి వెళ్లే సోడియం మాత్రం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చిప్స్, భుజియా, సాల్టీ మిక్స్‌లు, క్రాకర్లు, బేక్ చేసిన లేదా తేలికగా సాల్టెడ్ స్నాక్స్‌లో కూడా ఎక్కువ మొత్తంలో ఉప్పు ఉంటుంది. ఇవి తిన్నప్పుడు ఉప్పు ఎక్కువ ఉన్నట్టు అనిపించవు. అందుకే తెలియకుండానే తినేస్తారు. చీజ్ ముక్కలు, చీజ్ స్ప్రెడ్‌లు, ఫ్లేవర్డ్ బటర్ లో కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజూ తక్కువ మొత్తంలో తీసుకున్నా చాలు.. శరీరంలో సోడియం పెరుగుతుంది. అది విదంగా రెడీ టూ ఈట్ ఫుడ్స్ లో రుచి కోసం, టెక్చర్ కోసం కోసం ఎక్కువ ఉప్పును వాడతారు. నిమిషాలలో రెఢీ అయ్యే ఆహారాలలో కూడా ఉప్పు తో పాటు చాలా రకాల ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఇవన్నీ కలిపి శరీరంలో సోడియం స్థాయిలను పెంచుతాయి. కాబట్టి ఆహారంలో ఉప్పు అంటే కేవలం ఇంట్లో వండే ఆహారం గురించే కాదు.. బయట నుండి తీసుకునే ఆహారం గురించి కూడా ఆలోచించాలి. వీటితో జాగ్రత్తగా ఉంటే సోడియం స్థాయిలు కూడా తగ్గి బీపి తగ్గుముఖం పడుతుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

Publish Date: Jul 25, 2026 4:15PM

political-news-img

ఎర్ర సముద్రంలో నౌకా దిగ్బంధనం: పెరగనున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణ ముప్పు.!

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు రవాణా వ్యవస్థను తీవ్రాతి తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టివేశాయి. ఎర్ర సముద్రంలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో దాడులు హెచ్చడంతో.. సౌదీ అరేబియా నుంచి భారత్, చైనాలకు బయలుదేరిన క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు తమ మార్గాన్ని మార్చుకోకతప్పని అనివార్య పరిస్థితి ఏర్పడింది. మామూలుగా బాబ్ ఎల్-మాండెబ్ జలసంధి గుండా వెళ్లాల్సిన నౌకలు ఇప్పుడు ఆఫ్రికా ఖండాన్ని చుట్టుముట్టి గుడ్ హోప్ అగ్రం మీదుగా తమ మార్గాన్ని మార్చుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. దీనివల్ల రవాణా సమయం పెరగడమే కాకుండా.. ఇండియాకు ఆర్థికంగా కూడా లక్ష కోట్ల రూపాయల అదనపు భారం పడే ప్రమాదం ఏర్పడింది. ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలకమైన బాబ్ ఎల్-మాండెబ్ జలసంధి గుండా ప్రయాణించే చమురు నౌకలపై ఇటీవల దాడుల ముప్పు ఎక్కువైంది. సౌదీ అరేబియాలోని యంబు నౌకాశ్రయం నుంచి భారత పశ్చిమ తీరానికి రావాల్సిన నౌకలు సాధారణంగా 19 రోజుల్లో చేరతాయి. అయితే, ప్రస్తుత భద్రతా కారణాల వల్ల ఈ నౌకలు ఎర్ర సముద్రంలో యూ-టర్న్ తీసుకుని, సూయెజ్ కాలువ, మధ్యధరా సముద్రం, ఆఫ్రికా పశ్చిమ తీరం గుండా గుడ్ హోప్ అగ్రం చుట్టి రావాల్సి వస్తోంది. ఈ కొత్త మార్గం వల్ల ప్రయాణ సమయం 48 రోజులకు పెరుగుతుది. ఈ మార్పుల వల్ల కేవలం సమయం మాత్రమే కాదు, ఇంధన ఖర్చులు, నౌకల అద్దెలు కూడా భారీగా పెరిగాయి. సాధారణ మార్గంలో ఒక్కో ట్రిప్పుకు ఇంధన ఖర్చు సుమారు 12.6 లక్షల డాలర్లు ఉంటే, ఆఫ్రికా చుట్టూ తిరగడం వల్ల అది 28.7 లక్షల డాలర్లకు పెరిగింది. దీనికి తోడు నౌకలకు చెల్లించే రోజువారీ అద్దె 300 శాతానికి పైగా పెరిగింది. సూయెజ్ కాలువ రుసుములు, ఇతర నిర్వహణ ఖర్చులు కలుపుకుంటే, ఒక్కో బ్యారెల్ చమురుపై రవాణా ఖర్చు దాదాపు 3 డాలర్ల వరకూ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సముద్ర మార్గంలో పెరిగిన ప్రమాదాల కారణంగా బీమా కంపెనీలు కూడా తమ వార్ రిస్క్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను భారీగా పెంచేశాయి. సాధారణంగా నౌక విలువలో పావు తానం ఉండే బీమా ప్రీమియం ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 5 శాతానికి చేరింది. ఉదాహరణకు, 16 కోట్ల డాలర్ల విలువైన ఒక పెద్ద చమురు ట్యాంకర్ ఒక్కసారి ప్రయాణించాలంటే కేవలం బీమా కోసమే 80 లక్షల డాలర్లు చెల్లించాల్సి వస్తోంది. ఈ అదనపు భారం చివరకు చమురు కంపెనీల ద్వారా వినియోగదారుల పైనే పడుతుంది. భారతదేశం తన వార్షిక చమురు అవసరాలలో దాదాపు 85 శాతాన్ని విదేశీ దిగుమతుల ద్వారానే పొందుతోంది. అందులో సౌదీ అరేబియా నుంచి రోజుకు 4 లక్షల బ్యారెళ్లకు పైగా క్రూడ్ ఆయిల్ దిగుమతి అవుతోంది. పెరిగిన రవాణా సమయం, అధిక ఇంధన ఖర్చులు, ప్రీమియంల కారణంగా భారత్ పై ఏడాదికి దాదాపు లక్ష కోట్ల రూపాయల అదనపు భారం పడే అవకాశం ఉంది. ముడి చమురు ధర ఒక్క డాలర్ పెరిగినా, భారత్ దిగుమతి బిల్లు ఏకంగా 2 బిలియన్ డాలర్లు పెరుగుతుందని ఆర్థిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సముద్ర మార్గాల సంక్షోభం కేవలం చమురు దిగుమతులకు మాత్రమే పరిమితం కాకుండా, భారత్ నుంచి జరిగే ఎగుమతులపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. యూరప్ మరియు ఇతర పశ్చిమ దేశాలకు భారత్ నుంచి వెళ్లే సరుకు రవాణా నౌకలు కూడా గుడ్ హోప్ అగ్రం మీదుగానే వెళ్లాల్సి రావడంతో ఎగుమతులు 20 నుంచి 30 రోజులు ఆలస్యమవుతున్నాయి. కంటైనర్ రవాణా ఛార్జీలు కూడా రెట్టింపు కావడంతో భారతీయ ఎగుమతిదారులు విదేశీ మార్కెట్లలో పోటీపడటంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండియా వద్ద ప్రస్తుతం కొన్ని వారాలకు సరిపడా వ్యూహాత్మక చమురు నిల్వలు ఉన్నప్పటికీ, సుదీర్ఘకాలం ఈ సంక్షోభం కొనసాగితే ఇంధన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం సవాలుగా మారనుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటే ప్రమాదం ఉంది. దీనివల్ల దేశంలో సామాన్య ప్రజలపై ద్రవ్యోల్బణ భారం మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో భద్రత పునరుద్ధరణ కానంత వరకు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం లేదు. ప్రపంచ దేశాలు మరియు సముద్ర భద్రతా దళాలు కలసికట్టుగా చర్యలు చేపట్టి, బాబ్ ఎల్-మాండెబ్ వంటి కీలక జలసంధుల్లో వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే, అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత ఖరీదైన ప్రత్యామ్నాయంగా మారిన గుడ్ హోప్ అగ్రం మార్గం భారత్ తో పాటు అనేక ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తూనే ఉంటుంది. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి. Red Sea crisis, Bab el-Mandeb Strait, burden of oil transport, Cape of Good Hope, rise in fuel prices

Publish Date: Jul 25, 2026 3:05PM

political-news-img

యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నా.. అందుకే రాజీనామా ధర్మేంద్ర భావోద్వేగం.!

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పత్రం ప్రధాన మంత్రికి పంపించిన అనంతరం దేశ యువతను ఉద్దేశించి భావోద్వేగ లేఖ విడుదల చేశారు. భారత ప్రజాస్వామ్య శక్తిపై తనకు అత్యంత విశ్వాసం ఉందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. యువత ఆకాంక్షలను కలలను తాను గౌరవిస్తానని తెలిపారు. దేశ భవిష్యత్తుకు మాత్రమే కాదు యువత ఆకాంక్షలను, కలలను తాను గౌరవిస్తానని చెప్పారు. దేశ భవిష్యత్తుకు మాత్రమే కాదు.. సరికొత్త భారతదేశానికి వారసులు యువతేనని పేర్కొన్నారు. 10 రోజులుగా జరిగిన సంఘటనలతో తీవ్రంగా బాధపడ్డానని, అందుకే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశానని వివరించారు. తనకు అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాలు తనను వ్యక్తిగతంగా బాధించాయని, అయితే ఇది తన వ్యక్తిగత పరువు లేదా రాజకీయ భవిష్యత్తు కు సంబంధించిన విషయం కాదని స్పష్టం చేశారు. దేశ యువత గందరగోళానికి గురికాకూడదనే ఉద్దేశం తో, దేశ ఐక్యతను కాపాడేందుకు, ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా చట్టపరమైన చిక్కుల్లో పడకుండా ఉండేందుకు, విద్యార్థులు తమ సమయాన్ని చదువుపై, కెరీర్ నిర్మాణంపై వెచ్చించేలా చేయాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన రాజీనామా సమర్పించినట్లు వెల్లడించారు. చివరగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందించిన మార్గదర్శక త్వానికి, నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, తన సహచర మంత్రులు, అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. దేశ సేవే తన జీవితంలో అత్యున్నత ధ్యేయమని, శ్రీ జగన్నాథ స్వామి ఆశీస్సు లతో భవిష్యత్తులో కూడా మాతృభూమి, ఒడిశా ప్రజలు, దేశ యువత కోసం తన సేవలు కొనసా గిస్తానని ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖను ముగించారు. Dharmendra Pradhan Resignation, NEET Paper Leak Issue, Union Education Minister, National News Telugu,CJP Protests, PM MODI

Publish Date: Jul 25, 2026 2:57PM

political-news-img

నా పరిస్థితి దేశానికి తెలియాలి..సెక్యూరిటీపై సోనమ్ వాంగ్ చుక్ ఆగ్రహం.. ఎందుకంటే?

సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలోని సఫ్‌దర్‌జంగ్ ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగిన దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తన నిరశన దీక్ష సమయంలో జరిగిన ఈ సంఘటనలో ఆయన నన్ను అరెస్ట్ చేయండి అని గట్టిగా అరుస్తూ ఆగ్రహం వ్యక్తం చేయడం స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆసుపత్రి యాజమాన్యం స్పందిస్తూ.. తాము నిబంధనల ప్రకారమే నడుచుకున్నామంటూ ముక్తాయించింది. న్యాయపరమైన నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని వివరణ ఇచ్చింది. కాగా వాంగ్ చుక్ సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన ఈనెల 21న జరిగింది. ఆ సందర్భంగా సఫ్‌దర్‌జంగ్ ఆసుపత్రి ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆయనను గుర్గావ్‌లోని మెదాంతా ఆసుపత్రికి తరలించేందుకు అనుమతి లభించినప్పటికీ, ఆసుపత్రి సిబ్బంది ఆయనను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారనీ, దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వాంగ్‌చుక్, అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది తనను కావాలని వేధిస్తున్నారని విమర్శిస్తూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారనీ తెలుస్తోంది. తనను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన వాంగ్ చుక్.. తనను అరెస్టు చేసినా, మరెక్కడికైనా తీసుకెళ్లినా ఫరవాలేదనీ, కానీ తన పరిస్థితి ఏంటో దేశానికి తెలియాలని అన్నారు. ఆసుపత్రి సిబ్బంది ప్రవర్తన వల్ల తనకు తీవ్ర మానసిక ఒత్తిడి కలుగుతోందని, దీనివల్ల ఏమైనా జరిగితే వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా ఆ సందర్భంగా హెచ్చరించారు. అనంతరం ఆయన ఆసుపత్రి నేలపైనే పడుకుని నిరసన తెలిపారు. ఆ సమయంలో ఆయన భార్య గీతాంజలి అంగ్మో కూడా అక్కడే ఉన్నారు. ఈ వివాదంపై సఫ్‌దర్‌జంగ్ ఆసుపత్రి వర్గాలు కేవలం మీడియా కథనాల ఆధారంగా వాంగ్‌చుక్ వెంటనే ఆసుపత్రి నుంచి వెళ్ళిపోవాలని భావించారని, కానీ కోర్టు అధికారిక రాతపూర్వక ఉత్తర్వులు తమకు అందే వరకు ఆయనను బయటకు పంపడం చట్టపరంగా కుదరలేదని తెలిపాయి. అదే రోజు సాయంత్రం.. కోర్టు ఆదేశాల ప్రతి చేతికందిన వెంటనే ఆయనను సురక్షితంగా మెదాంతా ఆసుపత్రి వైద్యుల బృందానికి అప్పగించినట్లు సఫ్‌దర్‌జంగ్ ఆసుపత్రి వర్గాలు వివరణ ఇచ్చాయి. అయితే.. వాంగ్ చుక్ మాత్రం ఈ నెల 18న తనను సఫ్‌దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకువచ్చిన క్షణం నుంచీ ఆసుపత్రి వర్గాలు తనను ఒక ఖైదీలా చూశాయని వాంగ్ చుక్ చెబుతున్నారు. నిరాహార దీక్షలో ఉన్న తనను సందర్శకులు కలవకుండా ఆంక్షలు విధించారని, ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కూడా ఉపయోగించనివ్వలేదనీ, మానసికంగా తనను కుంగదీసేందుకు ఆసుపత్రి వర్గాలు ప్రయత్నించాయనీ వాంగ్ చుక్ ఆరోపంచారు. ప్రయత్నించారని ఆరోపించారు. కాగా ఈ వీడియో బయటకు వచ్చిన క్షణం నుంచీ సోషల్ మీడియాలో ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. విద్యారంగ పరిరక్షణ కోసం నిరశన దీక్షలో ఉన్న ఒక వ్యక్తిపై ఆసుపత్రి వర్గాలు మరియు భద్రతా సిబ్బంది దురుసుగా, అమర్యాదగా వ్యవహరించడాన్ని నెటిజనులు తప్పుపడుతున్నారు. Safdarjung Hospital, Hunger Strike , Delhi High Court , Medanta Hospital

Publish Date: Jul 25, 2026 2:51PM

political-news-img

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ శాఖకు చెందిన అధికారుల పాత్ర, విధుల నిర్వహణలో జరిగిన లోపాలపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమర్పించిన సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విచారణకు బి. ఉమామహేశ్వరరావును విచారణాధికారిగా నియమించగా, జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ మోహన్‌రావును ప్రెజెంటింగ్ అధికారిగా నియమించింది. విచారణను నిష్పాక్షికంగా నిర్వహించి, సంబంధిత అధికారుల బాధ్యతలు, విధుల్లో నిర్లక్ష్యం, నిబంధనల అమలులో జరిగిన లోపాలు, పర్యవేక్షణలో వైఫల్యాలపై సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించింది. ఈ శాఖాపరమైన విచారణను మూడు నెలల్లో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై తదుపరి శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసు నేపథ్యంలో ఇప్పటికే సిట్ విస్తృతంగా దర్యాప్తు నిర్వహించింది. ఆ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా సంబంధిత అధికారుల పాత్రపై కూడా విచారణ అవసరమని సిఫార్సు చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమల ప్రసాదం నాణ్యత, భక్తుల విశ్వాసాన్ని పరిరక్షించే దిశగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ శాఖాపరమైన విచారణకు ప్రాధాన్యత ఏర్పడింది. Tirumala laddu ghee adulteration case, Factories and Boilers, SIT, Tirumala laddu, CM Chandrababu, TTD, Boilers Director B Umamaheswara Rao

Publish Date: Jul 25, 2026 2:40PM

political-news-img

ఎట్టకేలకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..!

దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో అత్యంత సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. ఈ విపత్కర పరిస్థితికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. గత కొన్ని నెలలుగా నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన తీవ్ర అక్రమాలు, లీకేజీలపై విద్యార్థి లోకం, ప్రతిపక్షాలు, పలు సామాజిక సంఘాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు విద్యాశాఖ వైఫల్యంపై నిలదీశాయి. ఈ క్రమంలోనే ఆందోళనలు చేపడుతున్న సీజేపీ (CJP) బృందం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవడానికి ఇవాళ మధ్యాహ్నం వరకు మాత్రమే సమయం ఇస్తూ డెడ్‌లైన్ విధించింది. మరో దఫా చర్చలు ప్రారంభం కావలసి ఉన్న కీలక సమయంలోనే ఆయన తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ప్రతిపక్షాల నుంచి వస్తున్న రాజకీయ ఒత్తిడి, విద్యార్థుల ఆందోళనల దృష్ట్యా ప్రభుత్వంపై మరింత భారం పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన వెలుగుచూసినప్పటి నుంచి విద్యాశాఖ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారని, ఈ కుంభకోణంపై పారదర్శకమైన విచారణ జరిపించాలని పలు విపక్షాలు పార్లమెంట్ లోపల, వెలుపల ఆందోళనలు నిర్వహించాయి. కేంద్ర మంత్రి రాజీనామా పరిణామంపై విద్యార్థి సంఘాలు, విద్యారంగ నిపుణులు స్పందిస్తున్నారు. కేవలం రాజీనామాతో బాధ్యత ముగిసిపోదని, లీకేజీకి కారణమైన సూత్రధారులు, పాత్రధారులందరినీ చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. విద్యా వ్యవస్థలో కోల్పోయిన విశ్వసనీయతను పునరుద్ధరించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్మాణంలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించే అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో రానున్న రోజుల్లో నూతన విద్యాశాఖ మంత్రిగా ఎవరిని నియమిస్తారు, నీట్ వివాదంపై కేంద్రం ఎలాంటి తదుపరి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. Dharmendra Pradhan Resignation, NEET Paper Leak Issue, Union Education Minister, National News Telugu,CJP Protests

Publish Date: Jul 25, 2026 2:34PM

MOVIE NEWS