విజయసాయిరెడ్డి నోట మళ్లీ సొంత చానల్ మాట!

Publish Date:Jul 16, 2024

Advertisement

వైసీపీ కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నోట మరో సారి సొంత చానల్ మాట వచ్చింది. గతంలో కూడా ఒక సారి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి సొంతంగా చానల్, పత్రిక ప్రారంభించబోతున్నట్లు ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. అప్పట్లో  అంటే ఆయన సొంత చానల్, పత్రిక ప్రకటన చేసిన సమయంలో ఆయనకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయింది. పార్టీలో ఆయన నంబర్ 2 స్థానాన్ని అప్పటి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించేసుకున్నారు. దీంతో ఆయనకు పార్టీలో ఇసుమంతైనా గుర్తింపు లేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో  ఆయన సొంత చానల్, సొంత పత్రికా అంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటన చేశారు. 

ఇప్పుడు మళ్లీ ఆయన తీవ్రమైన ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఒక మహాళా అధికారితో అక్రమ సంబంధం ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా ఆ మహిళా అధికారి భర్తే ఈ ఆరోపణ చేశారు. ఫిర్యాదు సైతం చేశారు. వైసీపీ తరఫున ఈ వార్తలను ఖండించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా విజయసాయిపై ఆరోపణలను ఖండించలేదు. దీంతో ఆయన ఇక పార్టీ అండ కోసం అర్రులు చాస్తూ కూర్చుంటే లాభం లేదన్న నిర్ణయానికి వచ్చేశారు. అదే సమయంలో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా.. తాను ఏ పార్టీలో ఉన్నా తన చానల్ మాత్రం నిఖార్సైన వార్తలే ప్రసారం చేస్తుందని చెప్పండం ద్వారా పార్టీ మారే అవకాశాలున్నాయన్న విషయాన్ని సూచన ప్రాయంగా వెల్లడించి, ఒక విధంగా వైసీపీ అధినేత జగన్ ను బ్లాక్ మెయిల్ చేశారని కూడా చెప్పవచ్చు. 
వాస్తవానికి విజయసాయి రెడ్డి పార్టీలో తనకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్న సమయంలో మాత్రమే జగన్ పై ఒకింత ధిక్కార స్వరాన్ని వినిపిస్తారు. గతంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.  

విజయసారిరెడ్డికి పార్టీలో ఉక్కపోత మొదలైనా.. సమాధానం చెప్పుకోలేని ప్రశ్నలు ఎదురైనా ఆయన సొంత మీడియా అంటూ ముందుకు వస్తున్నారు.  గతంలో వైసీపెలో నెంబర్ 2 గా ఓ వెలుగు వెలిగిన విజయ సాయి రెడ్డికి ఆ పార్టీలో ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయింది. నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలైన తరువాత పార్టీలో ఆయనను పట్టించుకునే నాథుడే కరవయ్యారు. ఇప్పుడు అక్రమ సంబంధం ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరౌతున్న విజయసాయి.. సెల్ఫ్ డిఫెన్స్ కోసం సొంత టీవీ చానల్ అంటూ హడావుడి చేస్తున్నారు.  

అయితే గతంలో విజయసాయి సొంత చానల్ అని ప్రకటించిన సమయంలో ఆయనకు ఢిల్లీ పెద్దలతో పాటుగా  పొరుగు రాష్ట్రానికి  చెందిన ముఖ్యనేత అండదండలున్నాయన్న వార్తలు వచ్చాయి.  అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. ఢిల్లీలో  చక్రం తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేతుల్లో ఉంది. ఆయనకు నచ్చని పని చేయడానికి ఢీల్లీ పెద్దలు సాహసించే అవకాశం లేదు. ఇక పొరుగు రాష్ట్రం నుంచి కూడా విజయసాయికి సహకారం అందే అవకాశం లేదు. ఏపీలో వైసీపీ పరిస్థితిలాగే, పొరుగు రాష్ట్రంలో గతంలో విజయసాయికి అండదండగా నిలవడానికి ముందుకు వచ్చిన నేత ఉన్న పార్టీ పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో విజయసాయికి ఎటు నుంచీ సహకారం అందే అవకాశాలు లేవు. 

ఇప్పుడేమిటి చాలా కాలంగా వైసీపీలో విజయసాయి రెడ్డి ఉక్కపోతకు గురవుతున్నారు.   జగన్ రెడ్డి ఒకటొకటిగా విజయ సాయి పదవులు కత్తిరిస్తూ వస్తున్నారు. మరో వంక, విశాఖ భూదందాల బాగోతంలో విజయసాయి పీకలోతు కూరుకుపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  జగన్ రెడ్డి కాదుకదా, వైసేపీ నాయకులు ఎవరూ  ఆయనకు అండగా విజయసాయిపై ఆరోపణలు ఖండించడానికి ముందుకు రావడం లేదు. ఎవరూ ముందుకు రాని కారణంగానే జూపూడిని పక్కన పెట్టుకుని విజయసాయి సోమవారం (జులై 15) మీడియా సమావేశంలో మాట్లాడారు.  ఈ పరిస్థితుల్లో విజయసాయి సొంత చానెల్ ప్రకటనను ఎవరూ పెద్ద సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. 

By
en-us Political News

  
తాజాగా కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ.
ఇంతకీ రేవంత్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం గురువారం. తన 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులను బుధవారం రాత్రి విందు ఇచ్చారు. ఆ విందుకు తెలంగాణ సీఎం రేవంత్ హాజర్యారు.
బోరుగడ్డ అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. కేసులు చుట్టుముట్టాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. జైలుకు వెళ్లిన సమయంలోనూ, ఆ తరువాత బయటకు వచ్చి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ కూడా బోరుగడ్డ అనిల్ పదేపదే తనకు జగన్ అండ ఉందని చెప్పుకొచ్చారు.
అమరావతికి నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమెదం ఇవ్వనుంది. అదే విధంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసే అవకాశం ఉంది.
ల్గొండ జిల్లా కొర్లపహాడ్‌ గ్రామంలో పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు.
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.