Publish Date:Sep 17, 2020
సాక్షాత్తు పార్లమెంట్లో న్యాయస్థానాలను టార్గెట్ చేస్తూ వైసీపీ ఎంపీలు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా అమరావతి భూములకు సంబంధించి ఏర్పాటైన సిట్ విచారణపై హైకోర్టు స్టే ఇవ్వడం పై విజయసాయిరెడ్డి సందర్భం లేకుండానే రాజ్యసభలో ప్రసంగించారు. దీనిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అభ్యంతరం చెప్పినా ఆయన ఆపలేదు. అంతేకాకుండా పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ పక్షపాతంతో వ్యవహరిస్తోందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు అందరూ సమానులే అనే సూత్రాన్ని న్యాయ వ్యవస్థ విస్మరిస్తోందని అయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ధర్మాన్ని కాపాడాల్సిన వారు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. పౌరుల ప్రాథమిక హక్కులను కూడా హరిస్తున్నాయని, మీడియా గొంతు నొక్కుతున్నాయని న్యాయ వ్యవస్థ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కూడా అయన డిమాండ్ చేశారు. తను ఏ జడ్జికి ఉద్దేశాలు ఆపాదించడం లేదని అయితే న్యాయస్థానాలు మాత్రం మీడియా నోరు నొక్కుతున్నాయని విమర్శించారు. విజయసాయిరెడ్డి న్యాయవ్యవస్థపై ఈ స్థాయిలో విరుచుకుపడటానికి కారణం మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ విషయంలో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ మీడియాలో, సోషల్ మీడియాలో రాకుండా హైకోర్టు ఆదేశాలివ్వడమే.
అయితే న్యాయ వ్యవస్థపై వైసీపీ నేతల వ్యాఖ్యలకు టీడీపీ నేతలు వెంటనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. న్యాయ వ్యవస్థ మీడియా గొంతు నొక్కిందని వైసీపీ నేతలు అంటున్నారని ఐతే వివేకా హత్య కేసులో విచారణ అంశాలు మీడియాలో రాకూడదని కోర్టుకు వెళ్లి మరీ స్టే తెచ్చుకున్న విషయం వారు మరిచిపోయారా అని ఈ సందర్భంగా వారు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు జడ్జిలను కూడా బెదిరింపులకు గురిచేస్తున్నారని.. అలాగే కోర్టులను కూడా బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఎపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని దీనికోసం న్యాయమూర్తులను భయబ్రాంతులకు గురి చేసైనా.. తమ దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వైసిపి పై మండిపడ్డారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/vijay-sai-reddy-sensational-comments-on-ap-high-court-25-104165.html
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థి రోహిత్ వేముల దళితుడు కాదని,
మరో పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సంపన్న అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశమైంది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు.. అవమానాలు, అభినందనలు సర్వసాధారణమే. నాకు వాళ్లు గౌరవం ఇవ్వలేదు.. నన్ను వాళ్లు విమర్శించారంటూ.. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటే సదరు నేతకు రాజకీయ భవిష్యత్తుతో పాటు.. మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అదే పరిస్థితి ప్రస్తుతం మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఎదురవుతోంది.
మీరేదో పనిలో వుంటారు.. లేదా ట్రావెల్ చేస్తూ వుంటారు... లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ వుంటారు.
కోవిషీల్డ్ తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని ఆస్ట్రాజెనికా అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమైంది. వ్యాక్సిన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న ఈ సమయంలో ఆ సర్టిఫికెట్లపై ప్రధాని ఫోటో మాయమవ్వడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.
police filed murder attempt case on perni kittu, perin kittu, murder attempt case, ap politics
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో అందరి దృష్టీ విశేషంగా ఆకర్షిస్తున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం మాత్రమే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని మొదటి నుంచీ అంతా భావిస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో జరిగిన జాప్యం కారణంగా చేజేతులా కాంగ్రెస్ ఖమ్మంలో అవకాశాలను చే జార్చుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ సాధించే స్కోరు జీరో అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. బీఆర్ఎస్ నాయకులకు
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు.
ఏపీలో బీజేపీ రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తోందా? పేరుకు పొత్తు తెలుగుదేశం, జనసేనతో.. మద్దతు మాత్రం అధికార వైసీపీకే అన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దేశంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. రెండు దశల పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ నిపుణులు ఉత్తరాదిలో, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ భారీగా నష్టపోవడం ఖాయమని గంటాపథంగా చెబుతున్నారు.