ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, రాజకీయ నాయకులను హైదరాబాద్ నుంచి తరిమేసినప్పటికీ, తెలంగాణ నాయకులకు, మేధావులకు ఆంధ్ర రాజకీయాల మీద ఎక్కడలేని ఆసక్తి. ఆంధ్ర నాయకులు తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడరు. కానీ, తెలంగాణ నాయకులు, మేధావులు మాత్రం ఆంధ్ర రాజకీయాల గురించి కామెంట్ చేస్తూ తమ ఆసక్తిని ప్రదర్శిస్తూ వుంటారు. అలాంటి వారిలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒకరు.
దేశంలో ఎక్కడైనా రైతుల భూమి హక్కు పత్రమైన పట్టాదార్ పాస్ పుస్తకం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొటో వుంటుందా? ఐదేళ్ళపాటు పాలించే ముఖ్యమంత్రి ఫొటో శాశ్వతంగా వుండే పాస్ బుక్ మీద వుంటుందా? రైతుల సొంత భూమి పాస్ పుస్తకాల మీద ఆ భూమితో ఎలాంటి సంబంధం లేని ముఖ్యమంత్రి ఫొటో వుంటుందా? వుండదు.. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు మాత్రం ఆ ఖర్మ పట్టింది. తమకు వారసత్వంగా వచ్చిన లేదా తాము శ్రమించి సంపాదించుకున్న భూమి తాలూకు పుస్తకం మీద ముఖ్యమంత్రి ఫొటో చూసి తరించాల్సి వస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం తీవ్ర అసంతృప్తితో వున్నారు. రెండ్రోజుల క్రితం సీఎం సతీమణి భారతి పులివెందులలో ప్రచారానికి వెళ్తే అక్కడ వైసీపీ కార్యకర్త కూడా అయిన ఒక రైతు ఆమె ముందు బహిరంగంగానే ఈ విషయం మీద నిరసనను వ్యక్తం చేశారు. అలాంటి పాస్ బుక్ మీద జగన్ ఫొటో వ్యవహారం మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ బాధ్యతా రాహిత్యంగా, కరడుగట్టిన వైసీపీ కార్యకర్తలాగా వ్యాఖ్యానించారు. పట్టాదార్ పాస్ పుస్తకాల మీద ముఖ్యమంత్రి ఫొటో వుంటే తప్పేంటి అని ప్రశ్నించారు. నా భూమి పుస్తకం మీద ముఖ్యమంత్రి ఫొటో ఏంటి అంటే కుదరదని అన్నారు. నా బర్త్ సర్టిఫికెట్ మీద ఎమ్మార్వో సంతకం ఏంటని అడుగుతామా.. ఇది కూడా అంతే అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో నాగేశ్వర్ ఎంత వితండవాదన చేశారంటే, మళ్ళీ జగన్ పొరపాటున అధికారంలోకి వస్తే, నాగేశ్వర్ని పిలిచి మరీ పదవి ఇచ్చేంత స్థాయిలో వాదించారు. ఎవరి బర్త్, డెత్ సర్టిఫికెట్ మీదో ఎమ్మార్వో సంతకానికి లేని అభ్యంతరం పట్టాదార్ పాస్ పుస్తకం మీద జగన్ ఫొటోకి ఎందుకని అన్నారు. విద్యాధికుడు అయిన నాగేశ్వర్ మాట్లాడుతున్న ఈ మాటల్లో ఆయన స్వార్థమేదో తొంగి చూస్తోంది తప్ప మరింకేం కనిపించడం లేదు.
సరే, అది నాగేశ్వర్ అభిప్రాయం అని ఊరుకోవచ్చు. కానీ, ఇదే నాగేశ్వర్ కొద్ది రోజుల క్రితం పట్టాదర్ పాసు పుస్తకాల మీద జగన్ ఫొటోలు ముద్రించుకోవడం మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది కరెక్ట్ కాదని అన్నారు. మరి ఆయనే ఇప్పుడు తాను చేసిన వాదనకు పరస్పర విరుద్ధంగా వున్న వాదన ఎందుకు చేశారో, ఏ గూడుపుఠాణీ జరిగిందో!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nageswar-comments-on-jagan-photo-25-175056.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.