వంశీని సర్కార్ వేధిస్తోందంట.. గవర్నర్ కు ఫిర్యాదు చేసిన పంకజాక్షి

Publish Date:Apr 26, 2025

Advertisement

అనుచిత వ్యాఖ్యలు, అడ్డగోలు దౌర్జన్యాలు, కిడ్నాప్ లు, బెదరింపులకు పాల్పడిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు  పెట్టి  వేధిస్తున్నదంట. ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, అలాగే నారాలోకేష్  పై అనుచిత వ్యాఖ్యలు ేసినప్పుడూ, గన్నవరం  తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి ఉసికొల్పిన సమయంలోనూ.. అదే కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించినప్పుడూ నోరెత్తిని ఆ గొంతు ఇప్పుడు లేస్తోంది. ఇంతకీ  ఆ గొంతు ఎవరిదంటే వల్లభనేని వంశీ సీమణి  పంకజాక్షిది. ఔను  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తన భర్తపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందంటున్నారు వల్లభనేని  పంకజాక్షి.  ఈ మేరకు ఆమ రాష్ట్ర వర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఫిర్యాదు చేశారు. శుక్రవారం (ఏప్రిల్ 25) విజయవాడలోని రాజ్ భవన్ కు  వెళ్లి ఫిర్యాదు చేశారు  తన భర్త వల్లభనేని వంశీ పట్ల కూటమి ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని గవర్నర్‌ కు చెప్పారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.  ఈ సందర్భంగా ఆమె వెంట వైసీపీ నేతలు నేతలు  మాజీ మంత్రి పేర్ని నాని,  ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ కూడా ఉన్నారు. 

జగన్‌   హయాంలో చంద్రబాబు మీద, లోకేష్‌ మీద, టీడీపీ మీద, నారా భువనేశ్వరి మీద వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు, అదే టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసు, భూ ఆక్రమణ కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో  రిమాండ్‌ ఖైదీగా  ఉన్నారు.

By
en-us Political News

  
అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో అభివృద్ధి సుమాలను పూయిస్తానన్నారు. రాయలసీమ అంటే రాళ్ల సీమ కాదన్న చంద్రబాబు.. రాయలసీమను రాష్ట్రానికి మణిహారంగా మారుస్తామని చెప్పారు.
నిజానికైతే క‌న్న‌డ‌కు త‌మిళానికీ ఉన్న లింకు మాట ఎలాగున్నా... తెలుగు క‌న్న‌డ‌కు మాత్రం చాలానే సంబంధ బాంధ‌వ్యాలున్న‌ట్టు క‌నిపిస్తాయ్.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు చివరి దశకు వస్తుండటం, వారంతం సమీపిస్తుండటంతో భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతున్నారు.
పాక్ ఉగ్రవాదులను ఏరిపారేసిన ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ కు నాంది పలుకుదామని తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపు నిచ్చారు.
జగన్ ఇలాకాలో మహానాడు అంటూ మీడియాలో వచ్చిందనీ, అయితే 2024 ఎన్నికలకు ముందు వరకూ కడన జగన్ అడ్డా అయితే అయి ఉండొచ్చు కానీ.. ఇప్పుడు కడప చంద్రబాబు ఖిల్లా అని బీటెక్ రవి అన్నాడు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో నిర్లక్ష్యం సహించేది లేదని హెచ్చరించారు.
వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తక్షణమే ఆయనకు వైద్యం అందించాలని అధికారులను ఆదేశించింది. తన హెల్త్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బెయిల్ మంజూరు చేయాలని వంశీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
టిడిపి అంటే వీరాభిమానం 400 కిలోమీటర్లు సైకిల్ పై వచ్చిన ఈ పెద్దాయన గురించి చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో చంద్రబాబు ఆయన్ను వేదికపై కి పిలిచి అందరికీ చూపిస్తూ స్ఫూర్తి దాత అంటూ కితాబిచ్చి అభినందించారు.
. వేదికపైకి చేరుకున్న పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏర్పాట్లను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రెడ్డెప్పగారి శ్రీనివాస్‌ రెడ్డిని భుజం తట్టి సీఎం మెచ్చుకున్నారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి ఆనందభాష్పాలతో చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. 
రాయలసీమ నడిబొడ్డు కడప గడ్డన నిర్వహించిన పసుపు పండగ పసుపు దండు ఆనందోత్సాహాల మధ్య ముగిసింది. ఉత్తంగ తరంగమై అన్ని దారులు కడప వైపు అన్నట్టు పెను ప్రవాహంలో తెలుగుదేశం శ్రేణులు మహానాడుకు తరలి వచ్చి జోష్ నింపారు
కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కడప టీడీపీ మహానాడుగ ముగింపు సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఎన్నోసార్లు కడపకు వచ్చానని.. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు టీడీపీ మహానాడుకు రావడం చూసి కొండంత ధైర్యం వచ్చిందన్నారు. కడపలో మహానాడు పెడితే చాలామంది అనుమానించారని సీఎం అన్నారు.
పుష్ప పార్ట్ వ‌న్ ద్వారా నేష‌న‌ల్ బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు రాగా.. పార్ట్ టూ ద్వారా.. స్టేట్ బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు రావ‌డం మాములు విష‌యం కాదు. ఒక పాత్ర‌ను ద‌ర్శ‌క ర‌చ‌యిత‌లు మ‌ల‌చ‌డం ఒక ఎత్తు అయితే దాన్ని చేయ‌డం మ‌రొక ఎత్తుగా భావించాల్సి ఉంటుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల ఢిల్లీ పర్యటన తర్వాత, ఆయనలో మార్పు వచ్చిందా? గతానికి భిన్నంగా.. ముఖ్యంగా అధికారుల విషయంలో కొంత కఠినంగా, ఖచ్చితంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారా? అధికారులపై, కల్లెక్టర్లపై కోపంగా ఉన్నారా? అలాగే.. మంత్రులకు మంరిత దగ్గరయ్యే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారా? అంటే ఇటు అధికార వర్గాల నుంచి, అటు రాజకీయ వర్గాల నుంచి కూడా ఔననే సమాధానమే వస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.