క‌మ‌ల్ హాస‌న్ కన్నడ కాంట్రవర్సీ

Publish Date:May 30, 2025

Advertisement

నిజంగానే క‌న్న‌డ త‌మిళంలోంచి  వ‌చ్చిందా? 
ద‌క్షిణాది ప్రాచీన భాష‌లేవి! 

నిజానికైతే క‌న్న‌డ‌కు త‌మిళానికీ ఉన్న లింకు మాట  ఎలాగున్నా... తెలుగు క‌న్న‌డ‌కు మాత్రం చాలానే సంబంధ బాంధ‌వ్యాలున్న‌ట్టు క‌నిపిస్తాయ్. తెలుగులో ఒక‌టి- క‌న్న‌డ‌లో ఒందు అంటూ మొద‌లు పెడితే.. దాదాపు క‌న్న‌డ భాషకు తెలుగుకు విశేష సంబంధాలున్నట్టు క‌నిపిస్తుంది.

తేట తేట తెలుగు, క‌న్న‌డ క‌స్తూరి, సెంత‌మిళ్, మ‌ల‌యాళ మ‌నోర‌మ‌... ఇవీ ద‌క్షిణ ద్ర‌విడ భాష‌లు. ఇంత‌కీ ఈ ద్ర‌విడం ఎక్క‌డి నుంచి వ‌చ్చింది. ద్ర‌విడ భాష‌ల్లోకి త‌మిళ్ ముందా లేక క‌న్న‌డ‌, తెలుగు, మ‌ల‌యాళ భాష‌లా అని చూస్తే.. అస‌లు త‌మిళ్ అన్న‌ది ఎలా పుట్టిందో తెలుసుకోవ‌ల్సి ఉంటుంది..

ద్రవిడ‌మునకు పూర్వరూపము ద్రమిళమని అంటారు. ఇదే ద్రవిడముగ సంస్కృతమున నిలచిన‌ట్టు చెబుతారు. ప్రాకృత భాషల్లో తిరమడ, తిరమిళ, తమిళ అంటూ ఈ భాష అనేక‌ రూపాంత‌రాలు చెందిన‌ట్టుగా చెబుతుంది భాషా చ‌రిత్ర‌. ద్రమిళమే త‌మిళానికి మొద‌టి ప‌దం.  ద్రమిళ, ద్రవిడ, తిరమడ, తిరమిళ, తమిళ  శబ్దములు ధ‌ర్మ శ‌బ్దాల నుంచి వ‌చ్చాయ‌ని అంటారు.

దీంతో పాటు ద్ర‌విడ భాష‌ల్లో కూడా ర‌క‌ర‌కాలుంటాయి. ద్రావిడ భాషా కుటుంబంలో ప్రాధాన్య‌ తాంశాలేంట‌ని చూస్తే.. తొలుత త‌మిళ భాష‌- త‌ర్వాత‌ క‌న్న‌డ భాష‌ క‌నిపిస్తాయి. త‌ర్వాత‌ మధ్య ద్రావిడ భాషా కుటుంబం క‌నిపిస్తుంది. ఇందులో తెలుగు ప్ర‌ధాన  భాష‌. ఉత్తర ద్రావిడ భాషా కుటుంబం కురుఖ్ వంటి భాష‌లున్న‌ట్టు చెబుతంది మ‌న ద్ర‌విడ భాషా చ‌రిత్ర‌. అంటే ద్ర‌విడంలోనే అనేక భాష‌లు వాటికి గ్రెడేషన్ ఉన్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్ అంత న‌మ్మ‌కంగా ఎలా చెప్ప‌గ‌లిగారంటే.. ద్ర‌విడ భాష‌ల పెద్ద‌న్న త‌మిళం. త‌ర్వాతే క‌న్న‌డ‌. ఆ త‌ర్వాత మ‌ల‌యాళం, ఆపై ఇత‌ర భాష‌లు.

అందుకే ఆయ‌న అంత గ‌ట్టిగా త‌న‌కు చ‌రిత్ర కారులు చెప్పార‌ని గట్టిగా అంటున్నారు. నిజానికైతే తెలుగు క‌న్న‌డ ద‌గ్గ‌ర ద‌గ్గ‌రగా ఉన్న‌ట్టు క‌నిపిస్తాయి. ఆ భాష రాత‌లోగానీ పిలుపులోగానీ ఆ సొబ‌గు ఈ రెండింటి మ‌ధ్యే ఎక్కువ‌గా ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. మీరు కావాలంటే  చూడండీ.. క‌న్న‌డ వాళ్ల‌తో తెలుగు మాట్లాడి  నెగ్గుకు రాగ‌లం. త‌మిళ‌వాళ్ల ముందు మ‌ల‌యాళం మాట్లాడి నెగ్గుకు రాగ‌లం. ఈ రెండింటి మ‌ధ్య ఉన్న అనుబంధం అలాంటిది. అలాంటిది త‌మిళానికీ క‌న్న‌డానికీ సంబంధ‌మేంట‌న్న‌ది అర్ధంకాని చిక్కు ప్ర‌శ్న‌. అస‌లు ద్ర‌విడం అంటేనే బౌద్ధ ధ‌ర్మంలోంచి పుట్టింద‌నీ.. ఆ ధ‌ర్మ‌మే ద్ర‌విడంగా త‌ర్వాత త‌మిళంగా పుట్టుకొచ్చింద‌ని మ‌న‌కు చెబుతోంది భాషా చ‌రిత్ర‌. 

ద్ర‌విడ భాష‌లు దాని వంశ వృక్షం విష‌యానికి వ‌స్తే.. మూల ద్రావిడ భాష దాన్లోంచి ఉత్త‌ర ద‌క్షిణ భాష‌లు పుట్టుకొచ్చాయి. వాటిలో ద‌క్షిణ భాషల్లోంచి త‌మిళం పెద్ద‌న్న‌గా ఉండ‌గా క‌న్న‌డ అందులోంచి పుట్టుకొచ్చిన మ‌రో కొమ్మ‌లా క‌నిపిస్తుంది. ఈ కోవ‌లోనే మ‌ల‌యాళం కూడా పుట్టుకొచ్చిన‌ట్టు తెలుస్తుంది.  అంటే త‌మిళ‌మే ఈ భాష‌ల‌న్నిటికీ  హెడ్ క్వార్ట‌ర్.

మ‌రి క‌న్న‌డిగుల‌కు ఈ విష‌యం తెలీదా? ఎందుక‌ని క‌మ‌ల్ హాస‌న్ లేటెస్ట్ మూవీ థ‌గ్స్ అండ్ లైఫ్.. సినిమాతో పాటు ఇత‌ర చిత్రాలేవీ ఆడ‌నివ్వ‌మంటున్నారు.. ఇందుకు రీజ‌న్లు ఏమై ఉంటాయ్? అని చూస్తే ఆత్మ‌గౌర‌వ ప్ర‌శ్న‌. ఎవ‌రికి వారు మేమంటే మేమే గొప్ప అనుకుంటారు. అలాంటిది వాళ్ల‌కు వాళ్లు గొప్ప‌. క‌న్న‌డిగుల‌కు అస‌లే ఆత్మాభిమానం ఎక్కువ‌. 

ఇప్ప‌టికే కావేరీ స‌మ‌స్య ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఎప్ప‌ట్నుంచో ఉంది. కావేరీ న‌ది పుట్టింది క‌ర్నాట‌క‌లోని త‌ల‌కావేరీ ప్రాంతంలో. అక్క‌డి నుంచి అది త‌మిళ‌నాడు దిశ‌గా ప్ర‌వ‌హించి బంగాళా ఖాతంలో క‌లిసేది తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల మ‌ధ్య గ‌ల ఈ గొడ‌వ ఇప్ప‌టిది కాదు. ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి రాక పోవ‌డానికి గ‌ల ప్ర‌ధాన‌ కార‌ణం కూడా ఇదే. 

ర‌జ‌నీ(మ‌రాఠీ అయిన‌ప్ప‌టికీ) పుట్టింది క‌ర్ణాట‌క‌లో.... ఎంతైనా పుట్టిన ప్రాంత అభిమానం అంటూ ఒక‌టి ఉంటుంది కాబ‌ట్టి.. ఆయ‌న్ను త‌మిళులు రాజ‌కీయ పార్టీ పెట్ట‌నివ్వ‌లేదని అంటారు. ఆయ‌న కూడా ఎందుకొచ్చిన గొడ‌వ అంటూ ప‌క్క‌కు త‌ప్పుకున్నారు. అదే క‌మ‌ల్ హాస‌న్ త‌న మ‌క్క‌ల్ నీతి మ‌య్యం అనే పార్టీ స్థాపించి.. డీఎంకేతో పొత్తు పెట్టుకుని.. ఇప్పుడు రాజ్య‌స‌భ‌కు కూడా వెళ్తున్నారు. అది వేరే విష‌యం అనుకోండి. త‌మిళ క‌న్న‌డ ప్ర‌జ‌ల‌కున్న గొడ‌వ‌లు ఈనాటివి కావు.. కావేరీ జ‌లాల విష‌యంలో ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఇప్ప‌టికే కొన్ని ప‌దుల సంఖ్య‌లో గొడ‌లు జ‌రిగాయ్.

ఎప్ప‌టి నుంచో క‌న్న‌డిగుల‌కు మ‌రో  స‌మ‌స్య కూడా ఉంది. త‌మ సినిమాలు ఇత‌ర భాష‌ల డ‌బ్బింగ్ సినిమాల ముందు తేలిపోతున్నాయ‌ని భావించిన వీరు డ‌బ్బింగ్ చిత్రాల‌పై బ్యాన్ విధించారు. ఈ బ్యాన్ ని ఎప్పుడెప్పుడు అమ‌లు చేద్దామా? అని చూస్తున్న వారికి క‌మ‌ల్- క‌న్న‌డ కామెంట్స్ మ‌రింత కాక పుట్టించాయ్. దీంతో అందివ‌చ్చిన అవ‌కాశాన్ని ఎలాగైనా వాడుకోవాల‌న్న‌ది ఇంకో ఎత్తుగ‌డ‌గా తెలుస్తోంది.

By
en-us Political News

  
బాపట్లా జిల్లా చీరాల కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డు లభించనుంది. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి (ఒడిఒపి)కింద కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డును ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాల పెంపే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
తల్లికి వందనంపై తప్పుడు ప్రచారం చేస్తే వైసీపీ నేతలకు తీవ్ర పరిణామాలు తప్పవు అని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు.
తెలంగాణల్లో స్ధానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సిద్దమవుతుంది. ఈ క్రమంలోనే మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్, కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులులో పేర్కొంది. ఫార్ములా- ఈరేసు కేసులో విచారణకు హాజరుకావాలని తెలిపింది.
గత ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నాయన్న ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టే ఇప్పుడు రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ మంత్రిగా ఉన్న తుమ్ముల నాగేశ్వరరావుకు కాళేశ్వరం బురద అంటించాలని చూస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి .
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాజ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని మోదీ శుక్రవారం పరామర్శించారు. విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
అరెస్ట్ భయంతో వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం కూలిన ఎయిర్‌ ఇండియా విమానం శిథిలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్‌ డీవీఆర్‌ లభించింది. ప్రమాద స్థలానికి చేరుకున్న గుజరాత్‌ యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌ ఏటీఎస్‌ అధికారులు దీనిని స్వాధీనం చేసుకున్నారు.
తొలి నుంచి క‌మల్ హాస‌న్ ది ద్ర‌విడ నాస్తిక వాదం. అది బై బ్ల‌డ్ అలా వ‌చ్చిందా అన్నది తెలీదు కానీ ఆయ‌న ద‌క్షిణాదిలోనే ఏఎన్నార్ త‌ర్వాత నాస్తిక‌వాదంలో అగ్ర‌గ‌ణ్యుడు.
పాక్ అమెరికా లు  సంప్ర‌దాయ మిత్ర దేశాలు. అయితే  911 దాడుల త‌ర్వాత  పాక్ కి దూరం జ‌రుగుతూ వ‌చ్చింది అమెరికా.  అప్ప‌ట్లో జార్జి బుష్ కి లాడెన్ కుటుంబానికి వ్యాపార సంబంధాలుండేవి. నేడ‌దే సీన్ రిపీట్ అవుతూ వ‌స్తోంది. మీకు తెలుసో తెలీదో గానీ మునీర్ కి ట్రంప్ కుటుంబానికి వ్యాపార సంబంధాలున్నాయ్.  ట్రంప్ పిల్ల‌ల‌కు చెందిన వ‌ర‌ల్డ్ లిబ‌ర్టీ ఫైనాన్షియ‌ల్ అనే బిట్ కాయిన్ సంస్థ తో మునీర్ నాయ‌క‌త్వంలో పాకిస్తాన్ ఒప్పంద ప‌త్రాల మీద సంత‌కాలు చేసింది.
ఫార్ములా-ఈ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. సోమవారం జూన్ 16న 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.