అండర్ -19 ఆసియా కప్ ఫైనల్.. పాక్ చేతిలో భారత్ చిత్తు

Publish Date:Dec 22, 2025

Advertisement

అండర్ 19 ఆసియాకప్ టోర్నీలో ఓటమి అనేదే లేకుండా ఫైనల్ కు చేరిన టీమ్ ఇండియా జట్టు ఫైనల్ లో చతికిల పడింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకుంది.  ఆదివారం (డిసెంబర్ 22)  ఏకపక్షంగా జరిగిన అండర్ -19 ఆసియా కప్ ఫైనల్ లో భారత జట్టు ఏకంగా 191 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి, దాయాది జట్టు అయిన పాకిస్థాన్ చేతిలో  ఓడిపోయింది.  

అండర్‌-19 ఆసియా కప్‌ టైటిల్‌ ఫైట్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన  పాకిస్థాన్ నిర్ణీత  50 ఓవర్లలో 8 వికెట్ల నష్టపోయి   347 పరుగుల భారీ స్కోరు చేసింది. పాకిస్థాన్ ఓపెనర్‌ సమీర్‌ మిన్హాస్‌  113 బంతుల్లో 172 పరుగులు చేశాడు.  అలాగే పాక్ బ్యాటర్ అహ్మద్‌ హుస్సేన్‌  56  పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో  దీపేష్‌ దేవేంద్రన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. హనిల్‌, ఖిలన్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.  భారీ చేదన కోసం బ్యాటింక్ చేపట్టిన భారత్ 26. 2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవి చూసింది.  భారత బ్యాటర్లలో 36 పరుగులు చేసిన దీపేష్ టాప్ స్కోరర్.  కెప్టెన్‌ ఆయుష్‌ మాత్రే (2), వైభవ్‌ సూర్యవంశీ (26) ఇలా మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు.  

పాక్‌ పేసర్ల షార్ట్‌ పిచ్‌ బంతులకు  భారత యువ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది.  పాకిస్థాన్ బౌలర్లలో అలీ రెజా నాలుగు వికెట్ల సాధించి రాణంచాడు.  సుభాన్‌, ఎహ్‌సాన్‌, సయ్యమ్‌ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. పాక్‌ ఆటగాళ్లతో  నో హ్యాండ్‌ షేక్‌  విధానాన్ని ఈ మ్యాచ్ లో కూడా ఇండియన్ క్రికెటర్లు పాటించారు.  
కాగా ఈ మ్యాచ్ లో పాక్ బౌలర్ అలీ రెజా అద్భుతంగా బౌలింగ్ చేసి రాణించినప్పటికీ, అతడి ప్రవర్తన మాత్రం అతిగా ఉంది. ధాటిగా ఆడే క్రమంలో ఔటై పెవిలియన్ కు వెడుతున్న వైభవ్ సూర్యవంశీని రెచ్చగొట్టేలా అలి రోజా సంబరాలు చేసుకున్నాడు. ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ కూడా తన నోటికి పని చెప్పాడు. అలాగే అంతకు ముందు  భారత జట్టు కెప్టెన్  ఆయుష్‌ అవునప్పుడు కూడా  అలీ రెజా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. దీంతో డగౌట్‌కు వెళ్తున్న ఆయుష్‌ ఆగ్రహంతో వెనక్కి వచ్చి నోటికి పని చెప్పాడు. 

ఆసియా క్రికెట్‌ మండలి  ఏసీసీ  చీఫ్‌, పాకిస్థాన్‌ మంత్రి అయిన మొహిసిన్‌ నఖ్వీ విజేతలకు పతకాలు, ట్రోఫీ ప్రదానం చేశారు. అయితే, భారత్‌కు చెందిన ప్రతినిధులు ఎవరూ ఈ కార్యక్రమంలో కనిపించలేదు. రన్నరప్‌ చెక్‌ను అఫ్ఘానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ మిర్వాసి అష్రఫ్‌ చేతుల మీదుగా భారత కెప్టెన్‌ ఆయుష్‌ అందుకొన్నాడు. కాగా, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో.. నఖ్వీ నుంచి భారత సీనియర్‌ జట్టు ఆసియా కప్‌ను అందుకొనేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.

By
en-us Political News

  
రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో 2025 సంవత్సరం మైలురాయిగా నిలుస్తుందని చెప్పవచ్చు. రాజధాని అమరావతి ప్రాంతంలో సైతం వివిధ నిర్మాణాలు ఊపందుకున్నాయి. దీంతో గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని పరిస్థితులు, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోని నెలకొన్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే చంద్రబాబు విజన్, కార్యదక్షత, ఎడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కళ్లకు కడుతుంది.
బుధవారం రాత్రి 7 గంటల నుంచే నగరవ్యాప్తంగా 120 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో డ్రంక్ అండ్ డ్రైవ్ సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
వాస్తవానికి తిరుమ‌ల ఈ స్థాయిలో ఉండ‌టానికి ఇక్క‌డి పూజారి వ్య‌వ‌స్థ ఎంతో ముఖ్య‌ కారణమని అంటారు. ఆ వ్యవస్థే తిరుమ‌ల‌ను మిగిలిన ఏ ఆల‌యం కన్నా కూడా మిన్నగా నిలుపోందని చెబుతారు. ఎవ‌రైతే ఆ ఆల‌యంలో సాక్షాత్ వైకుంఠంలో జ‌రిగిన‌ట్టే అన్ని పూజాదికాల‌ను జ‌రుపుతారో ఆ ఆల‌యం ఇల వైకుంఠం అవుతుంది. తిరుమ‌ల ఆల‌యం కన్నా పెద్ద ఆల‌యాలు లేక పోలేదు. శ్రీరంగం తిరుమ‌లకే కాదు ఏకంగా, వైష్ణ‌వ మ‌తానికే కేంద్ర కార్యాల‌యం. కానీ, తిరుమ‌ల శ్రీరంగం, తిరువ‌నంత‌పురం ప‌ద్మ‌నాభ స్వామి వారి ఆల‌యాల‌కు మించిన ప్రాభ‌వాన్ని, వైభ‌వాన్ని సొంతం చేసుకుందంటే అందుకు కార‌ణం ఇక్క‌డ జ‌రిగే క్ర‌తువులు అన్నీ ఆగ‌మ శాస్త్ర బ‌ద్ధంగా ఉంటాయి.
శివలింగాన్ని సుత్తి వంటి ఆయుధంతో కొట్టి ధ్వసంం చేసినట్లు స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి. సమాచారం తెలిసిన వెంటనే కోససీమ జిల్లా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ప్రభుత్వ రాజముద్రతో కొత్తగా ముద్రించిన ఈ పాసుపుస్తకాలను రైతులకు అంద జేసేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఒక వేళ ఆ పాసుపుస్తకాలలో ఏవైనా పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునే అవకాశం కూడా అధికారులు కల్పిస్తున్నారు. ఈ పాసుపుస్తకాల పంపిణీ కోసం ఊరూరా గ్రామ సభలు నిర్వహించనున్నారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, డీజీసీఏ ఉన్నతాధికారులు ఆ విమానంలో భోగాపురం విమానాశ్రయానికి వచ్చి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తారు.
కోర్టు విధించిన షరతు మేరకు ఆయన జనవరి 2 సిట్ కార్యాలయంలో సంతకం చేయాల్సి ఉంది.
హైదరాబాద్ మహా నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్ వ్యవస్థీకరించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు
నూతన సంవత్సర వేడుకలను అవకాశంగా మలుచుకున్న సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్తరకం ఎత్తుగడలకు తెరలేపారు
నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపింది.
చుట్టూ ఎత్తైన కొండ‌ల మ‌ధ్య సీక్రేట్ లేక్ గా పేరుగాంచిన దుర్గంచెరువును క‌బ్జాల చెర నుంచి హైడ్రా విడిపించింది.
సులభంగా డబ్బు వస్తుందన్న ఆశతో అమాయకులు చేస్తున్న చిన్న తప్పిదాలు, భవిష్యత్‌ను చీకట్లోకి నెట్టేస్తున్నాయి.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీని కేసుల గ్రహణం వీడటం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.