Publish Date:Jun 20, 2022
జగన్ సర్కార్ లో మేకలను బలిపశువులను చేస్తున్నారు. పై స్థాయిలో జరిగిన తప్పులకు కింది స్థాయి ఉద్యోగులను బలి చేస్తున్నారు. తాజాగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో అదే జరిగింది. కోర్టు ఆ శాఖ ముఖ్య కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేస్తే.. అందుకు బాధ్యులను చేస్తూ ఇద్దరు కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేశారు.
మరో అధికారికి చార్జి మెమో ఇచ్చారు. అసలు విషయమేమిటంటే ఉపాధి పనుల బిల్లుల చెల్లింపుల్లో జాప్యంపై కోర్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్లులు చెల్లించకుంటే ఎలా అని నిలదీసింది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేసిన పనికి సంబంధించి కోర్టు ధిక్కరణ కేసులో ఈ నెల 14న కోర్టుకు హాజరైన గోపాలకృష్ణ ద్వివేదిపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే.
హై కోర్టుర ఆదేశించినా గుత్తేదారులకు బిల్లులు చెల్లించరా అంటూ నిలదీసింది. కాగా బిల్లుల చెల్లింపులో జాప్యానికి కారణంగా చూపుతూ ప్రకాశం జిల్లా మార్కాపురం పంచాయతీరాజ్ డివిజన్ ఎఈ రమేష్ బాబు, డివిజనల్ అక్కౌంట్స్ అధికారి వీపీ సుబ్బారావులపై గోపాలకృష్ణ ద్వివేది సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే డీఈఈ కే. ఆదినారాయణకు చార్జి మెమో ఇచ్చారు. పిటిషనర్ పూర్తి చేసిన రోడ్డు పనిపై తొలుత క్వాలిటీ కంట్రోల్ విభాగం తనిఖీ చేసి, నాణ్యత లోపం ఉందంటూ రికవరీ పెట్టిన విషయాన్ని ప్రస్తావించకపోవడానికి, ఇంజినీర్లు సమాచారం ఇవ్వకపోవడమే కారణమని ముఖ్య కార్యదర్శి నిర్ధారణకు వచ్చి, వీరి కారణంగా హైకోర్టులో ఇబ్బందికరమైన పరిస్థితులతో పాటు, ప్రతికూల వ్యాఖ్యలు ఎదుర్కొన్నామని ఆ సస్పెన్షన్ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
కాగా ఇరువురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తూ వెలువరించిన జీవో శనివారం వెలుగులోనికి వచ్చింది. ఉపాధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యంపై, హైకోర్టు ఆయనపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. శాఖా పరంగా ఇటువంటి తీవ్ర చర్యలు తీసుకోవడంపై సంబంధిత వర్గాల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ప్రతికూల పరిస్థితుల్లో, తీవ్రమైన ఒత్తిడితో పని చేస్తున్న ఇంజినీర్లను చేయని తప్పునకు బలిపశువులను చేస్తున్నారని ఇంజినీర్ల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సస్పెన్షన్లను తక్షణం ఎత్తివేయాలని ఏపీ పంచాయతీరాజ్ ఇంజినీర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీవీ మురళీకృష్ణనాయుడు డిమాండ్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/two-panchayatraj-engineers-suspended-for-delay-in-payments-for-contractor-25-138037.html
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.