Publish Date:Jan 20, 2022
వ్యాక్సిన్ అంటేనే వామ్మో అంటున్నారు కొందరు. ఇప్పటికీ ఒక్క డోసు టీకా కూడా తీసుకోని వాళ్లు చాలామందే ఉంటారు. రెండో డోసు అవసరం లేదనుకునే వాళ్లూ ఎక్కువే. ఇక, వ్యాక్సిన్ కావాలంటూ ఆరాటపడే వారూ పెద్ద సంఖ్యలో ఉంటారు. లేటెస్ట్గా, వృద్ధులకు బూస్టర్ డోస్, పిల్లలకు ఫస్ట్ డోస్ ఇస్తుండటంతో.. చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
తొమ్మిదో తరగతి విద్యార్థికి అర గంటలో రెండు కొవిడ్ టీకాలు వేసిన ఘటన కలకలం రేపుతోంది. ఆ స్టూడెంట్ సోమవారం మొదటి డోసు టీకా వేయించుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్లకుండా పాఠశాల గేటు దగ్గర తిరుగుతున్నాడు. అతడిని చూసిన సిబ్బంది.. వ్యాక్సిన్ వేసుకోవడానికి భయపడుతున్నాడని భావించి.. ఆ పిల్లాడికి మాటలు చెప్పి మళ్లీ టీకా వేశారు.
వ్యాక్సిన్ వేయడం పూర్తయ్యాక కానీ.. ఆ విద్యార్థి నోరు విప్పలేదు. తాను కాసేపటి క్రితమే టీకా వేసుకున్నానని.. మీరు మళ్లీ ఇప్పుడు ఇంకో డోసు వేశారని.. ఏడుస్తూ చెప్పడంతో స్కూల్ సిబ్బంది అవాక్కయ్యారు. రెండు రోసులు వేసినందుకు ఆ పిల్లాడికి ఏమవుతుందోనని అంతా హడలిపోయారు.
మరి, టీకా తీసుకున్నానని ముందే చెప్పొచ్చుగా అని ఆ స్టూడెంట్ని అడిగితే.. ఏమో నాకేం తెలుసు.. రెండు డోసులు వెంటవెంటనే ఇస్తారని అనుకున్నా.. అని అమాయకంగా చెప్పడంతో మరింత ఖంగుతిన్నారు.
విషయం తెలిసి ఆందోళన చెందిన వైద్యులు, ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం నిలకడగానే ఉండటంతో.. ఇంటికి పంపించేశారు. పశ్చిమ బెంగాల్లోని దేబ్రాలోని అలోకా పాఠశాలలో జరిగిందీ ఘటన. ఆ స్టూడెంట్ పేరు.. సాథీదే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/two-doses-vaccine-to-a-student-in-half-an-hour-gap-39-130450.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.