అబద్ధం చెప్పడం అంత ఈజీ కాదు. ఒకవేళ అబద్దం చెప్పినా దొరక్కుండా ఉండటానికి చాలా టాలెంట్ కావాలి. పాపం ఆ టాలెంట్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కి అసలు లేనట్లుంది. అందుకే తరచూ అబద్ధాలు చెబుతూ, దొరికిపోతుంటారు. ఆయన చెప్పే అబద్దాలు చాలా త్వరగా బయటపడిపోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ట్రంప్ అబద్దాల గురించి ఓ షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ట్రంప్ తన మొత్తం పాలనలో 8,158 సార్లు అబద్ధాలు చెప్పారట. ఈ విషయాన్ని అక్కడి పత్రికలే చెబుతున్నాయి.
ట్రంప్ తన పదవీకాలంలో 8,158 అబద్ధాలు చెప్పారని కొద్ది రోజుల క్రితం అమెరికా పత్రికలు గగ్గోలు పెట్టాయి. తాజాగా స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలోనూ ఆయన కొన్ని అబద్ధాలు అలవోకగా చెప్పేశారు. ప్రస్తుతం ఆయన అబద్ధాల గురించి విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. మరి ఆయన కావాలని చెబుతున్నారో, సరైన సమాచారం లేక తప్పులు చెబుతున్నారో అర్థంకావట్లేదు కానీ.. ఒక్కటి మాత్రం నిజం. ఆయన వాస్తవానికి దూరంగా ఉండే విషయాలను చెబుతుంటారు. ట్రంప్ అబద్ధాల ట్రాక్ రికార్డు గురించి అక్కడ పత్రికల్లో కూడా వచ్చింది. ట్రంప్ అధికారం చేపట్టిన రెండేళ్లలో దాదాపు 8,158 అబద్ధాలు చెప్పారని ఈమధ్య వాషింగ్టన్ పోస్టు పత్రిక లెక్కలతో సహా వెల్లడించింది. తొలి ఏడాది రోజుకు సగటున 6 అబద్దాలు చెప్తే.. రెండో ఏడాది రోజుకు 17 అలవోకగా చెప్పేస్తున్నారట. ‘ది ఫాక్ట్ చెకర్ డేటాబేస్’ నుంచి ఈ వివరాలను సేకరించింది. వీటిల్లో ఆరువేల అబద్ధాలైతే ఏకంగా ఆశ్చర్యపర్చే రీతిలో ఉన్నాయట. గత అక్టోబర్లో మిడ్టర్మ్ ఎన్నికలప్పుడు ట్రంప్ ఏకంగా 1,200 సార్లు అబద్ధాలు చెప్పారట. ట్రంప్ తన పాలనలో అత్యధిక అబద్ధాలు వలసలపైనే చెప్పారట. దాదాపు మొత్తం 1,433 సార్లు ఆయన వలసలపై ప్రజలను తప్పుదోవ పట్టించినట్లు తేలింది. విదేశీ విధానాలపై 900, వాణిజ్యంపై 854, ఆర్థిక వ్యవస్థపై 790, ఉద్యోగాలపై 755, మీడియా ఇతర అంశాలపై 899 అబద్ధాలు చెప్పారట.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/trump-made-8158-false-or-misleading-claims-in-his-first-2-years-39-85740.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.