వన్డే సిరీస్ గెలుపు ఉత్సాహంతో ఉన్న ఇండియాకు న్యూజిలాండ్ టీమ్ గట్టి షాక్ ఇచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. కివీస్ ఓపెనర్లు చెలరేగిపోయారు. రెండో ఓవర్ నుంచే బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వికెట్ కీపర్ టిమ్ సిఫర్ట్తో మున్రో కూడా వేగంగా పరుగులు సాధించడంతో 8.2 ఓవర్లలోనే 86 పరుగులు దాటింది. ఈ దిశలో మున్రోను అవుట్ చేసిన క్రునాల్ పాండ్యా టీమిండియాకు తొలి బ్రేక్ అందించాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్స్సన్తో జతకలిసిన సిఫర్ట్ బౌండరీలతో చెలరేగిపోయాడు. న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.
తర్వాత బౌలర్లు కూడా విజృంభించడంతో టీమిండియా ఏ దశలోనూ లక్ష్యం దిశగా అడుగులు వేయలేదు. రోహిత్ శర్మ.. మూడో ఓవర్ రెండో బంతికే అవుట్ అయ్యాడు. ఐదు బంతులు ఆడి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత శిఖర్ ధావన్ 29 పరుగులు, విజయ్ శంకర్ 27 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత వికెట్ కీపర్లు రిషబ్ పంత్ 4 పరుగులు, దినేశ్ కార్తీక్ 5 పరుగులు, హార్ధిక్ పాండ్యా 4 పరుగులు చేసి వెంటనే వెనుదిరిగారు. 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియాను ధోనీ, కృనాల్ పాండ్యా ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే కొండంత లక్ష్యం కారణంగా రన్రేట్ పెరుగుతూ పోయింది. ఏడో వికెట్కు 52 పరుగులు జోడించిన తర్వాత 20 పరుగులు చేసిన కృనాల్ అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన భువనేశ్వర్ ఒక్క పరుగు చేసి అవుట్ అవ్వగా... 30 బంతుల్లో 5 ఫోర్లు, ఒక్క సిక్సర్తో 39 పరుగులు చేసిన ధోనీ సౌథీ బౌలింగ్లో అవుటయ్యాడు. అప్పటికే లక్ష్యం చివరి ఓవర్లో 84 పరుగులు. చివరి ఓవర్ రెండో బంతికే చాహాల్ అవుట్ కావడంతో 139 పరుగులకు భారత్ ఆలౌట్ అయ్యింది. మొత్తానికి ఇండియా 80 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
అయితే ఈ ఓటమితో ఇండియా ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇండియా ఇప్పటివరకూ ఆడిన అంతర్జాతీయ టీ-20ల్లో నేటి మ్యాచ్లో అత్యధిక పరుగుల తేడాతో ఓడి.. చెత్త రికార్డును నమోదు చేసింది. 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ-20 మ్యాచ్లో భారత్ 49 పరుగుల తేడాతో ఓడింది. కాగా నేడు 80 పరుగుల తేడాతో ఓడి.. ఆ రికార్డును అధిగమించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/new-zealand-beat-india-in-1st-t20-by-80-runs-39-85739.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.