ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో కొత్త ట్విస్ట్...!

Publish Date:Jul 21, 2026

Advertisement

 

ఆమెతో ఏడాది నుంచి రిలేషన్‌లో ఉన్న..సూసైడ్‌ నోట్‌లో ఉదయ్ కృష్ణారెడ్డి..!

ట్రైనీ ఐపీఎస్  ఉదయ్ కృష్ణా రెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారనే ప్రచారంలో కీలక పరిణామాలు చోటుచేసు కున్నాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు ఇప్పటివరకు లభించిన ఆధారాల ప్రకారం ఉదయ్ అసలు ఆత్మహత్యాయత్నమే చేయలేదని  నిర్ధారణకు వచ్చినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ప్రారంభంలో విషపూరిత ద్రవపదార్థం సేవించి ఆత్మహత్యకు యత్నించారనే వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో అలాంటి ఆధారాలు ఏవీ లభించలేదని సమాచారం. వైద్య పరీక్షల నివేదికల్లో ఆయన శరీరంలో విషపూరిత రసాయనాలు లేదా ఆత్మహత్యకు ఉపయోగించే పదార్థాల ఆనవాళ్లు కనిపించలేదని అధికారులు చెబుతున్నారు.

దర్యాప్తులో మరో కీలక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఉదయ్ కృష్ణా రెడ్డి అతిగా మద్యం సేవించడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. అదే కారణంగా ఆయనకు అస్వస్థత ఏర్పడగా, వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారని సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ ఘటనకు సంబంధించి వెలుగులోకి వచ్చిన సూసైడ్ నోట్‌పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. 

ఆ నోట్ నిజంగా ఉదయ్ కృష్ణా రెడ్డి రాసిందా? లేక మరెవరైనా సృష్టించారా? అది ఎప్పుడు రాయబడింది? అనే అంశాలను ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అవసరమైతే చేతిరాత నిపుణులతో కూడా పరీక్షలు నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం. పోలీస్ వర్గాల ప్రకారం, ఆత్మహత్యాయత్నం జరిగిందనే ప్రచారం వాస్తవాలకు భిన్నంగా ఉండొచ్చని అనుమానిస్తు న్నారు. సానుభూతి పొందేందుకు లేదా ఇతర కారణాలతో ఈ ప్రచారం జరిగి ఉండొచ్చనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. 

ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఆ సమయంలో ఆయనతో సంబంధం ఉన్న వ్యక్తులు, ఫోన్ కాల్స్, డిజిటల్ ఆధారాలు, ఇతర పరిస్థి తులన్నింటినీ అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే, ఈ వ్యవహారంపై తుది నిర్ధారణకు రావాలంటే ఫోరెన్సిక్ నివేదికలు, సూసైడ్ నోట్‌పై విశ్లేషణ, ఇతర సాంకేతిక ఆధారాలన్నీ అందాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మాత్రమే ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ లేఖలో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బయటకు వచ్చిన లేఖలో, తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణితో తాను ఏడాది పాటు రిలేషన్‌లో ఉన్నానని ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నాడు.

ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత కూడా తిరిగి తన వద్దకు వచ్చిందని, అనంతరం తమ మధ్య మళ్లీ సంబంధం కొనసాగిందని లేఖలో రాశాడు. ఈ విషయాలకు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని పేర్కొన్నాడు. అలాగే, తన మరణానికి నలుగురు వ్యక్తులు కారణమని సూసైడ్ నోట్‌లో ఆరోపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదులో ఏముంది?

తనతో పాటు శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఈ ఏడాది జూన్ 23 నుంచి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపుతూ దూషిస్తున్నాడని, రహస్యంగా తన వ్యక్తిగత ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించి వాటితో బెదిరిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా, ఆ వీడియోలను తన భర్తకు పంపి మానసికంగా వేధించడంతో పాటు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానంటూ బ్లాక్‌మెయిల్ చేశాడని ఆరోపించింది.

Trainee IPS Uday Krishna Reddy, Suicide note, Attapur Police Station, National Police Academy Hyderabad, Trainee IPS Suicide Attempt Drama, Hyderabad Police Investigation
 

By
en-us Political News

  
కేటీఆర్ జన్మదిన వేడుకలలో శుక్రవారం (జులై 24నపాల్గొన్న ఆయన తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ కేవలం నిరాధారమైన ప్రచారం, వదంతులు మాత్రమేనని స్పష్టత ఇచ్చారు.
తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రతిష్ఠకు భంగం కలిగేలా పింక్ డైమండ్ విషయంలో అవాస్తవాలను ప్రచారం చేశారంటూ గతంలో దాఖలైన పరువు నష్టం కేసు విచారణ ఇప్పుడు తుది దశకు వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా టీటీడీ జేఈవో వెంకయ్య చౌదరి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయ్యింది.
ద్యార్థుల హక్కుల కోసం ఒక పోరాట యోధుడిలా నిలబడిన వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆయనను గురుగ్రామ్‌లోని మేదాంతా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా ఆయన వైద్య చికిత్సను నిరాకరించి నిరశన కొనసాగించడంతో కేంద్రం దిగివచ్చింది.
దీంతో ఆయనను స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఏఐజీ ఆస్పత్రిలో ఆయన మోకాలి గాయానికి గురువారం విజయవంతంగా సర్జరీ జరిగింది.
కాక్రోచ్ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని ఖండించడమే కాకుండా.. దేశ విద్యావ్యవస్థలో ఇంతటి భారీ అక్రమాలు జరిగినా బాధ్యత వహించకపోవడం సరికాదనీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలన్న తమ డిమాండ్ లో ఇసుమంతైనా మార్పు లేదనీ విస్పష్టంగా ప్రకటించింది.
హెర్మూజ్ జలసంధిలో రావాణ స్తంభన, ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న రెండు సౌదీ ఆయిల్ ట్యాంకర్లపై దాడుల నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకే సారి 6 శాతం పైగా పెరిగింది. దీంతో ముడి చమురు బారెల్ ధర వంద డాలర్లకు చేరువైంది.
తాను ఆడిన నాలుగో టి20 ఇంటర్నేషనల్ లోనే ప్రపంచ రికార్డు తిరగరాశాడు. జింబాబ్వేతో హరారే వేదికగా గురువారం (జులై 23) జరిగిన టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ క్రికట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు.
2027 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ WTC ఫైనల్ తేదీలు, వేదికను ఐసీసీ ప్రకటించింది. లార్డ్స్ మైదానాన్ని తప్పించి ది ఓవల్ మైదానంలో జూన్ 9 నుంచి 13 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఫ్లాక్ సేఫ్టీ ఎల్పీఆర్ కెమెరాలు వీడియో రికార్డ్ చేస్తాయా లేదా కేవలం ఫోటోలు తీస్తాయా? కంపెనీ సీఈఓ వ్యాఖ్యలు, లీక్ అయిన పబ్లిక్ రికార్డులతో బయటపడిన సంచలన విషయాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఏఐ విప్లవం వెనుక పొంచి ఉన్న భారీ ఆర్థిక ప్రమాదం! 500 బిలియన్ డాలర్లకు పైగా అప్పులతో ఏఐ డేటా సెంటర్లు 2008 నాటి సబ్‌ప్రైమ్ మోర్ట్‌గేజ్ సంక్షోభాన్ని గుర్తుచేస్తున్నాయి. మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీల గుప్త రుణాలు, పెన్షన్ ఫండ్లకు ఉన్న ముప్పు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం గురించిన పూర్తి విశ్లేషణ.
పాస్‌వర్డ్ మరచిపోయినా ఇక ఆందోళన అవసరం లేదు! గూగుల్ కొత్తగా తీసుకొచ్చిన సెల్ఫీ వీడియో లాగిన్ ఫీచర్ ద్వారా మీ అకౌంట్‌ను సులభంగా రికవర్ చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లో g.co signin selfie ద్వారా ఈ ఫీచర్‌ను ఎలా సెటప్ చేయాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఢిల్లీలో నీట్ NEET పేపర్ లీక్ ఆందోళనలు, నిరసనల ఉధృతి నేపథ్యంలో టీసీఎస్ TCS తమ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ ఢిల్లీ పిటిఐ బిల్డింగ్ క్యాంపస్ సిబ్బందిని నోయిడా, గురుగ్రామ్ ఆఫీసుల నుంచి పనిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.