తుళ్ళూరు రైతులు ఎవరిని విశ్వసించాలి?

Publish Date:Jan 2, 2015

Advertisement

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న నూతన సంవత్సర వేడుకలని రాజధాని నిర్మించబోయే తుళ్ళూరులోనే జరుపుకోవడం చాలా తెలివయిన నిర్ణయమనే చెప్పాలి. ఆయన స్వయంగా అక్కడికి వచ్చి నేరుగా రైతులతోనే మాట్లాడటం వలన వారిలో నెలకొన్న అనుమానాలు, అపోహలు తొలగి ప్రభుత్వం పట్ల నమ్మకం ఏర్పడేందుకు దోహదపడింది. నిన్న జరిగిన సభలో ఐదుగురు రైతులు తమ 161 ఎకరాల పొలాల తాలూకు పాసు పుస్తకాలను ముఖ్యమంత్రి అందజేశారు. అంతే కాకుండా స్థానిక రైతులు ఆయనకి వెండి కిరీటం బహూకరించడం విశేషం.

 

మొదటి నుండి కూడా రాజధాని భూసేకరణకు అడ్డుపడుతున్న వైకాపా ఉద్దేశ్యాలను ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజలకు వివరించడం ద్వారా ఆ పార్టీ నేతలు ప్రజలలో రేకెత్తించిన అనుమానాలు, భయాలను దూరం చేసే ప్రయత్నం చేసారు.

 

చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రబాబు నాయుడు రాజధానిని తన ప్రాంతంలోనే ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉంది. అక్కడ ప్రభుత్వ భూముల లభ్యత కూడా ఉంది గనుక ఆయనను ఎవరూ తప్పు పట్టడానికి కూడా అవకాశం ఉండేది కాదు. పైగా రాయలసీమ ప్రజలు కూడా ఆయనకు మద్దతు పలికేవారు. కానీ రాజధాని నగరం రాష్ట్రానికి మధ్యలో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన తుళ్ళూరును ఎంచుకొన్నారు.

 

ఒకవేళ తెదేపా అధికారంలోకి రాకపోయుంటే వైకాపా రాజధాని నగరాన్నితనకు బాగా పట్టున్న ఇడుపులపాయలో ఏర్పాటు చేసి ఉండేదని, కానీ అలా జరగకపోవడంతో అసూయతో ప్రజలను భయబ్రాంతులను చేసి రాజధాని భూసేకరణకు అడ్డంకులు సృష్టించేందుకే పచ్చటి పంట పోలాలకు నిప్పు పెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాయలసీమలో రాజకీయ కక్షలు పెంచుకొన్నవారు చెరుకు తోటలకు నిప్పుపెడుతుంటారని, జగన్మోహన్ రెడ్డి అదే విష సంస్కృతిని తుళ్ళూరులో కూడా అమలుచేసారని చంద్రబాబు ఆరోపించారు. అటువంటి ప్రయత్నాలు చేసేవారిని సహించబోనని తీవ్రంగా హెచ్చరించారు.

 

ఇంతవరకు అనేకమంది మంత్రులు ఈ అంశంపై వైకాపాను, జగన్మోహన్ రెడ్డిని విమర్శించినప్పటికీ దానిని ఎవరూ అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రే జగన్ పై తీవ్ర ఆరోపణలు చేయడంతో ప్రజలను కూడా ఆలోచింపజేస్తోంది. ఎందువలన అంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి నిరాధారమయిన ఆరోపణలు చేస్తే దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి.

 

చట్టబద్దంగా భూసేకరణ చేసేందుకు ప్రభుత్వానికి అధికారాలున్నప్పటికీ, రైతులకు గరిష్టంగా ప్రయోజనం కలగాలనే ఉద్దేశ్యంతోనే చాలా లోతుగా అధ్యయనం చేసిన తరువాత ఈ ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అమలుచేస్తున్నామని ఆయన రైతులకు తెలిపారు. ఇంతవరకు మీడియాలో వస్తున్న వార్తలు, వివరాల ద్వారానే ల్యాండ్ పూలింగ్ విధివిధానాల గురించి, ప్రభుత్వం ఇవ్వబోయే పరిహారం గురించి తెలుసుకొంటున్న రైతులకు, ముఖ్యమంత్రి స్వయంగా వారికి నిన్న అన్నీ వివరించి వారికి తన ప్రభుత్వం పట్ల నమ్మకం కల్పించేందుకు ప్రయత్నించారు. రైతులు అందరూ ప్రభుత్వానికి సహకరించి తమ భూములు అప్పగించినట్లయితే, వీలయినంత తొందరగా రాజధాని నిర్మాణం చేసి వారికి గరిష్టంగా ప్రయోజనం కలిగేలా చేస్తానని తెలిపారు.

 

వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఎటువంటి రాజకీయపరిణామాలు చోటు చేసుకొంటాయో ఎవరికీ తెలియదు. కనుక రాజధాని కోసం భూములు ఇస్తున్న రైతులు అందరూ కూడా ఈ ఐదేళ్ళలోనే పూర్తి ప్రయోజనం పొందడం చాలా అవసరం. వచ్చే ఎన్నికల నాటికి కనీసం రాజధాని నగర పరిధిలో నిర్మాణాలు పూర్తయితేనే అక్కడ భూములు ఇచ్చినవారికి పూర్తి ప్రయోజనం చేకూరుతుంది. అప్పుడే మిగిలిన ప్రాంతాలలో భూములు ఇచ్చిన వారికి కూడా ఎటువంటి ప్రయోజనం పొందబోతున్నారనే విషయంపై ఒక స్పష్టత వస్తుంది. కనుక రైతులు కూడా వాస్తవిక దృక్పధంతో ఆలోచించి సరయిన నిర్ణయం తీసుకోవాలి.

 

ఎన్నికలలో గెలిచేందుకే ఓదార్పు యాత్రలు, సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసిన వైకాపాను నమ్మడమా లేక రాజధాని నిర్మించి తమ భూముల విలువలను పదిరెట్లు పెంచి ఇస్తామని చట్టబద్దంగా హామీ ఇస్తున్న ప్రభుత్వాన్ని నమ్మడమా? ఏది మంచిదో రైతులే ఆలోచించుకోవాలి.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.