రాజకీయపార్టీల అదృష్టాలను తారుమారు చేసిన 2014

Publish Date:Dec 31, 2014

Advertisement



ఈ 2014సం.లో దేశ, రాష్ట్ర రాజకీయాలలో ఊహించని అనేక మార్పులు జరిగాయి. పదేళ్ళపాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాదం వల్లనే రెండు చోట్ల కూడా నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. అయినా అది పశ్చాత్తాపపడలేదు. తప్పులను సరిదిద్దుకొనే ప్రయత్నమూ చేయలేదు. బహుశః అందువలననేమో ఈ ఆరు నెలలలో జరిగిన అన్ని ఎన్నికలలో ఘోరపరాజయాలు మూటగట్టుకట్టుకొంటూ క్రమంగా ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయింది.

 

ఇక సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీలో సీనియర్ నేతలయిన అద్వానీ, సుష్మాస్వరాజ్ వంటివారినందరినీ కాదని మోడీకి పార్టీ పగ్గాలు అప్పగించడం వలననే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది. క్రమంగా దేశమంతా విస్తరిస్తోంది కూడా.

 

గత ఆరు దశాబ్దాలుగా సాగిన ఉద్యమాలన్నీ ఒక ఎత్తయితే, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ నేతృత్వంలో గత పదేళ్ళుగా సాగిన ఉద్యమాలు మరొక ఎత్తని చెప్పవచ్చును. కాంగ్రెస్ పార్టీ తనే తెలంగాణా ఇచ్చిందని చెప్పుకొంటున్నప్పటికీ, కేసీఆర్ అనుసరించిన అనేక రకాల వ్యూహాల కారణంగానే తెలంగాణ ఇవ్వకతప్పని పరిస్థితి కల్పించారు. కనుక ఆ ఖ్యాతి ఆయనకు, ఆయన వెంట నిలిచి పోరాడిన కోట్లాది తెలంగాణా ప్రజలకు, రాష్ట్రం కోసం బలిదానాలు చేసుకొన్నా విద్యార్థులకే దక్కుతుంది. అందుకే ప్రజలు ఆయనకే పట్టం కట్టారు. ఆయన కూడా ప్రజలు తనపై పెట్టుకొన్న ఆశలు వమ్ముచేయకుండా ముందుకు సాగుతున్నట్లే ఉన్నారు. ఐదేళ్ళ తరువాత తెలంగాణాలో జరిగిన అభివృద్దే ఆయన పాలనకు గీటురాయిగా నిలుస్తుంది.

 

ఇక పదేళ్ళ పాటు ప్రతిపక్షంలో కూర్చొన్న తెదేపా అనేక ఆటుపోటులను ఎదుర్కొంది. అయినప్పటికీ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చాలా నిబ్బరంగా వ్యవహరిస్తూ ఒంటి చేత్తో తన పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకు రాగలిగారు. కానీ రాష్ట్ర విభజన తరువాత అనేక క్లిష్ట సమస్యలను ఎదుర్కోవలసి రావడం, వాటిని ఆయన అదే నిబ్బరంతో ఎదుర్కొంటూ, ఈ ఆరునెలల కాలంలోనే క్రమంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం చాలా అభినందనీయం. ఆయన రాష్ట్రం కోసం చాలా భారీ కలలే కంటున్నారు. వచ్చే ఎన్నికలలోగా వాటిని నెరవేర్చి చూపి, ప్రజలను మెప్పించి అధికారం నిలబెట్టుకోవాలని ఆయన ఆరాటపడుతున్నారు.

 

ఇక 2014 సం. వైకాపాకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. సరిగ్గా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి బెయిలు సంపాదించుకొని చంచల్ గూడా జైలు నుండి బయటపడగలిగినప్పటికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నికలలో మాత్రం గెలువలేకపోయారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని రాష్ట్రాన్ని పాలించాలని తపించిపోతున్న ఆయన తనకు బాగా పట్టు ఉన్న ఆంధ్రలో గెలిచేందుకు తెలంగాణా నుండి బయటపడి సమైక్యాంధ్ర శంఖారావం పూరించినప్పటికీ, ఆయన ఉద్దేశ్యం గ్రహించిన ప్రజలు ఎన్నికలలో వైకాపాను తిరస్కరించారు. ఇది ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బేనని చెప్పవచ్చును. కానీ 67 అసెంబ్లీ సీట్లు గెలుచుకొని బలమయిన ప్రతిపక్షంగా నిలబడగలిగారు. కానీ ఎన్నికల కోసం మరో నాలుగున్నరేళ్లు వేచి చూడక తప్పదు. అప్పటికి ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు.

 

ఇక కాంగ్రెస్ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఎన్నికల ముందు హడావుడిగా రాష్ట్ర విభజన చేసింది. అందుకు అది తగిన శిక్ష ఎలాగూ అనుభవించింది. కానీ అది చేసిన పొరపాటుకు, రెండు ప్రభుత్వాలు, ఇరు రాష్ట్ర ప్రజలు నేటికీ భారీ మూల్యం చెల్లిస్తున్నారు. రాష్ట్ర విభజన ఒకరికి మోధం మరొకరికి ఖేదం మిగిల్చింది. కాంగ్రెస్ అధిష్టానం ఏ ఉద్దేశ్యంతో రాష్ట్ర విభజన చేసినప్పటికీ, తెలంగాణా రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది కనుక వారు చాలా ఆనందించారు. కానీ కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా అవతరించిన ఆంద్రప్రదేశ్ పరిస్థితి చూసి ఆ రాష్ట్ర ప్రజలు చాలా బాధపడ్డారు. అసలు ఈ దుస్థితి నుండి ఎప్పటికయినా బయటపడగలమా? అని బెంగపెట్టుకొన్నారు కూడా.

 

రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నేటికీ గొడవలు కొనసాగుతున్నప్పటికీ, ప్రజలు మాత్రం చాలా త్వరగానే ఆ విభజన ప్రభావం నుండి బయటపడటం విశేషం. అందుకు కారణం వారికి నచ్చినట్లుగా సుస్థిరమయిన ప్రభుత్వాలు వారు ఏర్పాటుచేసుకోవడమేనని చెప్పవచ్చును. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా, ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అభివృద్ధి మంత్రం జపిస్తున్నాయి. రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీలు పడుతున్నాయి. ఇంతవరకు దేశంలో అతిపెద్ద బలమయిన రాష్ట్రంగా ఉంటూ వచ్చిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంరెండు ముక్కలయినందుకు బాధపడాలో లేకపోతే విడిపోయిన తరువాత వేగంగా అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషించాలో తెలియని పరిస్థితి. కానీ అంతా మన మంచికేనని సరిపెట్టుకొని ముందుకు సాగడమే మేలు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.