హైదరాబాద్‌లో ఎకరం రూ.177 కోట్లు

Publish Date:Oct 6, 2025

Advertisement

 

హైదరాబాద్ రియల్‌ ఎస్టేట్ మార్కెట్ మరోసారి చరిత్ర సృష్టించింది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ  నిర్వ హించిన రాయదుర్గం భూవేలంలో ఎకరానికి రూ.177 కోట్లు పలకడంతో కొత్త రికార్డు నమోదైంది. మొత్తం 7.67 ఎకరాల భూమిరూ.1357.59 కోట్లకు అమ్ము డైంది.ఇది ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని రికార్డు స్థాయి ధర. గతంలో కోకాపేట నియో పోలిస్‌ ప్రాంతంలో హెచ్‌ఎండీఎ నిర్వహించిన వేలంలో ఎకరానికి రూ.100.75 కోట్లు పలికిన రికార్డును రాయదుర్గం భూ వేలం పాట బద్దలు కొట్టింది.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై పెట్టుబడిదారుల విశ్వాసానికి ఇది నిదర్శనమని చెప్పవచ్చు..ఈ వేలంలో ప్రముఖ జాతీయ, ప్రాంతీయ డెవలపర్లు భారీగా పాల్గొన్నారు. ఇది హైదరాబాద్ స్థిరమైన వృద్ధి, ప్రభుత్వ పారదర్శక విధానాలు, నాలెడ్జ్ సిటీ మధ్యలో ఉన్న రాయదుర్గం వ్యూహాత్మక ప్రాధాన్యం — అన్నీ కలిపి పెట్టుబడి దారుల విశ్వాసాన్ని ప్రతిబింబించింది.ఈ సందర్భంగా TGIIC వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక, IAS మాట్లాడుతూ...రాయదుర్గం వేలం విజయం తెలంగాణ కు గర్వకారణమని అన్నారు. ఎకరానికి రూ.177 కోట్ల రికార్డు ధర పలకడం ఎంతో సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.

.. హైదరా బాద్ యొక్క దీర్ఘకా లిక సామర్థ్యాన్ని, తెలంగాణ రైజింగ్–2047 దిశగా రాష్ట్రం సాగుతున్న దృఢ సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు మద్దతుతో, పారదర్శకమైన, వ్యాపారానుకూల వాతావరణాన్ని సృష్టించాలనే ప్రభుత్వ దార్శనికత కు ఇది నిదర్శన మని పేర్కొన్నారు. భూమి విలువ పెరుగుదలలో ఇది ఒక కొత్త మైలు రాయి అని అన్నారు. 

2017లో రాయదుర్గం 2.84 ఎకరాలు ఎకరానికి రూ.42.59 కోట్లు పలికాయి. 2022లో కోకాపేట నియోపోలిస్‌లో ఎకరానికి రూ.100.75 కోట్లు పలికాయి.2025లో రాయదుర్గం ఎకరానికి రూ.177 కోట్లు పలకడం ద్వారా నాలుగు రెట్ల వృద్ధి సాధించింది. వేలం విజయ వంతం కావడంలో కీలక పాత్ర పోషించిన TGIIC బృందం, JLL మరియు MSTC సభ్యులకు శశాంక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సహకారం, బిడ్డర్లు చూపిన విశ్వాసమే ఈ చారిత్రాత్మక ఫలితానికి కారణమని ఆయన పేర్కొన్నారు.


 

By
en-us Political News

  
న్యాయ వివాదాల పరిష్కార ప్రక్రియలో, ముఖ్యంగా మధ్యవర్తిత్వ రంగంలో ఏఐ వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది
దేశ రాజకీయాల్లో ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రముఖ గాయని సత్యవతి ముడావత్ (మంగ్లీ) ఇచ్చిన ఫిర్యాదు సంచలనంగా మారింది.
విదేశాల్లో ఉన్నత చదువులు, మంచి భవిష్యత్తు కోసం వెళ్లిన ఓ యువకుడు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం కుటుంబాన్ని విషాదంలో ముంచింది.
ఆశా భోంస్లే మృతి పట్ల సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులర్పిస్తున్నారు
నాసిక్ ఐటీ కంపెనీలో లైంగిక వేధింపుల ఉదంతం దేశవ్యాప్తంగా ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
భారతీయ సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోస్లే
పెళ్లి పీటలపై కట్నం డబ్బుల కోసం డిమాండ్ చేయడం గానీ, ఇతర వివాదాస్పద కోర్కెలతో పెళ్లి ఆగిపోవడం గానీ మనం విన్న విషయాలే.
భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో కీలక అడుగు వేసింది.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి ఓ వాహనదారుడు వేసిన కొత్త ఎత్తు చివరకు పోలీసులకే షాక్ ఇచ్చింది.
అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరోసారి తన కఠిన వైఖరిని రుచిచూపించింది.
వయసు పైబడితే చాలు విశ్రాంతి కోరుకుంటారు ఎవరైనా. 60 ఏళ్లు దాటాయంటే మోకాళ్ల నొప్పులని, ఓపిక లేదని ఇంటికే పరిమితమవుతారు.
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణం శనివారం ఒక అరుదైన మరియు ఆత్మీయ దృశ్యానికి వేదికైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.