Publish Date:Oct 13, 2025
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని బలీయ శక్తి అనడంలో సందేహం లేదు. అదే సమయంలో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ క్షేత్ర స్థాయిలో బలీయంగా ఉంది. అయినా కూడా ఆ రాష్ట్రంలో రాజకీయంగా పార్టీ కార్యకలాపాలేవీ పెద్దగా జరగడం లేదు. ఏమైనా సమావేశాలు జరిగినా, జరిపినాఅవి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కే పరిమితం అవుతున్నాయి తప్ప.. జనంలోకి పెద్దగా వెళ్లడం లేదు.
అయినా.. పార్టీ రాజకీయంగా తెలంగాణలో క్రియాశీలంగా లేకపోయినా, పార్టీ క్యాడర్ మాత్రం తెలుగుదేశం పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టమైన పిలుపు ఏదీ లేకపోవడంతో.. రాష్ట్ర విభజన తరువాత నుంచీ పార్టీ క్యాడర్ ఎక్కడికక్కడ కామ్ డౌన్ అయిపోయారు. ఎన్నికల సమయంలో మాత్రం అన్ని రాజకీయ పార్టీలూ మద్దతు కోసం తెలుగుదేశం క్యాడర్ వైపు చూడటం ఆనవాయితీగా మారిపోయింది. ఆ సమయంలో కూడా తెలుగుదేశం కేడర్ కు అధినాయకత్వం నుంచి ఎటువంటి డైరెక్షన్ రాని పరిస్థితుల్లో.. కార్యకర్తలు ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితులను బట్టి వారంతట వారే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటూ వస్తున్నారు.
సరే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకులు కరవు అన్న సంగతి తెలిసిందే. అయితే కార్యకర్తల బలం మాత్రం ఇసుమంతైనా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇందుకు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే తార్కానం. అన్ని పార్టీలూ కూడా ఆ ఎన్నికలలో తెలుగుదేశం జెండా మోయడానికి పోటీలు పడడమే.
తెలంగాణలో తెలుగుదేశం వెనుకబాటుకు కారణం నాయకులు కరవవ్వడమే అన్న విషయంలో సందేహం లేదు. ఆ కారణంగానే రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఇతర పార్టీల నేతలు తెలుగుదేశం క్యాడర్ బలంతోనే తాము గెలిచామని చెప్పుకోవడానికి ఇసుమంతైనా సంకోచించరు. అంతటి బలమైన క్యాడర్ ఉన్న తెలుగుదేశం తెలంగాణలో విస్తరించడానికి అన్ని అవకాశాలూ ఉన్నా నాయకత్వం మాత్రం ఆ దిశగా పెద్దగా దృష్టిపెట్టడం లేదన్న అసంతృప్తి ఇప్పుడు క్యాడర్ లో బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తరువాత.. తెలంగాణలో పార్టీ పటిష్ఠతకు చర్యలు తీసుకుంటుందని ఆశించిన క్యాడర్ ఇప్పుడు పార్టీ అధినాయత్వంపై ఒత్తిడి తీసుకు వస్తున్నది. ఇప్పుడు తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.
ఆ స్థానిక ఎన్నికలలో పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టాలని పార్టీ క్యాడర్ అధిష్ఠానాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నది. అసలు జూబ్లీ బైపోల్ లోనే తెలుగుదేశం అభ్యర్థిని నిలబెట్టాలని క్యాడర్ డిమాండ్ చేసినప్పటికీ చంద్రబాబు బీజేపీతో పొత్తు కారణంగా ఉన్న పరిమితులను విడమర్చి చెప్పి సముదాయించారు. అయితే స్థానిక ఎన్నికల విషయానికి వచ్చే సరికి అలా సముదాయించడం అంత తేలిక కాదన్న భావన రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-tdp-cadre-bring-pressure-on-cbm-39-207834.html
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు.
తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ పట్లే కక్షగట్టినట్లుగా వ్యవహరించారు. ఇంత కాలం తన వెన్నంటి ఉండి, తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దౌర్జన్యాలకు దిగారు. పార్టీ అధినేతపైనా, అధినేత కుటుంబంపైనా కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తల్లిలాండి భువనేశ్వరిని సైతం దుర్భాషలాడారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.