Publish Date:Oct 13, 2025
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని బలీయ శక్తి అనడంలో సందేహం లేదు. అదే సమయంలో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ క్షేత్ర స్థాయిలో బలీయంగా ఉంది. అయినా కూడా ఆ రాష్ట్రంలో రాజకీయంగా పార్టీ కార్యకలాపాలేవీ పెద్దగా జరగడం లేదు. ఏమైనా సమావేశాలు జరిగినా, జరిపినాఅవి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కే పరిమితం అవుతున్నాయి తప్ప.. జనంలోకి పెద్దగా వెళ్లడం లేదు.
అయినా.. పార్టీ రాజకీయంగా తెలంగాణలో క్రియాశీలంగా లేకపోయినా, పార్టీ క్యాడర్ మాత్రం తెలుగుదేశం పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. పార్టీ అధిష్ఠానం నుంచి స్పష్టమైన పిలుపు ఏదీ లేకపోవడంతో.. రాష్ట్ర విభజన తరువాత నుంచీ పార్టీ క్యాడర్ ఎక్కడికక్కడ కామ్ డౌన్ అయిపోయారు. ఎన్నికల సమయంలో మాత్రం అన్ని రాజకీయ పార్టీలూ మద్దతు కోసం తెలుగుదేశం క్యాడర్ వైపు చూడటం ఆనవాయితీగా మారిపోయింది. ఆ సమయంలో కూడా తెలుగుదేశం కేడర్ కు అధినాయకత్వం నుంచి ఎటువంటి డైరెక్షన్ రాని పరిస్థితుల్లో.. కార్యకర్తలు ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితులను బట్టి వారంతట వారే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటూ వస్తున్నారు.
సరే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నాయకులు కరవు అన్న సంగతి తెలిసిందే. అయితే కార్యకర్తల బలం మాత్రం ఇసుమంతైనా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇందుకు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే తార్కానం. అన్ని పార్టీలూ కూడా ఆ ఎన్నికలలో తెలుగుదేశం జెండా మోయడానికి పోటీలు పడడమే.
తెలంగాణలో తెలుగుదేశం వెనుకబాటుకు కారణం నాయకులు కరవవ్వడమే అన్న విషయంలో సందేహం లేదు. ఆ కారణంగానే రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఇతర పార్టీల నేతలు తెలుగుదేశం క్యాడర్ బలంతోనే తాము గెలిచామని చెప్పుకోవడానికి ఇసుమంతైనా సంకోచించరు. అంతటి బలమైన క్యాడర్ ఉన్న తెలుగుదేశం తెలంగాణలో విస్తరించడానికి అన్ని అవకాశాలూ ఉన్నా నాయకత్వం మాత్రం ఆ దిశగా పెద్దగా దృష్టిపెట్టడం లేదన్న అసంతృప్తి ఇప్పుడు క్యాడర్ లో బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా 2024 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తరువాత.. తెలంగాణలో పార్టీ పటిష్ఠతకు చర్యలు తీసుకుంటుందని ఆశించిన క్యాడర్ ఇప్పుడు పార్టీ అధినాయత్వంపై ఒత్తిడి తీసుకు వస్తున్నది. ఇప్పుడు తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.
ఆ స్థానిక ఎన్నికలలో పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టాలని పార్టీ క్యాడర్ అధిష్ఠానాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నది. అసలు జూబ్లీ బైపోల్ లోనే తెలుగుదేశం అభ్యర్థిని నిలబెట్టాలని క్యాడర్ డిమాండ్ చేసినప్పటికీ చంద్రబాబు బీజేపీతో పొత్తు కారణంగా ఉన్న పరిమితులను విడమర్చి చెప్పి సముదాయించారు. అయితే స్థానిక ఎన్నికల విషయానికి వచ్చే సరికి అలా సముదాయించడం అంత తేలిక కాదన్న భావన రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-tdp-cadre-bring-pressure-on-cbm-39-207834.html
2029 ఎన్నికలలో విజయం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్న జగన్ ఇప్పుడు కూడా నేతలను సొంత నియోజకవర్గం నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీలో నిలబెట్టాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అందులోనూ ప్రధానంగా ప్రస్తుతం చిలకలూరి పేట నియోజకవర్గంలో పని చేసుకుంటున్న మాజీ మంత్రి విడదల రజనీని వచ్చే ఎన్నికలలో రేపల్లె నుంచి పోటీలో దింపాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్న లోకేష్ తనకు రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచీ సబ్బానాయుడితో మంచి పరిచయం, అనుబంధం ఉందన్నారు.
తమిళ సినిమా లెనిన్ ఇండియన్ అనే సినిమాతో రోజా వెండితెరపై మళ్లీ కనిపించనున్నారు. ఈ మేరకు ఆ మూవీ మేకర్స్ రోజా తమ సినిమాలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.
జూబ్లీ హిల్స్లో సెంటిమెంటో గెలుస్తుందో డెవలప్మెంటో గెలుస్తుందో తెలుస్తుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాలి అని టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు టీడీపీ నాయకులను ఆదేశించారు
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గోన్ననున్నారు.
హర్యానా ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ పెద్దగా కనిపించడం లేదు. పార్టీ అభ్యర్థి ఎంపికకే చాలా సమయం తీసుకున్న ఆ పార్టీ.. ప్రచారంలోనూ వెనుకబడింది. ప్రచార సరళిని బట్టి చూస్తుంటే జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ అన్న అభిప్రాయం కలుగుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
నాగబాబు ఎమ్మెల్సీ అయిన తరువాత కూడా తన వైఖరి మార్చుకోలేదని నిన్న మొన్నటి దాకా తెలుగుదేశం శ్రేణులు అంటుండేవి. ఎమ్మెల్సీగా నాగబాబు తన తొలి పర్యటనను తన సోదరుడు, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురం నుంచే మొదలు పెట్టారు. కానీ ఆ పర్యటన ఆద్యంతం తెలుగుదేశం, జనసేన క్యాడర్ మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లే విధంగానే సాగింది.
రాజకీయాలలో తొలి అడుగు కూడా పడకుండానే ఆయన నడకను ఆపేయాలని చూశారు. అయితే వాటన్నిటినీ తట్టుకుని నిలబడిన లోకేష్.. తనపై విమర్శలకు తన పనితీరుతోనే బదులిచ్చారు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో మొదలు పెట్టి బెరుకు లేకుండా, బెదురు లేకుండా నిలదొక్కుకుని ఇప్పుడు ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంగా మారారు.
రైతులు కోరినా జగన్ మాత్రం పొలాల్లోకి అడుగుపెట్టలేదు. ఇదే రకం పరిశీలనో అర్ధంగాక రైతులు తలలుబాదుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తాను సీఎంగా ఉన్న సమయంలో రైతులను అన్నివిధాలుగా ఆదుకున్నానన్నారు. మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో పాతిక జిల్లాల్లో పంటనష్టం జరిగిందన్నారు. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రూపాయి కూడా సాయం అందలేదన్నారు.
ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించి ఎన్నికల ప్రచారంలో మైనారిటీ తీరని పిల్లలతో ఎన్నికల ప్రచారం చేయించారంటూ కేటీఆర్ పై షఫీయుద్దీన్ ఫిర్యాదు చేశారు.
బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.