Publish Date:Oct 13, 2025
సినిమా నటులు రాజకీయాలలోకి రావడం అరుదేం కాదు. అయితే రాజకీయ నాయకుడిగా మారిన నటుడు తనకు రాజకీయాల కంటే సినిమాలే ముఖ్యం అంటూ యూటర్న్ తీసుకోవడం చాలా చాలా అరుదు. అందులోనూ సినిమాల కోసం అవసరమైతే కేంద్ర మంత్రి పదవిని కూడా వదులుకోవడానికి సిద్ధం అనడం అంటే.. అది అసలు ఊహకు కూడా అందని విషయం.
అలాంటి ఊహకందని వ్యాఖ్యలు చేశారు ప్రముఖ మలయాళ నటుడు, కేంద్రపెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీ. రాజకీయాలలో ఉండటం, కేంద్ర మంత్రిగా పదవిలో ఉండటం తనకేమీ సంతృప్తి ఇవ్వడం లేదన్నారు సురేష్ గోపీ. సినీ కెరీర్ ను వదిలిపెట్టి రాజకీయాలలోకి రావాలని కానీ, కేంద్ర మంత్రి కావాలని కానీ తాను ఎన్నడూ అనుకోలేదని సురేష్ గోపీ చెప్పుకొచ్చారు. అయినా రాజకీయాలలోకివచ్చి కేంద్ర మంత్రిని అయ్యాననీ, కానీ అప్పటి నుంచీ తనకు చేతిలో డబ్బులు ఆడటంలేదనీ, ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే డబ్బుల కోసం మళ్లీ సినిమాలలో నటించాలని భావిస్తున్నట్లు చెప్పారు. తాను సినిమాలలో నటించడానికి కేంద్ర మంత్రి పదవి అడ్డంకి అయితే.. ఆ పదవిని తృణ ప్రాయంగా త్యజిస్తానని చెప్పారు. అదే జరిగి ఒక వేళ తానురాజీనామా చేస్తే.. తాను వదిలేసే మంత్రి పదవిని తన రాష్ట్రానికే చెందిన అంటే కేరళకు చెంది రాజ్యసభ సభ్యుడు సదానంద్ మాస్టర్ కు ఇవ్వాలని ఆయన ప్రధానిని కోరారు.
సినిమాల ద్వారా విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సురేష్ గోపీ ఆ తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో త్రిసూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి.. పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా కేంద్ర కేబినెట్ లో స్థానం పొందారు. అయితే రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచీ తన ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందన్నారు. తన పిల్లలు ఇంకా సెటిల్ కాలేదనీ, ఈ పరిస్థితుల్లో తనకు ఆదాయం చాలా అవసరమన్న ఆయన.. అందుకోసం మళ్లీ సినిమాల్లో నటించాలని భావిస్తున్నట్లు చెప్పారు. అందు కోసం అవసరమైతే కేంద్ర మంత్రి పదవిని వదిలేయడానికైనా సిద్ధమన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ready-to-resign-as-union-minister-39-207836.html
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.