Publish Date:Oct 13, 2025
సినిమా నటులు రాజకీయాలలోకి రావడం అరుదేం కాదు. అయితే రాజకీయ నాయకుడిగా మారిన నటుడు తనకు రాజకీయాల కంటే సినిమాలే ముఖ్యం అంటూ యూటర్న్ తీసుకోవడం చాలా చాలా అరుదు. అందులోనూ సినిమాల కోసం అవసరమైతే కేంద్ర మంత్రి పదవిని కూడా వదులుకోవడానికి సిద్ధం అనడం అంటే.. అది అసలు ఊహకు కూడా అందని విషయం.
అలాంటి ఊహకందని వ్యాఖ్యలు చేశారు ప్రముఖ మలయాళ నటుడు, కేంద్రపెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీ. రాజకీయాలలో ఉండటం, కేంద్ర మంత్రిగా పదవిలో ఉండటం తనకేమీ సంతృప్తి ఇవ్వడం లేదన్నారు సురేష్ గోపీ. సినీ కెరీర్ ను వదిలిపెట్టి రాజకీయాలలోకి రావాలని కానీ, కేంద్ర మంత్రి కావాలని కానీ తాను ఎన్నడూ అనుకోలేదని సురేష్ గోపీ చెప్పుకొచ్చారు. అయినా రాజకీయాలలోకివచ్చి కేంద్ర మంత్రిని అయ్యాననీ, కానీ అప్పటి నుంచీ తనకు చేతిలో డబ్బులు ఆడటంలేదనీ, ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే డబ్బుల కోసం మళ్లీ సినిమాలలో నటించాలని భావిస్తున్నట్లు చెప్పారు. తాను సినిమాలలో నటించడానికి కేంద్ర మంత్రి పదవి అడ్డంకి అయితే.. ఆ పదవిని తృణ ప్రాయంగా త్యజిస్తానని చెప్పారు. అదే జరిగి ఒక వేళ తానురాజీనామా చేస్తే.. తాను వదిలేసే మంత్రి పదవిని తన రాష్ట్రానికే చెందిన అంటే కేరళకు చెంది రాజ్యసభ సభ్యుడు సదానంద్ మాస్టర్ కు ఇవ్వాలని ఆయన ప్రధానిని కోరారు.
సినిమాల ద్వారా విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సురేష్ గోపీ ఆ తరువాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో త్రిసూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి.. పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా కేంద్ర కేబినెట్ లో స్థానం పొందారు. అయితే రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచీ తన ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందన్నారు. తన పిల్లలు ఇంకా సెటిల్ కాలేదనీ, ఈ పరిస్థితుల్లో తనకు ఆదాయం చాలా అవసరమన్న ఆయన.. అందుకోసం మళ్లీ సినిమాల్లో నటించాలని భావిస్తున్నట్లు చెప్పారు. అందు కోసం అవసరమైతే కేంద్ర మంత్రి పదవిని వదిలేయడానికైనా సిద్ధమన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ready-to-resign-as-union-minister-39-207836.html
2029 ఎన్నికలలో విజయం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్న జగన్ ఇప్పుడు కూడా నేతలను సొంత నియోజకవర్గం నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీలో నిలబెట్టాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అందులోనూ ప్రధానంగా ప్రస్తుతం చిలకలూరి పేట నియోజకవర్గంలో పని చేసుకుంటున్న మాజీ మంత్రి విడదల రజనీని వచ్చే ఎన్నికలలో రేపల్లె నుంచి పోటీలో దింపాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్న లోకేష్ తనకు రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచీ సబ్బానాయుడితో మంచి పరిచయం, అనుబంధం ఉందన్నారు.
తమిళ సినిమా లెనిన్ ఇండియన్ అనే సినిమాతో రోజా వెండితెరపై మళ్లీ కనిపించనున్నారు. ఈ మేరకు ఆ మూవీ మేకర్స్ రోజా తమ సినిమాలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.
జూబ్లీ హిల్స్లో సెంటిమెంటో గెలుస్తుందో డెవలప్మెంటో గెలుస్తుందో తెలుస్తుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాలి అని టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు టీడీపీ నాయకులను ఆదేశించారు
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గోన్ననున్నారు.
హర్యానా ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ పెద్దగా కనిపించడం లేదు. పార్టీ అభ్యర్థి ఎంపికకే చాలా సమయం తీసుకున్న ఆ పార్టీ.. ప్రచారంలోనూ వెనుకబడింది. ప్రచార సరళిని బట్టి చూస్తుంటే జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ అన్న అభిప్రాయం కలుగుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
నాగబాబు ఎమ్మెల్సీ అయిన తరువాత కూడా తన వైఖరి మార్చుకోలేదని నిన్న మొన్నటి దాకా తెలుగుదేశం శ్రేణులు అంటుండేవి. ఎమ్మెల్సీగా నాగబాబు తన తొలి పర్యటనను తన సోదరుడు, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురం నుంచే మొదలు పెట్టారు. కానీ ఆ పర్యటన ఆద్యంతం తెలుగుదేశం, జనసేన క్యాడర్ మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లే విధంగానే సాగింది.
రాజకీయాలలో తొలి అడుగు కూడా పడకుండానే ఆయన నడకను ఆపేయాలని చూశారు. అయితే వాటన్నిటినీ తట్టుకుని నిలబడిన లోకేష్.. తనపై విమర్శలకు తన పనితీరుతోనే బదులిచ్చారు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో మొదలు పెట్టి బెరుకు లేకుండా, బెదురు లేకుండా నిలదొక్కుకుని ఇప్పుడు ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంగా మారారు.
రైతులు కోరినా జగన్ మాత్రం పొలాల్లోకి అడుగుపెట్టలేదు. ఇదే రకం పరిశీలనో అర్ధంగాక రైతులు తలలుబాదుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తాను సీఎంగా ఉన్న సమయంలో రైతులను అన్నివిధాలుగా ఆదుకున్నానన్నారు. మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో పాతిక జిల్లాల్లో పంటనష్టం జరిగిందన్నారు. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రూపాయి కూడా సాయం అందలేదన్నారు.
ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించి ఎన్నికల ప్రచారంలో మైనారిటీ తీరని పిల్లలతో ఎన్నికల ప్రచారం చేయించారంటూ కేటీఆర్ పై షఫీయుద్దీన్ ఫిర్యాదు చేశారు.
బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.