తెలంగాణలో డేంజర్ బెల్స్, సంక్షోభంలో విద్యా వ్యవస్థ

Publish Date:Sep 15, 2015

Advertisement



 

ఏళ్ల తరబడి నిరీక్షణ, కోటి ఆశలు, ఎన్నో కలలు, వేలాది ఆకాంక్షలు... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తమ బతుకులు బాగుపడతాయన్న నమ్మకం... తెలంగాణ రాష్ట్రం రానే వచ్చింది, కానీ నాలుగున్నర కోట్ల ప్రజల ఆశలు మాత్రం కలలుగానే మిగిలిపోతున్నాయి. సొంత పాలకుల చేతిలోనూ నిరాశే ఎదురవుతోంది, అవమానాలే మిగులుతున్నాయి. ఒక్కటేమిటి అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి, ఒకపక్క అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, దేశానికి దిశానిర్దేశం చేయాల్సిన యువత...సరైన విద్య అందక పోటీ ప్రపంచంలో వెనుకబడిపోతున్నారు. తెలంగాణలో వ్యవసాయ సంక్షోభమే కాదు,  విద్యావ్యవస్థ కూడా చిన్నాభిన్నమై... సాయం కోసం రోదిస్తోంది.

తెలంగాణ తెచ్చింది మేమే, తమకు అధికారం ఇస్తే బంగారు తెలంగాణ చేసి చూపిస్తామంటూ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి టీఆర్ఎస్ అధికారంలో వచ్చి ఏడాది దాటిపోతున్నా, హామీల అమలులో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో వెనుకబడిపోతోంది.విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ కేజీ టు పీజీ విద్యను అమలు చేస్తామని కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలు... నీటి మూటలుగానే మిగిలిపోయాయి. అదిగో ఇదిగో...అమలు చేస్తున్నామని చెబుతున్నా, కార్యరూపం దగ్గరికి వచ్చేసరికి మాత్రం అడుగు ముందుకుపడటం లేదు. అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర కావొస్తున్నా, ఇంతవరకూ యూనివర్సిటీలకు వీసీలను నియమించలేని దుస్థితి, రాష్ట్రంలోని పది యూనివర్సిటీలకు కూడా దాదాపుగా రెగ్యులర్ వీసీలు లేరంటే...విశ్వవిద్యాలయాల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థంచేసుకోవచ్చు.

ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ వర్సిటీలకు గత జులై నుంచి నేటివరకూ రెగ్యులర్ వీసీ లేరు. మిగతా యూనివర్సిటీల పరిస్థితీ దాదాపు అంతే, శాతవాహన యూనివర్సిటీ(కరీంనగర్), పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ(హైదరాబాద్), పాలమూరు యూనివర్సిటీ(మహబూబ్ నగర్)లైతే నిధులు, తీవ్ర సిబ్బంది కొరతతో సతమతమవుతున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం యూనివర్సిటీలు, కాలేజీల్లో 50శాతం వరకు సిబ్బంది కొరత ఉందని, అది విద్యార్ధుల ప్రతిభా పాటవాలు, ఉత్తీర్ణతా శాతంపై ప్రభావం చూపుతోందని అంటున్నారు.

తెలంగాణలో చిన్నాభిన్నమైన విద్యావ్యవస్థను గమనించిన పలువురు అధికారులు...ఇప్పటికే అనేకసార్లు హెచ్చరించారని,పరిస్థితి ఇలానే కొనసాగితే పలు యూనివర్సిటీలు...నాక్(నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రిడేషన్) గుర్తింపును కోల్పోతాయని, దాంతోయూజీసీ గ్రాంట్స్ నిలిచిపోయి, మరింత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని డేంజర్ బెల్స్ మోగించారు. దాంతో ఆలస్యంగానైనా మేల్కొన్న తెలంగాణ ప్రభుత్వం...వీసీల నియామకానికి హడావిడిగా ఓ కమిటీని ఏర్పాటు చేసినా, ఇంకా కార్యరూపం మాత్రం దాల్చలేదు. ఇదిలా ఉంటే, హాస్టల్, మెస్ బిల్లులు అందక ఎస్సీఎస్టీ విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,  తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, బతుకమ్మ ఉత్సవాలకు 110 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం...విద్యార్ధుల బాగోగులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ప్రైవేట్విద్యాసంస్థలు...బ్రాంచ్ ల మీద బ్రాంచ్ లు ఓపెన్ చేస్తూ దూసుకుపోతుండగా, ప్రభుత్వ స్కూళ్లు మాత్రం మూసివేత దిశగా సాగుతున్నాయని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పైగా డ్రాపవుట్స్ ను తిరిగి స్కూళ్లకు చేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, దాంతో పేదలకు విద్య మరింత దూరమవుతోందని అంటున్నారు.

తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విద్యావ్యవస్థను బాగుచేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని, లేదంటే పరిస్థితి మరింత దిగజారిపోవడం ఖాయమని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. మరి ఎన్నికల హామీల్లో ఒకటైన విద్యావ్యవస్థను గాడిలో పెడుతుందో లేక చేతులెత్తిస్తుందో చూడాలి

By
en-us Political News

  
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు.
ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనా నగరంగానే కాకుండా.. ప్రపంచస్థాయి పెట్టుబడులకు, అత్యాధునిక సాంకేతికతకు కేంద్రబిందువుగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గతంలో హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఆయన ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా ముందుకు తీసుకువెడుతున్నారు.
దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది.
2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన శైలిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.