కేసీఆర్ అమెరికా పర్యటన ఎప్పుడో...ఎందుకో?

Publish Date:Dec 5, 2014

Advertisement

 

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న హైదరాబాద్ లో గల అమెరికన్ కౌన్సిలేట్ కార్యాలయానికి వెళ్లి డిప్లోమేటిక్ వీసా కోసం అవసరమయిన ఫార్మాలిటీలు పూర్తి చేయడం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆయన కార్యాలయ అధికారులు ఇంతవరకు ఎన్నడూ కూడా ఆయన వీసా కోసం దరఖాస్తు చేయబోతున్నట్లు కానీ, అమెరికా వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లుగానీ చెప్పలేదు. అందువల్ల కేసీఆర్ నిన్నవీసా కోసం దరఖాస్తు చేసి రావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

 

రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇటీవల సింగపూర్ వెళ్ళి వచ్చిన తరువాత ఆయన కొత్త పరిశ్రమల ఊసు ఎత్తలేదు గానీ, సింగపూర్ పర్యటన ప్రభావమో ఏమో తెలియదు గానీ హుస్సేన్ సాగర్ చుట్టూ వంద అంతస్తుల భవనాలు కట్టిస్తానని, ఇందిరా పార్క్ వద్ద ప్రపంచంలోకెల్లా ఎట్టయినా భవనం కట్టిస్తానని ప్రకటించేశారు. హైదరాబాద్ ఈ కొస నుండి ఆ కొసకి స్కై వేలు, ఎక్స్ ప్రెస్ హైవేలు కట్టించేసేందుకు ఫిక్స్ అయిపోయారు.

 

అయితే ఈసారి ఆయన అమెరికా ఎప్పుడు, ఎందుకు వెళతారో ఇంకా తెలియవలసి ఉంది. ఇప్పటికిప్పుడు కాక పోయినా వచ్చే ఏడాదిలోనయినా ఆయన అమెరికా వెళ్ళడం తధ్యంలా కనబడుతోంది. రాజకీయ నేతలకు ఇచ్చే ఈ వీసాకు గడువు పదేళ్ళు ఉంటుంది. కనుక అప్పటిలోగా ఎన్నిసార్లయినా అమెరికా వెళ్లి రావచ్చును.

 

బహుశః తన సింగపూర్ పర్యటన ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో, తెలంగాణా ప్రజలు ఎక్కువగా స్థిరపడిన అమెరికా వెళ్లి వారి ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకు రావాలని ఆశిస్తున్నారేమో? అందుకే అయితే అది మంచి ఆలోచనేనని చెప్పవచ్చును. కొన్ని పత్రికలలో ఆయన హెల్త్ చెకప్ కోసమే అమెరికా వెళ్ళాలనుకొంటున్నట్లు వార్తలు వచ్చేయి. కానీ దానికోసం ఆయన డిప్లోమేటిక్ వీసా తీసుకోనవసరం లేదు. అదేవిధంగా అమెరికాలో ఉన్న తన బంధుమిత్రులను కలిసి వచ్చేందుకు కూడా ఇటువంటి వీసా అవసరం లేదు. కనుక ఆయన రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకే ఆయన అమెరికా వెళ్లాలని భావిస్తుండవచ్చును. కానీ ఎప్పుడు వెళతారనేది ఆయనే చెప్పాలి.

 

వచ్చే ఫిబ్రవరి నెలలో 2015-16 ఆర్ధిక సం.నికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టవలసి ఉంది కనుక, బహుశః ఆ పని పూర్తయిన తరువాత ఎప్పుడయినా ఆయన అమెరికా వెళతారేమో. కాకపోతే ఈసారి అమెరికా వెళ్లి వచ్చిన తరువాత అసలు పని పక్కనబెట్టి మరేదో తలకెత్తుకోకుంటే చాలు.

By
en-us Political News

  
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.