పాక్ నేర్పుతున్న గుణపాఠం

Publish Date:Dec 16, 2014

Advertisement

 

భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయినప్పటి నుండి నేటి వరకూ కూడా అక్కడ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమ మనుగడ కోసం భారతదేశాన్ని బూచిగా చూపిస్తూ రోజులు నెట్టుకొచ్చేయి తప్ప భారత్ తో పోటీపడి దేశాన్ని అభివృద్ధి చేసుకొందామనే ఆలోచనా, ప్రయత్నం ఏ నాయకుడూ చేయలేదు. ఆ కారణంగా ఆ దేశంలో నిరుద్యోగం, దారిద్ర్యం, అవినీతి ఇత్యాది సమస్యలన్నీ పెరుగుతూ వచ్చేయి. వాటి నివారణ కోసం ప్రయత్నించవలసిన ప్రభుత్వాలు, వాటి నుండి వారి దృష్టి మరల్చడానికి భారత్ పట్ల ప్రజలలో విద్వేషాన్ని పెంచేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసాయి. ఆ ప్రయత్నాలలో నుండే మత ఛాందసవాదం కూడా క్రమంగా బలపడింది.

 

నానాటికీ బలపడుతున్న భారత్ వల్ల పాకిస్తాన్ కు చాల ప్రమాదం పొంచి ఉందనే అభద్రతా భావన పాక్ ప్రజలలో పెంచడం ద్వారానే అక్కడి ప్రభుత్వాలు మనుగడ సాగిస్తుంటాయి. అందుకే అక్కడి ప్రభుత్వాలు తమ ప్రజలలో ఆ అభద్రతాభావం పెంచిపోషించేందుకు అప్పుడప్పుడు భారత్ పై దాడులు చేస్తుంటాయి. అందుకోసం ఉగ్రవాదాన్ని కూడా పెంచిపోషించవలసి వచ్చింది.

 

మత ఛాందసవాదులయిన కొందరు అధికార ప్రతిపక్ష నేతలు, సైనికాధికారులు ఆ ఉగ్రవాదానికి ఎప్పటికప్పుడు నారునీరు పోస్తూ బాగా బలపడేందుకు యధాశక్తిగా కృషి చేసారు. జడలు విప్పిన ఆ ఉగ్రభూతమే నేడు అభం శుభం తెలియని 160 విద్యార్ధుల ప్రాణాలను బలిగొంది. అందుకు పాకిస్తాన్ ప్రజలే కాదు భారత్ తో సహా యావత్ ప్రపంచ దేశాలు కూడా చాలా బాధపడుతున్నాయి. విద్వేషాన్ని పెంచి పోషిస్తే దాని దుష్పరిమాణాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అర్ధం చేసుకోవడానికి ఇదొక సజీవ ఉదారణ.

 

రాష్ట్రాలను దేశాలను ఏలుతున్న ప్రభుత్వాలు, వాటిని నడిపిస్తున్న రాజకీయ పార్టీలు, వాటిని నడిపిస్తున్న స్వార్ధ రాజకీయ నేతలు ప్రజలలో విద్వేష భావనలు వ్యాపింపజేసి తాము లాభపడవచ్చని ప్రయత్నిస్తే వాటి ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయో ఈ సంఘటన కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది.

 

వేల సం.ల చరిత్రకల భారతదేశం ఏనాడూ కూడా ఇతర దేశాల మీద యుద్దాలకు వెళ్ళలేదు. కానీ తమపై దురాక్రమణలు చేసిన వారిని కూడా తనలో ఐక్యం చేసుకోగలిగింది. అందుకే అదొక అద్భుత ప్రపంచంగా అందరినీ ఆకట్టుకొంటోంది. భారత్ అంటే వంద కోట్ల జనాభా మాత్రమే కాదు. అనేక కులాలు, మతాలు, బాషలు, సంస్కృతుల విశిష్ట సమ్మేళనం. యావత్ ప్రపంచం ఒక ఎత్తయితే భారత్ ఒక్కటే ఒక ఎత్తు అని చెప్పవచ్చును. వంద కోట్ల మంది ప్రజలలో కనిపించే ఆ పరమత సహనం, శాంతి కాముకతే ఇంత కాలం భారత్ కు శ్రీరామరక్షగా కాపాడుతోంది. అందుకే ఇంత సుస్థిరంగా నిలువగలిగింది. అందుకే క్రమంగా అభివృద్ధి చెందగలుగుతోంది.

 

అయితే ఇప్పుడు భారత దేశంలో కూడా స్వార్ధ పరులయిన కొన్ని పార్టీలు, కొందరు రాజకీయ నేతలు తమ మనుగడ కోసం ప్రాంతీయ వాదం, మత తత్వవాదం, కులతత్వం వంటి అంటురోగాలను వ్యాపింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక ఇటువంటి విద్వేష భావనలు, కుల, మత ఛాందసవాదం, బాషా, ప్రాంతీయవాదం వంటి అంటురోగాలను వ్యాపింపజేసే వారిని ప్రజలు దూరం పెట్టడం చాలా అవసరం. లేకుంటే ఇటువంటి దుష్పరిమాణాలే ఎదుర్కోవలసి వస్తుందని మరిచిపోకూడదు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.