రోమ్ నగరం తగులబడుతుంటే....

Publish Date:Jan 27, 2013

Advertisement

 

ఒకవైపు తెలంగాణా జేయేసీ నేతలు చేపట్టిన సమరదీక్షతో జంట నగరాలు అట్టుడుకుతుండగా మరోవైపు సీమంద్రాలో సమైక్యాంద్రా ఉద్యమం కూడా మెల్లగా ఊపందుకొంటోంది. డిల్లీ నుండి ఎటువంటి ప్రకటన ఇంతవరకూ రాకపోయినా కూడా రెండు వైపులా ఉద్యమాలు మాత్రం తీవ్రతరమవడంతో రాష్ట్రంలో మళ్ళీ అరాచక పరిస్థితులు మొదలయ్యాయి. రాష్ట్రం ఇంత అల్లకల్లోలంగా మారినప్పటికీ కూడా అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుండి గానీ కనీస స్పందన కరువవడం విచారకరం. బహుశః తమ మాటలని ఎవరూ లెక్క చేయరని భావించడంవల్లనే ఈ నిర్లిప్తత అని భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికయినా తన నిర్లిప్త ధోరణిని విడనాడకపోతే రాష్ట్రంలో పరిస్థితులు అదుపుతప్పే ప్రమాదం ఉంది.

 

 

తెలంగాణాపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా కొంత సమయం అవసరమని ప్రకటించిన గులాం నబీ ఆజాద్, తెలంగాణా కాంగ్రెస్ నేతలు కోరినట్లు స్పష్టమయిన మరో ప్రకటన చేయడం ద్వారా పరిస్థితులను అదుపులోకి తేగల అవకాశం ఎందుకు జారవిడుచుకొంటున్నారో తెలియదు. రేపు అనగా జనవరి 28వ తేదీన తెలంగాణాకి అనుకూలంగా ప్రకటన చేయలేమని తేల్చిన గులాం నబీ ఆజాద్, మరి తమ తదుపరి ప్రణాళిక ఏమిటో ప్రకటించి, రాష్ట్ర కాంగ్రెస్ నేతల సహాయంతో పరిస్థితులను అదుపులో ఉంచే అవకాశం ఉన్నపటికీ అది పట్టించుకోకుండా, కాంగ్రెస్ అధిష్టానం కోర్ కమిటీ సమావేశాలలో మునిగితేలుతోంది. రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవడానికి అది చేస్తున్న కసరత్తును ఎవరూ తప్పు పట్టకపోయినప్పటికీ, పూర్తిగా అదే ధ్యాసతో తలుపులేసుకొని సమావేశాలు అవడం చూస్తుంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించుకొంటూ కూర్చొన్న నీరో చక్రవర్తిని తలపిస్తోంది.

 

 

ఇటీవల కాంగ్రెస్ నాయకత్వం చేపట్టిన యువనాయకుడు రాహుల్ గాంధీ కూడా ఇక్కడి పరిస్థితులకి స్పందించకపోవడం విచారకరం. దేశాన్ని పట్టి పీడిస్తున్న అన్ని సమస్యలని తన మంత్రం దండంతో సమూలంగా మాయం చేసేస్తానన్నట్లు మాట్లాడిన ఆయన, ఇటువంటి క్లిష్ట సమయంలో, క్లిష్ట సమస్యపై ఎందుకు నోరు మెదపట్లేదో ఆయనకే తెలియాలి. ఆయనకి రాష్ట్ర విబజన సమస్యపై పూర్తీ అవగాహన ఇంకా ఏర్పడలేదని పార్టీలో సీనియర్ నేతలు భావించిడంవల్లనే ఆయనను దీనికి దూరంగా ఉంచుతున్నారనుకొంటే, అటువంటప్పుడు అతి రధమహారధులని చెప్పుకొనే అనేక కాంగ్రెస్ నేతలలో ఒక్కరు కూడా ముందుకు వచ్చి పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేయకపోవడం చాలా విచారకరం.

 

 

కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వర్తిసున్న సీనియర్ నేత వాయలార్ రవి, ప్రస్తుతం హైదరాబాదులో ఉండి, అక్కడి పరిస్థితులను స్వయంగా చూస్తూ కూడా తెలంగాణా అంశంతో తనకు సంబంధం లేదని, అది వేరొకరు చూసుకొంటున్నారని అనడం చాలా దారుణం. ఇక తెలంగాణా అంశం తన పరిధిలో లేదని స్పష్టంగా చెప్పి చేతులుదులుపుకొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తప్పు పట్టడం అనవసరం. అది వినడానికి ఎబ్బెట్టుగా ఉన్నపటికీ అది చేదు నిజం అని ఒప్పుకోక తప్పదు. అందువల్ల ఆయన తన పరిధిలో ఏమేమి ఉన్నాయో అవి చేసుకుపోతున్నారు. ప్రస్తుతం రాజధానిలో తెలంగాణా జేయేసీ నేతలు తలపెటిన 36గంటల సమరదీక్ష వల్ల నగరంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా చూసుకోవడమే ఆయన చేతుల్లో ఉన్న పని. ఆ పనిని అయన సమర్ధంగానే నిర్వహిస్తున్నారని అనుకోవచ్చును. అయితే, తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్న ఉద్యమ కారులవల్ల పరిస్థితులు ఎప్పడు అదుపు తప్పుతాయో ఎవరికీ తెలియదు. అదే జరిగితే దానికి రాష్ట్ర ప్రభుత్వం కన్నా కేంద్రానిదే బాధ్యతవుతుంది. అప్పుడు మళ్ళీ రాష్ట్రపతి పాలన అనే పాత ఆలోచన మరో సారి తెరమీదకి రావచ్చును. ఇది తెలంగాణా అంశాన్ని మరింత ఆలస్యం కావడానికే దోహదపడుతుంది అని ఉద్యమకారులు గ్రహించాల్సిన అవసరం ఉంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.