LATEST NEWS
కల్వకుంట్ల కవిత కొత్త  రాజకీయ పార్టీ పేరు   ఇప్పుడు న్యాయస్థానం పరిధిలోకి చేరింది. తన నూతన పార్టీకి  తెలంగాణ రక్షణ సమితి  (టీఆర్ఎస్)  పేరు  ఖరారు చేయాలని కోరుతూ ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత..  ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం  టీఆర్ఎస్  పేరు ఖరారు విషయంలో  పంపిన లేఖను సవాల్ చేస్తూ ఆమె   న్యాయపోరాటానికి దిగారు.  పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా తమ పార్టీ పేరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జూన్ 23న కేంద్ర ఎన్నికల సంఘం తనకు ఒక అధికారిక లేఖను పంపిందని కవిత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈసీ లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో, పార్టీ పేరు ఆమోదం పొందేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న ‘టీఆర్ఎస్’ అనే సంక్షిప్త నామం చుట్టూ ఈ వివాదం తిరుగుతోంది. గతంలో కవిత తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్)గా మార్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ఉద్యమం గుర్తుకు వచ్చేలా.. తన పార్టీకి  తెలంగాణ రక్షణ సమితి  అని పేరు పెట్టుకున్నారు. అయితే ఈ పేరుపై, ముఖ్యంగా  టీఆర్ఎస్  అనే సంక్షిప్త అక్షరాల వాడకంపై అభ్యంతరం తెలుపుతూ ఈసీకి పలు పిటిషన్లు వచ్చాయి.    ప్రస్తుతం చలామణిలో ఉన్న..  లేదా ప్రజల్లో గుర్తింపు పొందిన ఇతర పార్టీల పేర్లను పోలి ఉండేలా కొత్త పేర్లు ఉంటే ఓటర్లలో గందరగోళం నెలకొనే అవకాశం ఉంటుంది. కనుక కవిత ప్రతిపాదించిన పేరు పాత టీఆర్ఎస్ పార్టీని పోలి ఉండటంతో, దీనిపై స్పష్టత ఇవ్వాలంటూ ఈసీ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన కవిత  చట్టప్రకారం తాము పెట్టుకున్న పేరు చెల్లుబాటు అవుతుందని వాదిస్తున్నారు.  ఈ పేరు మార్పు లేదా అభ్యంతరాలపై ఎన్నికల సంఘం అడిగిన వివరాలకు కవిత ఇప్పటికే బదులిచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు,  తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.  ఈ పిటిషన్‌పై రానున్న రోజుల్లో ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. న్యాయస్థానం ఈ విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తుంది, కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తుంది అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.   Telangana Rakshana Sena, TRS Party Name Row, Delhi High Court, Election Commission of India
తమిళనాడు రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీకి ఇటీవల జరిగిన  ఎన్నికలలో   దళపతి విజయ్ సృష్టించిన సంచలన విజయం తెలిసిందే.  రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలిసారే విజయం సాధించి   ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి  విజయ్ చరిత్ర సృష్టించారు.  కమల్ హాసన్ వంటి మహామహులకే సాధ్యం కాని ఈ ఫీట్ ను విజయ్ సాకారం చేయడంతో..  ఇప్పుడు కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి  అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే   స్టార్ హీరో ధనుష్ కూడా   రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.  తాజాగా ధనుష్ అభిమాన సంఘం నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో  పార్టీ  జెండాను ఆవిష్కరించడం ఆయన పొలిటికల్ ఎంట్రీకి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కేవలం జెండా రూపకల్పనకే పరిమితం కాకుండా..  తమిళనాడు వ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని అభిమాన సంఘాల నేతలకు ధనుష్ పిలుపునివ్వడం కూడా  ఆయన పోలిటికల్ ఎంట్రీని కన్ ఫర్మ్ చేస్తోందంటున్నారు.   Hero, Dhanush, Fans, Flag, Public, Service, Teluguone
  భువనగిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొమ్మిడి నరసింహారెడ్డి మంగళవారం (జులై 7)  ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన  విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు.   సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.   నరసింహారెడ్డి  తన 19 ఏళ్ల వయసులోనే..  1962లో బ్రాహ్మణపల్లి సర్పంచ్‌గా ఎన్నికై ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత భువనగిరి సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1978లో కాంగ్రెస్ తరపున భువనగిరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన... 1983లో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తట్టుకొని రెండోసారి కూడా కాంగ్రెస్  ఎమ్మెల్యేగా అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయన మృతి పట్ల రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.   Bhuvanagiri, Former, Mla, Values
వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్ కు ఆర్కే రోజా దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. వైసీపీ సీనియర్ నాయకురాలు, ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందిన ఆర్కే రోజా.. మావిగన్ అంటే అమరావతేనని కుండబద్దలు కొట్టేశారు. ఓ వైపు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి.. వచ్చే ఎన్నికలలో తమ నినాదం మావిగన్ అని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా జరుగుతాయనీ, మావిగన్ కు మద్దతు ఇచ్చే వారు వైసీపీకి, అమరావతి కావాలనుకునే వారు తెలుగుదేశం కూటమికి ఓటు వేస్తారనీ, ఎవరు గెలుస్తారో చూద్దామనీ సవాళ్లు విసురుతుంటే.. ఆర్కే రోజా మాత్రం మావిగన్, అమరావతీ ఒక్కటేననీ, ఏమీ తేడాలేదనీ చెబుతూ జగన్ గాలి తీసేశారు.  జగన్ మావిగన్ ప్రతిపాదన తరువాత.. వైసీపీ ఆ పేరును తెగ ప్రచారం చేస్తున్నది. అయితే..  జగన్, వైసీపీ నేతల ప్రచారం జనాలు పెద్దగా పట్టించుకోలేదనుకోండి అది వేరు సంగతి.  జనం దాకా ఎందుకు వైసీపీలో పలువురు నేతలు కూడా మావిగన్ ప్రతిపాదనపై పెదవి విరిచారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెంది ధర్మాన వంటి నేతలైతే.. అంతర్గత సంభాషణల్లో జగన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.  ఇక ఇప్పుడు తాజాగా ఓ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత మావిగన్ విషయంలో చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. జగన్ మావిగన్ ప్రతిపాదనపై రోజా తన అయోమయాన్ని బయటపెట్టుకున్నారు. అదే సమయంలో మావిగన్ పట్ల తన వైఖరినీ బయటపెట్టారు. మావిగన్, అమరావతి రెండూ ఒకటే కదా అని రోజా ఆ చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో మావిగన్ ను ప్రమోట్ చేస్తున్న వైసీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారిపోయింది. తెలుగుదేశం, జనసేన నేతలు, కార్యకర్తలు మాత్రం రోజా వ్యాఖ్యలను తెగ వైరల్ చేస్తున్నారు. మావిగన్, అమరావతి ఒకటే అయినప్పుడు జగన్ మావిగన్ పాట పాడటం ఎందుకు, అమరావతిపై విషం చిమ్మడం ఎందుకు అంటూ నిలదీస్తున్నారు. జగన్ మావిగన్ జపం మాని రోజాను ఫాలో అవుతూ రెండూ ఒకటే అని ప్రకటించేయవచ్చుగా అంటూ వైసీపీలో మావిగన్ వ్యతిరేకులు కూడా అంటున్నారు.   జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆయన, ఆయన పార్టీ నేతలూ    అమరావతిని  శ్మశానంతో పోలుస్తూతీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న అమరావతిపై విషం చిమ్ముతున్నారు. తాను అధకారంలోకి వస్తే.. మావిగన్ ను ఏపీ రాజధానిగా చేస్తామంటూ జగన్ ప్రకటనను గుప్పిస్తున్నారు. అయితే..  అనూహ్యంగా ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు.. అమరావతికి అనుకూలంగా గళం ఎత్తడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.    అభివృద్ధి, వైభవం పరంగా అమరావతి  అంతటి  స్థాయి కలిగిన ప్రాంతమని రోజా అనడంతో వైసీపీ నేతలు, మరీ ముఖ్యంగా జగన్ ఏం మాట్లాడాలో అర్ధం కాని అయోమయంలో పడిపోయారు.   రోజాయే అమరావతి మావిగన్ ఒకటే అని చెప్పడంతో జగన్ మావిగన్ ప్రతిపాదనపై నెటిజనులు తెగ సెటైర్లు గుప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైసీపీ అయోమయానికి ఇదే నిదర్శనమని అంటున్నారు. అమరావతిపై అకారణ ద్వేషం వినా.. వైసీపీకి రాజధాని విషయంలో ఒక క్లారిటీ అంటూ లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  Roja Comments on Amaravati, YCP Capital Row, Roja Mavigan Controversy, AP Politics, Telugunews
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వైఖరిపై తాడికొండ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మాదిగ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగువన్ ఇంటర్వ్యూ లో ఆమె అమరావతిపై జగన్ కుట్రలను బయటపెట్టారు. అందరూ జగన్ ను సైకో సైకో అంటారు కానీ  తాను జగన్ సైకో తో పాటు శాడిస్ట్ కూడా అంటానన్నారు.  ఇటీవల విజయవాడలో ఒక పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జగన్, అమరావతి రాజధాని కాదంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ  హయాంలో రాజధాని అమరావతి విషయంలో జరిగిన పరిణామాలను, దళిత ప్రతినిధులుగా తాము అనుభవించిన మానసిక క్షోభను   వివరించారు. 2019 ఎన్నికల సమయంలో తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవి..  అప్పట్లో సర్వేల ఆధారంగా అత్యంత క్లిష్టమైన రాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు. అయితే..  గెలిచిన తర్వాత జగన్ మోహన్ రెడ్డిని కలిసినప్పుడు, ఆయన కనీస గుర్తింపు ఇవ్వకుండా కేవలం తన బొమ్మ చూసి మాత్రమే గెలిచారంటూ చులకనగా మాట్లాడారని  ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో జగన్ వైఖరి అత్యంత దారుణంగా ఉండేదన్న ఆమె..   పరిపాలన సాగించే క్రమంలో దళిత ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను ఆయన ఏనాడూ గౌరవించలేదని, కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసమే వాడుకున్నారన్నారు.  అధికారంలో ఉన్న పార్టీని, పదవులను వదులుకుని తాము బయటకు రావడానికి జగన్ పెట్టిన టార్చరే కారణమని శ్రీదేవి కుండబద్దలు కొట్టారు. 2023లోనే తాను వైసీపీని వీడి అప్పటి ప్రతిపక్షంలోకి రావడం వెనుక ఎంతో మానసిక సంఘర్షణ ఉందన్నారు. ఒక దళిత మహిళా ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితిని కల్పించారని, రాజధాని ప్రాంత రైతులపై దాడులు జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యేగా తాను ఏమీ చేయలేక తీవ్ర వేదన అనుభవించానని పేర్కొన్నారు. అమరావతి, మూడు రాజధానులు, వైజాగ్ కాపురం, ఇప్పుడు కొత్తగా  మావిగన్ అంటూ జగన్ మోహన్ రెడ్డి పదేపదే మాటలు మార్చడం కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనని ఉండవల్లి శ్రీదేవి విశ్లేషించారు. నాడు కోర్టు ఆదేశాల మేరకు సీఆర్డీఏ అధికారులు అమరావతిలో పనులు చేస్తున్నట్లు కేవలం ఒక గంట పాటు డ్రామాలు ఆడారని, అదంతా కేవలం ప్రదర్శన  కోసమేనని  బయటపెట్టారు. రాజధాని కోసం ఒక్క పైసా ఆశించకుండా 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన అమరావతి రైతులపై జగన్ ప్రభుత్వానికి ఎన్నడూ   ప్రేమ లేదన్న శ్రీదేవి ఐదేళ్ల పాటు రైతులను నానా ఇబ్బందులు పెట్టిన జగన్..  ఇప్పుడు మళ్లీ వారిపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ప్రాంతాల మధ్య, కులాల మధ్య పరస్పర విభేదాలు సృష్టించి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడమే జగన్ అసలు వ్యూహమని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  రాయల్‌గా సచివాలయానికి వస్తూ, రాజధాని అభివృద్ధిపై స్పష్టమైన విజన్‌తో ముందుకు సాగుతున్నారని శ్రీదేవి కొనియాడారు. జగన్ మోహన్ రెడ్డి లాంటి నాయకులు చేసే తాత్కాలిక రాజకీయాలు ఇకపై సాగవని, ప్రజలు ఇప్పటికే ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. అమరావతి భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని శ్రీదేవి అన్నారు.    Undavalli Sridevi Exclusive Interview, YS Jagan Mohan Reddy Strategy, Amaravati Capital Issue, Tadikonda Ex MLA Sridevi, Chandrababu Naidu Secretariat  
ALSO ON TELUGUONE N E W S
అక్కినేని అఖిల్(Akhil)అప్ కమింగ్ మూవీ  'లెనిన్'(lenin)ఈ నెల 10 న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మూడు సంవత్సరాల తర్వాత అఖిల్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఇండస్ట్రీలోను, అభిమానుల్లోను, ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా  ఇప్పుడు బిజినెస్ పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా అందుతున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులు ఊహించని రీతిలో భారీ ధర పలికాయి. అఖిల్ మార్కెట్ స్టామినాతో సంబంధం లేకుండా 'లెనిన్' చిత్రం ఏకంగా 34 కోట్ల నాన్ ది  యేట్రికల్ డీల్‌ను సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇందులో శాటిలైట్, డిజిటల్ (ఓటీటీ), మరియు ఆడియో హక్కులు అన్నీ కలిపి ఉన్నాయని తెలుస్తోంది. 'ఏజెంట్' బాక్సాఫీస్ వద్ద కేవలం 13 కోట్ల లోపే వసూలు చేసి తీవ్ర నిరాశ పరిచినప్పటికీ, 'లెనిన్' కథా బలం, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ విలువలు చూసి ప్రముఖ ఓటీటీ, శాటిలైట్ సంస్థలు పోటీ పడి ఈ హక్కులని  దక్కించుకున్నాయి. ఒక ప్లాప్ హీరో తదుపరి చిత్రానికి  34 కోట్ల నాన్-థియేట్రికల్ బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. also read: Bhagyaraj: బతికుండగా పట్టించులేదు.. ఇప్పుడు నెరవేర్చారు కేవలం నాన్-థియేట్రికల్ పరంగానే కాకుండా, థియేట్రికల్ బిజినెస్‌లోనూ ఈ సినిమా జోరు చూపిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఏరియా థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అంటే దాదాపు 9 కోట్లకు అమ్ముడైనట్లు వార్తలు వచ్చాయి. దీనికి తోడు నైజాం, సీడెడ్, మరియు ఓవర్సీస్ హక్కుల బిజినెస్ కూడా ముగింపు దశకు వచ్చింది. నిర్మాత నాగవంశీ ఈ సినిమాపై ఎంతగానో నమ్మకంతో ఉన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'లెనిన్' సినిమా చివరి 40 నిమిషాలు అద్భుతమైన ఎమోషనల్ డ్రామాతో సాగుతుందని, థియేటర్లలో అఖిల్ క్యారెక్టర్ చూసి ఆడియన్స్ కన్నీళ్లు పెట్టుకోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే( Bhagyashri Borse)కథానాయికగా చేస్తుండగా మురళి కృష్ణ అబ్బూరి దర్శకుడు.  
అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ (Lenin). మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అక్కినేని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్  సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో 'లెనిన్' చిత్రానికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. థియేటర్లలో అఖిల్ అక్కినేని మాస్ జాతరను కళ్లారా చూసేందుకు అక్కినేని అభిమానులతో పాటు, సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖిల్ ఈ సినిమాతో ఒక భారీ హిట్ కొట్టి, హీరోగా నిలదొక్కువాలని చూస్తున్నాడు. అందుకు తగ్గట్టే ఈ సినిమాపై మొదటి నుంచి పాజిటివ్ బజ్ ఉంది. ముఖంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అందుకే ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ కి మంచి స్పందన లభిస్తోంది.  అఖిల్ కెరీర్‌లోనే ఇదొక మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జూలై 10న థియేటర్లలో బొమ్మ దద్దరిల్లిపోవడం ఖాయమని అక్కినేని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. మరి అఖిల్ ఆ నమ్మకాన్ని నిలబెడతాడేమో చూడాలి. https://x.com/SitharaEnts/status/2074414405589389346   Akhil Akkineni, Lenin Movie, Bookings, TeluguOne  
  తమిళ చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ నటుడు, దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయిత కే. భాగ్యరాజ్ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. 73 ఏళ్ల వయసులో హఠాత్తుగా సంభవించిన గుండెపోటు కారణంగా ఆయన మరణించడం ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భాగ్యరాజ్ కేవలం నటుడే కాదు, కథను నడిపించడంలో అద్భుతమైన ప్రతిభ ఉన్న అగ్రశ్రేణి సృష్టికర్త. ఆయన తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 25 కంటే ఎక్కువ చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, 75కి పైగా సినిమాల్లో వైవిధ్యభరితమైన  క్యారక్టర్లతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్నారు. అలాంటి గొప్ప కళాకారుడు భౌతికంగా మనల్ని విడిచివెళ్లినా, ఆయన చిరకాల కోరిక ఒకటి ఇప్పుడు నెరవేరింది. మరణించడానికి కొద్దిరోజుల ముందే భాగ్యరాజ్ తన జీవిత ప్రయాణాన్ని, సినీ రంగానికి సంబంధించిన మధుర స్మృతులను క్రోడీకరిస్తూ 'పడిచ్చా పుడిచిర్లాం' అనే పేరుతో ఒక అద్భుతమైన స్వీయచరిత్రాన్ని (ఆటోబయోగ్రఫీ) రాసుకున్నారు. ఈ పుస్తకానికి ఒక మనోహరమైన ముందుమాట (ఫోర్‌వర్డ్) రాయాలని ఆయన ఎంతో ఆశపడ్డారు. ఇందుకోసం 2026 జూన్ 17వ తేదీన తన పుస్తక ప్రతినోకదాన్ని ప్రముఖ గీత రచయిత, కవి వైరముత్తుకు పంపించి, ప్రేమతో ముందుమాట రాసివ్వాలని కోరారు. ఆ సమయంలో వైరముత్తు ఇతర పనుల్లో బిజీగా ఉండటం వల్ల "కొంచెం సమయం కావాలి" అని అడగ్గా, భాగ్యరాజ్ ఎప్పటిలాగే తన మార్కు చిరునవ్వుతో "సరే" అని సమాధానమిచ్చారు. కానీ అదే వారి మధ్య చివరి సంభాషణ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఆ తర్వాత సరిగ్గా పది రోజులకు, అంటే జూన్ 27వ తేదీన భాగ్యరాజ్ మరణించారనే వార్త వైరముత్తును తీవ్రంగా కలచివేసింది. భాగ్యరాజ్ మరణానంతరం వైరముత్తు ఆ స్వీయచరిత్ర పుస్తకాన్ని పూర్తిగా చదివారు. ఆ పుస్తకంలోని ప్రతి పేజీ ఆయనని ఎంతగానో కదిలించింది. భాగ్యరాజ్ తన జీవితంలో ఎదుర్కొన్న తీవ్రమైన పేదరికం, అవమానాలు, పరాజయాలు, పోరాటాలు మరియు అనుభవించిన మానసిక వేదనలను చూసి వైరముత్తు కంటతడి పెట్టారు. భాగ్యరాజ్ బతికుండగా ఆ కోరికని తీర్చలేకపోయాననే బాధతో, ఆయన మరణించిన తర్వాత పూర్తి భావోద్వేగంతో ఆ పుస్తకానికి అద్భుతమైన ముందుమాటని  రాశారు. సాధారణంగా అయితే దీనిని ఈమెయిల్ ద్వారా పంపవచ్చు, కానీ భాగ్యరాజ్ పై ఉన్న గౌరవంతో వైరముత్తు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. భాగ్యరాజ్ భార్య పూర్ణిమ, కొడుకు శాంతనులను కలిసి ఆ ముందుమాట ప్రతిని వారికి అందజేశారు. ఈ సందర్భంగా పూర్ణిమ భాగ్యరాజ్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఈ పుస్తకం ఒక మనిషి జీవిత స్పందన అని, దీనిని త్వరలోనే ప్రచురించాలని వైరముత్తు ఆకాంక్షించారు. Also read: Prakash raj: ఈ నటుడుకి కులం లేదు.. ప్రకాష్ రాజ్ కామెంట్స్ వైరల్     
ప్రపంచ సినిమా రంగంలో క్రిస్టోఫర్ నోలన్ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన నుంచి ఒక సినిమా వస్తోందంటే చాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ముఖ్యంగా సంచలన విజయం సాధించిన 'ఓపెన్‌హైమర్' చిత్రం తర్వాత నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త విజువల్ వండర్ 'ది ఒడిస్సీ'. ఈ చిత్రం రిలీజ్‌కు ముందే గ్లోబల్ వైడ్‌గా అత్యధిక చర్చకు కారణమైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే, ఈ సినిమా చుట్టూ నడిచిన డిస్కషన్ మొత్తం మొదట్లో సానుకూలంగా సాగిందా అంటే అస్సలు కాదు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ప్రయాణం ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులను, తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంది. కొద్ది రోజుల క్రితం విడుదలైన 'ది ఒడిస్సీ' అఫీషియల్ ట్రైలర్ సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శల పాలైంది. నోలన్ ఎంచుకున్న క్యాస్టింగ్, విజువల్ టోన్, అలాగే క్లాసిక్ పురాణ గాథను ఆయన తెరకెక్కించిన విధానంపై నెటిజన్లు, హాలీవుడ్ వర్గాలు పెద్ద ఎత్తున పెదవి విరిచాయి. ఏకంగా యూట్యూబ్‌లో ఈ ట్రైలర్‌కు భారీ స్థాయిలో డిస్‌లైక్స్ రావడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ డిస్‌లైక్స్, ట్రోలింగ్ కారణంగా సినిమాపై నెగిటివ్ ప్రచారం ఒక్కసారిగా ముదిరిపోయింది. నోలన్ లాంటి లెజెండరీ డైరెక్టర్ కెరీర్‌లోనే ఇది ఒక పెద్ద డ్యామేజ్ లాగా కనిపించింది. ట్రైలర్ చూసి సినిమా ఫ్లాప్ అంటూ అప్పుడే సోషల్ మీడియాలో తీర్పులు కూడా ఇచ్చేశారు. కానీ, అసలు సిసలైన నోలన్ మ్యాజిక్ ఏంటో వరల్డ్ ప్రీమియర్ షో తర్వాత తెలిసొచ్చింది. ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్ ప్రీమియర్ అనంతరం పరిస్థితి 180 డిగ్రీలు పూర్తిగా మారిపోయింది. సినిమాను నేరుగా వీక్షించిన టాప్ సినీ విమర్శకులు, ఇంటర్నేషనల్ మీడియా ప్రతినిధులు ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాపై ఉన్న నెగిటివిటీకి ఈ మొదటి రెస్పాన్స్ గట్టి బ్రేక్ వేసింది. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్, కథను భారీ స్థాయిలో ఆవిష్కరించిన తీరు, నోలన్ సిగ్నేచర్ విజువల్ స్టైల్ అద్భుతంగా ఉన్నాయంటూ రివ్యూలు వెలువడుతున్నాయి. ట్రైలర్ ఆధారంగా సినిమాను తక్కువ అంచనా వేసిన వారంతా ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ అద్భుతమైన పాజిటివ్ టాక్ తో సినిమా చుట్టూ ఇప్పుడు సరికొత్త బజ్ క్రియేట్ అయింది. జూలై 17న 'ది ఒడిస్సీ' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. సినిమా విడుదలకు ఇంకా కచ్చితంగా 10 రోజులు సమయం ఉండగానే, ఈ రేంజ్‌లో పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ రావడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ ముందస్తు సానుకూల వాతావరణం సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌కు భారీగా కలిసిరానుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యూట్యూబ్ డిస్‌లైక్స్ నుండి థియేటర్లలో స్టాండింగ్ ఓవేషన్ వరకు సాగిన 'ది ఒడిస్సీ' ప్రయాణం, జూలై 17న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టించబోతుందోన‌ని ప్రపంచ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. Christopher Nolan, The Odyssey, The Odyssey First Reactions, Nolan Next Movie, Hollywood Epic Film, The Odyssey Premiere Talk
  ప్రకాష్ రాజ్.. నటుడుగా పది కాలాల పాటు పదితరాల వారు చెప్పుకునేంత పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. సమాజంలో కులం, మతం అనే అంశాలపై ఆయన ఎప్పుడూ తనదైన శైలిలో గళం విప్పుతూనే ఉంటాడు. అయితే, ఇటీవల ఆయన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒక తీవ్ర శోకం నేపథ్యంలో ఆయన పంచుకున్న మాటలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఇటీవల ప్రకాష్ రాజ్ మాతృమూర్తి స్వర్ణలత గారు మరణించిన సంగతి తెలిసిందే. ఆమె జీవిత ప్రయాణం, తమ కుటుంబ నేపథ్యం గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో అత్యంత భావోద్వేగంగా మాట్లాడారు. ఈ ఎమోషనల్ కామెంట్స్ నెట్టింట ఒక్కసారిగా వైరల్‌గా మారాయి. ప్రకాష్ రాజ్ మాట్లాడుతు 'సమాజంలో ఎవరైనా తనని  పరిచయం అడిగితే, నేను  ఏ కులానికో లేక మతానికో చెందినవాడినని చెప్పనని, అందరికంటే ముందుగా నేను ఒక 'మనిషిని' అని గర్వంగా చెప్పుకుంటాను. నటన అనేది కేవలం తన వృత్తి మాత్రమే. చదవడం, రాయడం నాకున్న ముఖ్యమైన అభిరుచులు. నా  తల్లి స్వర్ణలత చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. 1960 ప్రాంతంలో మా అమ్మానాన్న బెంగళూరుకి వలస వచ్చారు. మా అమ్మకు 12 ఏళ్ల వయసులోనే తల్లి మరణించగా, ఆ తర్వాత తండ్రి కూడా దూరమయ్యాడు. ఆమెతో పాటు నలుగురు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. అనాథాశ్రమంలో పెరిగిన మా అమ్మని ఎంతోమంది ఆదుకున్నారు. కష్టపడి నర్సింగ్ శిక్షణ పూర్తి చేసింది. వాళ్లకు తమ జాతి, కులం, బంధువులు ఎవరో కూడా తెలియదు. తర్వాత క్రిస్టియన్ మిషనరీలో చేరి క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. ఇటీవల వయోభారంతో తలెత్తిన ఆరోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె చివరి కోరికను గౌరవిస్తూ బెంగళూరులోని సెయింట్ మైఖేల్ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించినట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు. Also read: ఆ మూవీని ప్రమోట్ చేస్తే పెద్దిని డామేజ్ చేస్తున్నావ్ అనేవారు.. నాగవంశీ సంచలన వ్యాఖ్యలు   
ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ మోస్ట్ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది గ్లామర్ డాళ్‌ శ్రీలీల. కెరీర్ పరంగా ఎక్కడా తగ్గకుండా వరుస ప్రాజెక్టులతో ఈ బ్యూటీ దూసుకుపోతోంది. తనదైన అద్భుత అందం, చలాకీతనం, అంతకుమించిన డ్యాన్సింగ్ ప్రతిభతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలోనూ భారీగా ఫాలోయింగ్‌ను సంపాదిస్తూ నిరంతరం యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే ప్రతి పోస్ట్ కేవలం క్షణాల వ్యవధిలోనే నెట్టింట విపరీతంగా వైరల్ అయిపోతోంది. తాజాగా శ్రీలీల తన అధికారిక‌ ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసిన కొన్ని అందమైన ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. తాజా పోస్ట్‌కు "ఏ డే వెల్ స్పెంట్" అంటే ఈరోజు చాలా బాగా గడిచింది అంటూ ఒక క్యూట్ క్యాప్షన్‌ను జోడించారు. తెల్లటి హార్ట్ ఎమోజీని క్యాప్ష‌న్ కి జత చేయ‌గా.. ఈ లేటెస్ట్ సోషల్ మీడియా అప్‌డేట్ ప్రస్తుతం నెటిజన్లను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ లైకుల వర్షం కురిపిస్తోంది. ఈ పోస్ట్ చూసిన మెజారిటీ నెటిజన్లు శ్రీలీల అందాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. ఈ పోస్ట్ లో గ్రూప్ ఫోటో చూడ‌గానే ఎంబిబిఎస్ శ్రీ‌లీల త‌న క్లాస్ మేట్ల‌తో ఫోటో దిగిందా? అంటూ ప‌లువురు నెటిజ‌నులు ప్ర‌శ్నిస్తున్నారు. కామెంట్ సెక్షన్ లో అభిమానులు బ్యూటీ క్వీన్.. డ్రీమ్ గర్ల్ అని కొనియాడుతుంటే.. మరికొందరైతే ఏకంగా సౌత్ ఇండస్ట్రీస్ నెం.1 హీరోయిన్ అంటూ హార్ట్, ఫైర్ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ స్పందిస్తూ.. భవిష్యత్తులో ఎప్పటికైనా మీతో కలిసి పని చేసే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ తన కలని వెల్లడించారు. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. శ్రీలీల నటిస్తూనే ఎంబీబీఎస్ (MBBS) పూర్తి చేసిన‌ సంగతి తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ కొందరు అభిమానులు నా గర్ల్‌ఫ్రెండ్ శ్రీలీల MBBS.., సత్యా MBBS కి జాన్ అంటూ చాలా సరదాగా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం తమ కామెంట్లు హైలైట్ అవ్వడం కోసం, లైకులు రావడం కోసం రకరకాల వింత వింత కామెంట్లతో ఈ పోస్ట్ కింద హంగామా సృష్టిస్తున్నారు. మొత్తానికి ఈ ఒక్క పోస్ట్‌తో శ్రీలీల క్రేజ్ ఏంటో మరోసారి నిరూపితమైంది. ఇక శ్రీలీల సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో కూడా పాగా వేసేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ నవాబ్ సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ సరసన న‌టిస్తున్న తదుపరి బాలీవుడ్ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు బాలీవుడ్ క్రేజీ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన కూడా ఒక భారీ మ్యూజిక‌ల్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.   Sreeleela, Sreeleela MBBS, RT75 Sreeleela
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘డెకాయిట్’ బాక్సాఫీస్ వద్ద సేఫ్ వెంచర్‌గా నిలవడంతో ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సక్సెస్ ఉత్సాహంతో ఆయన తన పూర్తి దృష్టిని ప్రతిష్టాత్మక స్పై థ్రిల్లర్ సీక్వెల్ 'గూఢచారి 2' (G2) ప్రాజెక్ట్ పైనే పెట్టారు. మొదటి భాగం ‘గూఢచారి’ సృష్టించిన భారీ రికార్డుల దృష్ట్యా, ఈ సరికొత్త సీక్వెల్‌పై టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రేజీ సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ మెయిన్ విలన్‌గా నటిస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో అత్యంత హాట్ టాపిక్‌గా మారింది. ఈ బిగ్ కాస్టింగ్ లీప్ వెనుక టాలీవుడ్ మేకర్స్, అడివి శేష్ ప్లాన్ చేసిన మైండ్ బ్లోయింగ్ బిజినెస్ వ్యూహాలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో ‘మేజర్’ సినిమాతో నార్త్ ఇండియా ఆడియన్స్‌కు కూడా బాగా దగ్గరైన అడివి శేష్, రీసెంట్‌గా ఒక పెద్ద బాలీవుడ్ మల్టీస్టారర్ సినిమాకు సైన్ చేశారంటూ సోషల్ మీడియా వేదికగా ఒక రేంజ్‌లో ప్రచారం జరిగింది. దాంతో ఆయన అభిమానులంతా ఆ టాప్ ప్రొడక్షన్ బ్యానర్,  డైరెక్టర్ ఎవ‌రు అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఆ బాలీవుడ్ ఎంట్రీ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అడివి శేష్ ప్రస్తుతానికి ఎలాంటి హిందీ స్ట్రెయిట్ సినిమాను ఓకే చేయలేదు. ఆయన మైండ్ అండ్ ఫోకస్ అంతా కేవలం 'గూఢచారి 2' (G2) ను విజువల్ వండర్‌గా స్క్రీన్ పైకి తీసుకురావడం పైనే ఉంది. సాధారణంగా ఒక హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావాలంటే హీరో క్యారెక్టరైజేషన్ ఎంత స్టైలిష్‌గా ఉందో, దానికి ధీటుగా విలన్ పాత్ర కూడా అంతే పవర్‌ఫుల్‌గా మైండ్ గేమ్స్ ఆడేలా ఉండాలి. అందుకే ‘G2’ మేకర్స్ ఏరికోరి బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీని ప్రతినాయకుడిగా రంగంలోకి దించారు. ఈ సినిమాలో అడివి శేష్ వర్సెస్ ఇమ్రాన్ హష్మీ మధ్య వచ్చే ఇంటెన్స్ మైండ్ గేమ్స్, హై-ఎండ్ యాక్షన్ సీక్వెన్సులు సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలవబోతున్నాయని ఇన్సైడ్ టాక్. భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో అడివి శేష్ సరికొత్త స్టైలిష్ అవతార్‌లో కనిపించి మెప్పించనున్నారు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీని విలన్‌గా ఎంచుకోవడం వెనుక ఒక పక్కా కాస్టింగ్ అండ్ మార్కెట్ స్ట్రాటజీ దాగి ఉంది. దీనివల్ల నార్త్ బెల్ట్‌లో సినిమాను ప్రత్యేకంగా, ఖర్చు పెట్టి ప్రమోట్ చేయాల్సిన అవసరం లేకుండానే బాలీవుడ్ ట్రేడ్ మార్కెట్‌లో ఒక సహజమైన హైప్, క్రేజ్ క్రియేట్ అవుతుంది. హిందీలో నేరుగా ఒక స్ట్రెయిట్ హీరోగా ఎంట్రీ ఇచ్చి రిస్క్ చేసే కంటే, ఇలాంటి పక్కా స్క్రిప్ట్ ఉన్న గ్లోబల్ స్పై థ్రిల్లర్ ద్వారా నార్త్ ఇండియన్ మార్కెట్‌ను కొల్లగొట్టాలనేది అడివి శేష్ మాస్టర్ ప్లాన్‌గా కనిపిస్తోంది. బిజినెస్ భాగస్వాములకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ స్థాయిలో లాభాలు, నార్త్ మార్కెట్ మైలేజ్ తెచ్చేలా ఈ కాస్టింగ్ లీప్‌ను ప్లాన్ చేశారు. ప్రస్తుతానికి మాత్రం ఈ 'G2' ద్వారానే పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. ఇటు శేష్ స్టైలిష్ యాక్షన్, అటు ఇమ్రాన్ హష్మీ పవర్‌ఫుల్ విలనిజం తోడైతే థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయం అని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు.       Goodachari 2, Adivi Sesh, Emraan Hashmi
ఈటీవీ విన్ వేదికగా సరికొత్త ఫ్యామిలీ, ఫ్రెండ్‌షిప్ ఎమోషన్స్ కలబోసిన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘గుర్తుకొస్తున్నాయి’ వెబ్ సిరీస్. విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో, వినోద్ గాలి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్‌లుగా వినోదాన్ని పంచుతోంది. ఎప్పుడూ కుటుంబ బంధాలు, మానవీయ విలువల చుట్టూ తిరిగే కథలకే ప్రాధాన్యతనిచ్చే ఈటీవీ, ఈసారి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా అదే సెంటిమెంట్‌ను నమ్ముకుని ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించింది. కాకినాడ నేపథ్యంలో నలుగురు ప్రాణస్నేహితుల చుట్టూ తిరిగే ఈ కథ, చూసే ప్రతి ఒక్కరికీ తమ బాల్యాన్ని, స్కూల్ రోజులను ఖచ్చితంగా గుర్తుచేస్తుంది. సమీక్షల ప్రకారం ఈ సిరీస్‌కు ఐదుకి 2.75 రేటింగ్ లభించింది. పాత కథే అయినప్పటికీ, దర్శకుడు కథనాన్ని నడిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కథలోకి వెళితే, కాకినాడలో స్కూల్ డేస్ నుంచి సంతోష్, ఆనంద్, శ్రీకాంత్, గణేశ్ మంచి స్నేహితులు. చిన్నప్పుడు చదువుపై పెద్దగా శ్రద్ధ పెట్టకపోయినా ఆకతాయి పనులతో, ఆటపాటల్లో ఎప్పుడూ ముందుండేవారు. కాలక్రమంలో సంతోష్ మిగతా ముగ్గురు మిత్రులకు కొద్దిగా దూరమవుతాడు. అయితే చిన్నతనం నుంచే సంతోష్, వైశాలి ఇద్దరూ ప్రేమించుకుంటారు. వైశాలి ఎవరో కాదు, వారు చదువుకున్న స్కూల్ ప్రిన్సిపాల్ రఘునాథ్ కూతురు. సంతోష్ మరియు అతని స్నేహితుల ఆకతాయి పనుల వల్ల రఘునాథ్ మాస్టర్‌కు వారిపై అస్సలు మంచి అభిప్రాయం ఉండదు. కానీ కూతురి ఇష్టాన్ని కాదనలేక, సంతోష్ మారిపోయాడన్న నమ్మకంతో పెళ్లికి ఒప్పుకుంటాడు. అయినప్పటికీ పెళ్లికి ముందే సంతోష్‌ను పరీక్షించాలనుకుని, వివాహానికి 3 రోజుల ముందు ఊరు దాటి వెళ్లకూడదని వైశాలితో కండిషన్ పెట్టిస్తాడు. ట్విస్ట్ ఎక్కడ వస్తుందంటే, మామగారి మాటను పక్కనబెట్టి సంతోష్ తన మిత్రులతో కలిసి బ్యాచిలర్ పార్టీ కోసం కారులో గోవా బయల్దేరతాడు. దురదృష్టవశాత్తూ మార్గమధ్యంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో సంతోష్ తలకు తీవ్ర గాయమై గతాన్ని పూర్తిగా మర్చిపోతాడు. పెళ్లికి కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉన్న తరుణంలో డాక్టర్ చెప్పిన ఈ మాటతో స్నేహితులు, తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతారు. వైశాలి తండ్రికి ఈ విషయం తెలిస్తే పెళ్లి ఆగిపోతుందని భయపడి, ఎలాగైనా సంతోష్ ఉన్న పరిస్థితిని దాచిపెట్టి పెళ్లి జరిపించాలని స్నేహితులు నిశ్చయించుకుంటారు. సంతోష్ పక్కనే ఉంటూ అతనికి పాత జ్ఞాపకాలను గుర్తుచేయడానికి ఆ ముగ్గురు మిత్రులు పడే పాట్లు, ఆ క్రమంలో వచ్చే హాస్యం ఈ సిరీస్‌కు ప్రధాన బలం. ఈ తరహా మెమొరీ లాస్ డ్రామా గతంలో చాలా సినిమాల్లో చూసినప్పటికీ, దర్శకుడు వినోద్ గాలి స్క్రీన్‌ప్లేతో కొంతవరకు కొత్తదనాన్ని ఆవిష్కరించారు. ముఖ్యంగా టీనేజ్ జ్ఞాపకాలు, వేసవి సెలవుల్లో అమ్మమ్మ తాతయ్యల ఇళ్లకు వెళ్లడం వంటి దృశ్యాలు ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని హత్తుకుంటాయి. రోహిణి హట్టంగడి, శుభలేఖ సుధాకర్ వంటి సీనియర్ నటుల నటన ఈ సిరీస్‌కు మరింత నిండుదనాన్ని తీసుకురాగా, శివన్నారాయణ కామెడీ ప్రేక్షకులకు మంచి రిలీఫ్ ఇస్తుంది. క్లైమాక్స్ ఎపిసోడ్‌లో స్నేహితులు చేసే త్యాగాలు, ఎమోషన్స్ కళ్లు చెమర్చేలా చేస్తాయి. రహీమ్ షేక్ ఫోటోగ్రఫీ, అజయ్ అరసాడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సిరీస్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. ప్రేమ, స్నేహం కోసం నిలబడే ఒక మంచి సందేశంతో సాగే ఈ 7 ఎపిసోడ్ల సిరీస్‌ను కుటుంబ సమేతంగా హాయిగా వీక్షించవచ్చు.     Gurthukosthunnayi, ETV Win, Viraj Ashwin, Wonod Gali, Telugu web series 2026
  సితార ఎంటర్ టైన్ మెంట్ అధినేత నాగ వంశీకి చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ నెల 10 న అఖిల్ అక్కినేని వన్ మాన్ షో లెనిన్ తో వరల్డ్ వైడ్ గా అడుగుపెట్టనున్నాడు. తను నిర్మించిన చిత్రాలే కాకుండా ఇతర లాంగ్వేజ్ సినిమాలని కూడా రిలీజ్ చేస్తాడనే విషయం తెలిసిందే. ఆ కోవలోనే  యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి కీ రోల్స్ పోషించిన 'బ్లాస్ట్ జోన్' ని కూడా రిలీజ్ చేసాడు. సుభాష్ కె. రాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మార్షల్ ఆర్ట్స్ థ్రిల్లర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. కేవలం రూ. 18 కోట్ల పరిమిత బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ. 74.85 కోట్లు వసూలు చేసి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-3 తమిళ చిత్రంగా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అయితే ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినా, తెలుగులో ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఆశించిన స్థాయిలో ఎందుకు ప్రమోట్ చేయలేదు అనే ప్రశ్న సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై నాగవంశీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ అసలు నిజాలను బయటపెట్టారు. నేను  కావాలనే 'బ్లాస్ట్ జోన్' ప్రమోషన్ల విషయంలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. బ్లాస్ట్ జోన్  విడుదలైన సమయంలోనే  'పెద్ది' థియేటర్లలోకి వచ్చింది. 'పెద్ది'  నిర్మాత సతీష్ కిలారు నాకు అత్యంత ఆప్తమిత్రుడు. పైగా ఆ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న తొలి చిత్రం కావడం వల్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చింది. ఒకవేళ ఆ సమయంలో నేను  'బ్లాస్ట్ జోన్' చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసి ఉంటే, ఇండస్ట్రీలో అనవసరపు వివాదాలు వచ్చేవి. నాగవంశీ కావాలనే మెగా ఫ్యామిలీ సినిమాని టార్గెట్ చేస్తున్నాడు, దానికి పోటీగా ఈ చిన్న డబ్బింగ్ సినిమాని  నిలబెట్టి డ్యామేజ్ చేస్తున్నాడు' అంటూ గాసిప్స్ సృష్టించేవారు. ఒకవేళ 'పెద్ది' విడుదలయ్యాక ప్రమోషన్లు గట్టిగా చేసి ఉంటే, ఆ సినిమా కలెక్షన్లని  దెబ్బతీయడానికే ఇప్పుడు పబ్లిసిటీ చేస్తున్నావా అని విమర్శించేవారు. అందుకే సైలెంట్‌గా ఉండటమే సేఫ్ గేమ్ అని భావించాను. Also read: lenin: లెనిన్ థియేటర్ల వేట.. బాక్సాఫీస్ వద్ద ఊరమాస్ జాతర! బ్లాస్ట్ జోన్  రెండు వారాల ముందే విడుదలై ఉంటే తెలుగు బాక్సాఫీస్ వద్ద మరింత మెరుగైన వసూళ్లు సాధించేది. అయినప్పటికీ, ఎలాంటి భారీ హంగామా లేకపోయినా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నా  ఇంకా మంచి రెస్పాన్స్ వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. బ్లాస్ట్ జోన్ మే 28 న థియేటర్స్ లోకి రాగా, పెద్ది జూన్ 4 న రిలీజైన విషయం తెలిసిందే.   
మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేందుకు సరికొత్త వేగంతో దూసుకుపోతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'మెగా158' (Mega 158). ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్ పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఎక్కడా బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్‌లో చిత్ర యూనిట్ సరికొత్త రికార్డులు సృష్టించేలా ఒక భారీ యాక్షన్ షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది. ఈ తాజా హైదరాబాద్ షెడ్యూల్ విశేషాల్లోకి వెళితే, చిత్రంలోనే అత్యంత కీలకమైన, మైండ్ బ్లోయింగ్ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో ఈ భారీ ఫైట్ సీన్ రూపుదిద్దుకుంటోంది. భారీ బడ్జెట్‌తో, వందలాది మంది ఫైటర్ల నడుమ అత్యంత గ్రాండ్‌గా ఈ సీక్వెన్స్ ప్లాన్ చేశారు. ఈ యాక్షన్ ఎపిసోడ్‌లో చిరంజీవి మునుపెన్నడూ లేని విధంగా అత్యంత డైనమిక్ అవతారంలో కనిపించనున్నారు. డెబ్భై ఏళ్ల వయసులో కూడా చిరంజీవి అదే ఎనర్జీతో, ఏమాత్రం వెనకడుగు వేయకుండా స్వయంగా రిస్కీ స్టంట్స్ చేస్తుండటం విశేషం. కేవలం డూప్‌లతో కానివ్వకుండా, ఫ్యాన్స్‌కు వెండితెరపై అసలైన విజువల్ ఫీస్ట్ ఇవ్వాలనే పట్టుదలతో మెగాస్టార్ ఈ షెడ్యూల్‌లో చెమటోడుస్తున్నారు. థియేటర్లలో ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకునేలా ఈ ఫైట్ సీన్‌ను డిజైన్ చేశారు. మరోవైపు, ఈ సినిమా అప్‌డేట్స్ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్న మెగా అభిమానులకు మేకర్స్ త్వరలోనే ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టైటిల్ టీజర్‌ను చాలా త్వరగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. సాంకేతికంగా ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కుతోంది. థమన్ ఎస్ (Thaman S) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా విజయ్ కార్తీక్ కన్నన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా ఆంటోనీ రూబెన్ వర్క్ చేస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, రైటింగ్ ద్వయం భాను-నందు డైలాగ్స్ రాస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్, మాస్ అప్పీల్, సెంటిమెంట్ పక్కాగా కుదిరిన ఈ చిత్రం టాలీవుడ్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.     Mega 158, Chiru 158, Chiranjeevi, Bobby Kolli, TeluguOne  
ఒక ఉత్తమమైన తరాన్ని సమాజానికి ఇచ్చే ఉద్దేశంతో వివాహం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. ఆరోగ్యకరమైన బంధం ద్వారా  ఒక మంచి తరం తయారవుతుంది. కుటుంబం విషయానికి వస్తే.. వంశం ముందుకు సాగడం అనేది పిల్లల ద్వారానే జరుగుతుంది. ఇది వందలాది, వేలాది సంవత్సరాలుగా సాగుతున్న సంప్రదాయం.  అయితే భారతదేశంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. భారతీయులు విదేశాలలో పుట్టిన సంప్రదాయాలను పాటిస్తూ వెర్రిగా మారిపోతున్నారు. డేటింగ్ లు, సహజీవనాలు, రకరకాల కొత్త కల్చర్లు పాటిస్తూ భారతీయ సంస్కృతికి దూరం అవుతున్నారు. ఇప్పుడు డింక్ పేరిట ఏకంగా ఒక తరాన్ని పుట్టకుండా ఆపేస్తున్నారు.  అసలు డింక్ అంటే ఏమిటి?  దీని పట్ల భారతీయ జంటలు ఎందుకు అంత ఆకర్షితులు అవుతున్నారు? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. దశాబ్దాలుగా కుటుంబ వంశాన్ని కొనసాగించే మార్గంగా వివాహాన్ని చూసేవారు. కానీ కొత్త తరం దీనికి వ్యతిరేకంగా ఉంది, వంశాన్ని ముందుకు తీసుకెళ్లడం అనే విషయం కంటే.. ప్రపంచం పట్ల ఆసక్తి పెరిగింది,  సంబంధాల తీరు కూడా మారుతోంది. ఇప్పుడు ఒక బిడ్డను కనాలన్నా,  వంశాన్ని ముందుకు నడపాలన్నా పెద్దగా ఆసక్తి చూపడం లేదు.దీన్నే డింక్ అంటున్నారు. విదేశాలలో పుట్టిన ఈ సంస్కృతి పట్ల భారతీయులు కూడా  నెమ్మదిగా అలవాటు పడుతున్నారు. డింక్ అంటే.. DINK అంటే ' డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ ', పేరులోనే దీని  అర్థం ఉంది. దీని అర్థం పెళ్లి తర్వాత పిల్లలను కనాలని అనుకోకపోవడం. డింక్ జంటలు ఎందుకు పెరుగుతున్నాయ్.. కొన్నేళ్ల క్రితం వరకు ఇంకా పిల్లలు ఎందుకు పుట్టలేదు అనేదే చాలా పెద్ద ప్రశ్నగా ఉండేది పెళ్లైన జంటల్లో.. కానీ ఇప్పుడు పిల్లలు వద్దు అనే నిర్ణయం వస్తోంది. ముఖ్యంగా బారతదేశంలోని పట్టణాలలో ఉన్న జంటలలో చాలా మార్పు వస్తోంది. చదువుకున్న, ఇద్దరూ సంపాదించే భార్యాభర్తలు అసలు మనకు పిల్లలు అవసరమేనా అనే ప్రశ్న వేసుకుంటున్నారు. ముఖ్యంగా 20, 30 ఏళ్ల వయసులో  పెళ్లిచేసుకున్న జంటలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆర్థిక భారం.. చాలామంది ఎదుర్కునే స్పష్టమన కారణం ఆర్థిక విషయాలే..   ఇరవై, ముప్పై సంవత్సరాల కిందట పిల్లలను పెంచినట్టు నేటికాలంలో మెట్రో సిటీలలో పిలలను పెంచడం కష్టమవుతోందని చాలామంది అంటున్నారు. పాఠశాల ఫీజులు,ఇల్లు కొనడం లేదా అద్దె, పిల్లల సంరక్షణ , ఆరోగ్య సంరక్షణ.. ఇవన్నీ పిల్లలు వద్దు అనుకోవడానికి కారణం అవుతున్నాయి. మెట్రో పట్టణాలలో ఇద్దరు వ్యక్తుల సంపాదన కూడా వీటికి సరిగా సరిపోవడం లేదని ఆవేదన చాలా మందిలో ఉంది. క్వాలిటీ లైఫ్.. పిల్లలు పుడితే లైఫ్ క్వాలిటీ పోతుందని చాలామంది జంటలు అబిప్రాయం.  పిల్లల బాధ్యతలలో తాము ఎన్నో సంతోషాలు, సరదాలు, ఇష్టాలు కోల్పోవడానికి, జీవితాన్ని సరదాగా గడపడానికి, ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడానికి సరిపడినంత సమయం దొరకడం లేదని అనుకుంటున్నారు.  పైగా పిల్లల కారణంగా జీవితంలో కాస్త విలాసంగా బ్రతికే అవకాశం ఉన్నా దాన్ని పిల్లల కోసం త్యాగం చేయాల్సి వస్తుంది. అందుకే పిల్లలు వద్దని అనుకుంటున్నారు. మరొక మార్గం.. చాలా మంది DINK జంటగా ఉండాలని నిర్ణయం తీసుకుంటే అది  బాధ్యతల నుండి తప్పించుకోవడం కోసం లేదా వారి విలాసవంతమైన జీవితం కోసం అనుకుంటారు.  కానీ ఇది తప్పు.. చాలామంది పిల్లల పట్ల తీసుకోవాల్సిన బాధ్యతలను ఒకరికొకరు బాధ్యతగా చూసుకోవడంలో, అలాగే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, జంతు సంక్షేమం వంటి  తమకు ఇష్టమైన విషయాల ద్వారా బాధ్యతను తీసుకుంటున్నారు. ఇది తమ తరువాత వంశం లేకపోయినా,   కుటుంబాన్ని కాపాడుకోవడం ,  జీవన నాణ్యతను మెరుగ్గా ఉంచుకోవడం వంటి కారణాల వల్లే చేస్తున్నారు.                                    *రూపశ్రీ.
  నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా, ఒకరినొకరు సరైన విధంగా కమ్యూనికేట్ చేయడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలాముఖ్యం. నిజానికి చాలామంది రిలేషన్ లో ఉన్నప్పుడు  తమ మనసులో ఉన్న విషయాలను ఓపెన్ గా చెప్పడానికి ధైర్యం చేయరు. చాలా సందేహపడుతూ ఉంటారు. దీని వల్ల అపార్థాలు పెరిగి  రిలేషన్స్ లో దూరం ఏర్పడుతుంది. అందుకే రిలేషన్ లో ఉన్నప్పుడు ఓపెన్ గా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం అంటుంటారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నమ్మకాన్ని పెంచుతుంది.. చక్కగా, ఎలాంటి విమర్శలు లేకుండా ఓపెన్ గా మాట్లాడుకోవడం ఏ  సంబంధానికైనా బలమైన పునాది ఏర్పరుస్తుంది. రిలేషన్ లో ఉన్న వ్యక్తులు నిజాయితీగా మాట్లాడినప్పుడు, వారి మధ్య నమ్మకం దానంతట అదే పెరుగుతుంది. మంచి కమ్యూనికేషన్  వల్ల అవతలి వ్యక్తి మన మాటలను శ్రద్ధగా వింటున్నారని మనకు అనిపిస్తుంది. ఇది అపార్థాల అవకాశాన్ని తగ్గిస్తుంది , సంబంధాలు దీర్ఘకాలం పాటు బలంగా ఉండటానికి సహాయపడుతుంది.  కమ్యూనికేషన్ బలహీనంగా ఉంటే.. అనుమానం,  అపార్థాలు, దూరం పెరుగుతాయి. అపార్థాలు తొలగిస్తుంది.. రిలేషన్స్ లోని సమస్యలు చాలా వరకు పెద్ద కారణం వల్ల కాకుండా, చిన్న చిన్న అపార్థాల వల్ల తలెత్తుతాయి. సరైన సంభాషణ ద్వారా ఈ అపార్థాలను సులభంగా పరిష్కరించవచ్చు. ప్రజలు తమ ఆలోచనలను, భావాలను బహిరంగంగా మాట్లాడుకున్నప్పుడు, వారికి ఉండే  సందేహాలు తొలగిపోతాయి. ఇది సంబంధాలలో స్పష్టతను తీసుకువచ్చి, అనవసరమైన ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎమోషనల్ బాండింగ్.. కమ్యూనికేషన్ చేయడం అంటే కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే కాదు..  అది భావోద్వేగాలను వ్యక్తపరిచే ఒక మార్గం కూడా.   మనసులోని మాటలను పంచుకున్నప్పుడు ఇద్దరి మధ్య మరింత గాఢమైన భావోద్వేగ బంధం ఏర్పడుతుంది. ఇది ఒకరిలో ఒకరికి చెందిన ఫీలింగ్ ను పెంపొందించి, సంబంధాలను మరింత సన్నిహితంగా చేస్తుంది. ఈ అనుబంధమే ఏ సంబంధాన్నైనా ప్రత్యేకంగా నిలుపుతుంది. సమస్యల పరిష్కారం.. ప్రతి సంబంధంలో లేదా పరిస్థితిలో సమస్యలు సర్వసాధారణం, కానీ సరైన కమ్యూనికేషన్  ద్వారా వాటిని సులభంగా పరిష్కరించవచ్చు. ఇరు పక్షాలు తమ అభిప్రాయాలను ఓపెన్ గా వ్యక్తపరిచినప్పుడు, పరిష్కారాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కమ్యూనికేషన్ వల్ల  తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం తగ్గుతుంది.  ఇద్దరు వ్యక్తులు ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు వెళ్లడానికి మార్గం కల్పిస్తుంది.  అందుకే ఓపెన్ గా మాట్లాడుకోవడం  అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. మానసిక ఒత్తిడి.. మనసులో భావాలను, ఆందోళనలను ఇతరులతో పంచుకున్నప్పుడు మనసు తేలికపడుతుంది. ఏ విషయాన్ని అయినా మనసులోనే దాచుకోవడం ఒత్తిడిని పెంచుతుంది, కానీ మాట్లాడటం ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మంచి కమ్యూనికేషన్ ఒక వ్యక్తి మరింత ప్రశాంతంగా, సమతుల్యంగా , సంతోషంగా ఉండేలా చేస్తుంది.                                      *రూపశ్రీ.
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం,  ఈర్ష్య,  అసూయ,  ఓర్చుకోలేని తత్వం ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి వారిని చెడ్డవాళ్లుగా చెబుతూ ఉంటారు.  చాలా వరకు మనుషులు తాము మంచి వాళ్లని, చెడ్డ వాళ్లని బయటకు చెప్పుకోరు.  వారి ప్రవర్తనలో ఇది బయటపడుతూ ఉంటుంది.  ముఖ్యంగా కొందరు వ్యక్తులు మంచి వాళ్ల చుట్టూ చేరి తీయని మాటలతో మోసం చేయాలని చూస్తుంటారు.  వారు ఇలా మోసం చేస్తారని తెలుసుకోలేని పరిస్థితిలో కొందరు ఉంటారు.  తీయని మాటలతో అందరినీ మోసం చేయగల వ్యక్తులు ఎలా ఉంటారు? వారిని కనిపెట్టడం ఎలా?  తెలుసుకుంటే.. ప్రసంశలు.. ఎవరైనా  కలిసిన వెంటనే మితిమీరి పొగడటం మొదలుపెట్టినా లేదా రాత్రికి రాత్రే మిమ్మల్ని ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రకటించినా, జాగ్రత్తగా ఉండాలి. మోసం చేసే వ్యక్తులు  వారిని గుడ్డిగా నమ్ముతారనే ఆశతో, మొదట్లో  ప్రేమను, పొగడ్తలను కురిపిస్తారు. మీకు వాళ్ల మీద  నమ్మకం ఏర్పడిన తర్వాత, వారి నిజ స్వరూపం బయటపడుతుంది. తప్పు ఒకరిది, అవమానం మరొకరిది.. తీయని మాటలతో మోసం చేసే వ్యక్తుల ముఖ్య లక్షణం ఏమిటంటే, వారు తమ తప్పులను ఎన్నడూ ఒప్పుకోరు . ఒకవేళ మీరు వారు తప్పు చేయడం మీరు గమనించినా, వారు ఆ పరిస్థితిని ఎంత చాకచక్యంగా వాడుకుంటారంటే, చివరికి మీకే అపరాధభావం కలుగుతుంది. మీరు తప్పు చేశారని మీకు అనిపించేలా  చేస్తారు. తమని తాము అనుమానించుకునేలా.. "నేను అలా ఎప్పుడూ అనలేదు," అనడం లేదా..  "నీకే పిచ్చి, అది అసలు ఎప్పుడు జరిగింది, అలాంటిదేం  జరగలేదు." వంటి  మాటలు ఎవరినుండైనా ఎదురవుతూ ఉంటే..  జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఇతరులను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేవారు తరచుగా మీకు ఎంత నమ్మకంగా అబద్ధాలు చెబుతారంటే, మీరు మీ జ్ఞాపకశక్తిని, నిజాయితీని మీరే అనుమానించడం మొదలుపెడతారు. ఇది మనసును నియంత్రించడంలో చాలా ప్రమాదకరమైన పద్ధతి. అయ్యో పాపం అనుకునేలా చేయడం.. పరిస్థితులు ఎలా ఉన్నా, తప్పు ఎవరిదైనా సరే, తియ్యని మాటలతో మోసం చేసే  వ్యక్తులు తామే ప్రపంచంలో చాలా బాధలో ఉన్నవారమన్నట్లుగా కథను చెబుతారు. వారు మీ సానుభూతిని పొందాలని చూస్తారు, తద్వారా మీరు వారి పట్ల జాలిపడి, వారు చెప్పే ప్రతిదానితో ఏకీభవించి వారి గురించి పాపం అనుకునేలా చేస్తారు. ఇష్టమైన వారి నుండి వేరు చేయడం.. మిమ్మల్ని లొంగదీసుకోవాలనుకునే వ్యక్తి, మొదట మిమ్మల్ని మీ నిజమైన స్నేహితులు , కుటుంబ సభ్యుల నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. "మీ కుటుంబం మిమ్మల్ని అర్థం చేసుకోదు" లేదా "మీకు ఉన్నది నేను ఒక్కడినే" అనే ఆలోచనలను  మనసులో నాటుతారు. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నారని, వారిపై ఆధారపడి ఉన్నారని భావించేలా చేయడానికి వారు ఇలా చేస్తారు. అవసరం.. అవసరానికి మాత్రమే మాట్లాడేవారు, మిగతా సమయాలలో తప్పించుకోవడం లేదా కారణాలు, సాకులు చెప్పి దూరంగా ఉండటం చేసేవారు మోసం చేసే స్వభావం కలిగినవారని అర్థం.  ఇలాంటి వారు తమకు అవసరం వచ్చినప్పుడు  చాలా మంచివారిలా ఉంటారు, కానీ వారి పని పూర్తయిన వెంటనే, మిమ్మల్ని మళ్లీ పట్టించుకోవడం మానేస్తారు . తియ్యగా మాట్లాడేవారిని గుర్తించడం కష్టం, ఎందుకంటే వారు తరచుగా చాలా బాగా నటిస్తారు. కానీ ఎప్పుడూ మీ అంతరాత్మ చెప్పేది వినాలి. ఒక సంబంధం మీకు సంతోషానికి బదులుగా ఎప్పుడూ మానసిక గందరగోళాన్ని, ఒత్తిడిని కలిగిస్తుంటే, హద్దులు పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం.                                    *రూపశ్రీ.
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కాల్షియం,  ప్రోటీన్ కూడా ఉంటుంది.  భారతీయులు భోజనం చివర పెరుగుతో తింటే తప్ప వారికి తృప్తి ఉండదు. వేసవి కాలంలో పెరుగును ఇష్టంగా తింటారు. అయితే వర్షాకాలంలో పెరుగు తినడం గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు.  పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని,  జీర్ణవ్యవస్థ పై ప్రభావం పడుతుందని అంటుంటారు.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. పెరుగు కడుపుకు మేలు చేసే ప్రోబయోటిక్ ఆహారంగా పరిగణించబడుతుంది, కానీ వర్షాకాలంలో పెరుగు తినడం పై  భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయని కొందరు చెబుతారు, అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం వేరే విధంగా చెబుతున్నారు. వర్షాకాలంలో పెరుగు తినవచ్చా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వర్షాకాలంలో పెరుగును తినవచ్చు, కానీ దాని పరిమాణం , పెరుగు తినే  సమయం విషయంలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అయితే, వర్షాకాలంలో జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల కొంతమందికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది,  పేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది, శరీరాన్ని చల్లబరచడమే కాకుండా ఉత్తేజపరుస్తుంది.   రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. వర్షంలో పెరుగు తినడం వల్ల కలిగే నష్టాలు.. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు , ఫ్లూ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే పెద్దలు జలుబు, జ్వరం ఉన్నప్పుడు పెరుగు తినకూడదని చెబుతారు. పెరుగు తినడం వల్ల   కఫం , శ్లేష్మంతో సమస్యలు రావచ్చు. కొంతమందికి కడుపు ఉబ్బరం కలగవచ్చు.  రాత్రిపూట తినడం జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. పెరుగు ఎలా తింటే శ్రేష్టం..  పగటిపూట మాత్రమే పెరుగు తినడం మంచిది.  రాత్రిపూట పెరుగు తినడం మానుకోవాలి.   కొద్దిగా వేయించిన జీలకర్ర లేదా నల్ల మిరియాల పొడి వేసుకుని  పెరుగు తీసుకుంటే మంచిది.  తాజాగా,  ఇంట్లో తయారుచేసిన పెరుగును మాత్రమే తినడం ఆరోగ్యానికి ఎంతో ఉత్తమం. పెరుగు ఎవరు తినకూడదు? జలుబుతో బాధపడుతున్న వాళ్లు,  రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు, ఆస్తమా లేదా అలర్జీ రోగులు, రాత్రి ఆలస్యంగా భోజనం చేసే వారు.. పెరుగు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.                                   *రూపశ్రీ.
శరీరంలో అధిక వేడి, పాదాల్లో మంట, కళ్లలో మంట, నోటి పూత, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ లక్షణాలు సాధారణంగా కనిపించినప్పటికీ, ఆయుర్వేదం ప్రకారం ఇవి పిత్త దోషం (Pitta Dosha) పెరగడం వల్ల వచ్చే సంకేతాలు కావచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. చి. మధుసూదన్ శర్మ వివరిస్తున్నారు. ఈ వీడియోలో పిత్త దోషం ఎందుకు పెరుగుతుంది? దానికి కారణమయ్యే ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వాతావరణ ప్రభావాలు ఏమిటి? అలాగే పిత్తాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన జీవనశైలి, ఆయుర్వేదంలో సూచించే సహజ చిట్కాలు వంటి అనేక ఉపయోగకరమైన విషయాలను సులభంగా వివరించారు. శరీరంలో వేడి ఎక్కువగా అనిపించడం, పాదాల్లో లేదా కళ్లలో మంట, తరచూ నోటి పూత రావడం, గ్యాస్, అసిడిటీ సమస్యలు వేధిస్తుంటే ఈ వీడియోలో చెప్పిన సూచనలు మీకు ఉపయోగపడవచ్చు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: పిత్త దోషం అంటే ఏమిటి? శరీరంలో వేడి పెరగడానికి ప్రధాన కారణాలు పాదాలు, కళ్లలో మంట ఎందుకు వస్తుంది? నోటి పూత, గ్యాస్, అసిడిటీకి ఆయుర్వేద వివరణ పిత్తాన్ని తగ్గించే ఆహారాలు నివారించాల్సిన ఆహార పదార్థాలు రోజువారీ జీవితంలో పాటించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లు సహజంగా శరీరాన్ని చల్లగా ఉంచే ఆయుర్వేద సూచనలు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, పిత్త దోషాన్ని సమతుల్యం చేసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆయుర్వేద అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల కోసం తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని లేదా ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
పురుషుల ఆరోగ్యం విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేసే సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చాలా రకాల క్యాన్సర్లను విజయవంతంగా చికిత్స చేయవచ్చు. అయితే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యాధి ముదిరే ప్రమాదం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ యూరాలజిస్టు, ఆండ్రాలజిస్టు డా. ఏవి రవి కుమార్ పురుషుల్లో ఎక్కువగా కనిపించే ఐదు ప్రధాన క్యాన్సర్ల గురించి సులభంగా వివరించారు. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, వృషణాల క్యాన్సర్, పురుషాంగ క్యాన్సర్ వంటి వ్యాధుల లక్షణాలు, ప్రమాద కారకాలు, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి అనే అంశాలను తెలియజేశారు.  అలాగే చాలామందికి ఉండే సందేహమైన యూరాలజీ (Urology) మరియు ఆండ్రాలజీ (Andrology) మధ్య ఉన్న తేడాను కూడా స్పష్టంగా వివరించారు. మూత్ర సంబంధిత వ్యాధులు, పురుషుల లైంగిక ఆరోగ్యం, సంతానలేమి సమస్యలు, ప్రోస్టేట్ సమస్యలు వంటి సందర్భాల్లో ఏ నిపుణుడిని సంప్రదించాలో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోవచ్చు.  పురుషులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు? క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు ఎందుకు అవసరం? వంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఈ వీడియోలో డా. ఏవి రవి కుమార్ వివరించారు.  ప్రతి పురుషుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆరోగ్య సమాచారం కోసం ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.   మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)