రాష్ట్ర విభజన కిం కర్తవ్యమ్?

Publish Date:Jan 27, 2013

Advertisement

 

అందరూ అనుకోన్నట్లే రాష్ట్ర విభజన సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ రాష్ట్రంలో మూడు ప్రాంతాల నేతలతో మొదటి నుండి చర్చలు ప్రారంభించాల్సి ఉందని, దానికి నిర్దిష్ట గడువు కూడా చెప్పలేమని కేంద్రం ప్రకటనతో తెలంగాణా ప్రాంతంలో అగ్నికీలలు రాజుకోనుండగా, మిగిలిన ప్రాంతాలలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొంటాయి. అయితే, పోరుగింటికి నిప్పంటుకొంటే అది పక్కనున్న ఇంటికీ అంటుకోక మానదు.

 

 

అయితే, సమస్యను పరిష్కరించవలసిన కేంద్ర ప్రభుత్వం నాన్పుడు ధోరణితో సాగదీస్తోందనే వాదన అర్ధ రహితం. రాష్ట్రవిభజన చాలా క్లిష్టమయిన సమస్య అని ప్రతీ రాజకీయనాయకుడికీ స్పష్టంగా తెలిసి ఉన్నపటికీ, ఆ విషయాన్నీ బహిరంగంగా మాత్రం ఒప్పుకోరు. ఎందుకంటే ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారివి. ఈ రోజు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమనో, విభజించమనో వీదులకెక్కి పోరాటాలు చేసేవారెవరూ కూడా ఒక్కనాడయినా సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాలని అనుకోలేదు. అలాగా అనుకొంటే ఈ సమస్యకి పరిష్కారం డిల్లీలో కాక రాష్ట్రంలోనే దొరికి ఉండేది. గానీ, తమను తాము మహా మేధావులుగా భావించుకొనే మన రాజకీయ నాయకులు గత పదేళ్ళబట్టి ఉద్యమాలు జరుగుతున్నా కూడా ఇంతవరకు ఇటువంటి చర్చలకు శ్రీకారం చుట్టకపోవడమే వారిలో చిత్తశుద్దిలేదని నిరూపిస్తోంది.

 

దేశంలో దరిద్రం ఉన్నంతకాలం వోటు బ్యాంకు పదిలంగా ఉన్నట్లే, ఈ సమస్య ఉన్నంత కాలం ప్రజలలో భావోద్వేగాలూ ఉంటాయి, వాటిని ఎప్పుడుకావలనుకొంటే అప్పుడు రాజేసుకోని వోట్ల రూపంలో మార్చుకోవచ్చును. అవసరం లేనప్పుడు ఉద్యమ నాయకులుగా అదే సమాజం మీద దాష్టికం చేయవచ్చును. ఉద్యామాలు, రాష్ట్ర విభజన అంశాలు ఇంతవరకూ ఊరుపేరులేని ఎందరో అనామకులకు కొత్త గుర్తింపు, కొత్త హోదాలను కల్పిస్తున్నాయంటే అవి ఏ స్థాయికి దిగాజారేయో అర్ధం అవుతుంది.

 

 

రాజకీయ పార్టీల మద్య సంప్రదింపులతో పరిష్కారం కావలసిన ఇటువంటి సున్నితమయిన సమస్యని గోటితో పోయే దానిని గొడ్డలి వరకూ తీసుకువచ్చాయి. రాష్ట్రం విడిపోవాలా,వద్దా అనే పంచాయితీని అసలు కేంద్రం వద్దకి తీసుకుపోవడమే మొదటి తప్పు. సామాజిక,రాజకీయ,ఆర్దిక ఇత్యాది విషయాలపై సంపూర్ణ అవగాహన కలిగిన ఎందరో మేధావులు, సాంకేతిక నిపుణులు మనకి ఉండగా అటువంటి వారి సేవలు, సలహాలు తీసుకొని సమస్యని పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకపోగా, తమ స్వార్ద రాజకీయ ప్రయోజనాలకోసం సమస్యని కేంద్రం పైకి నెట్టేసి పరిష్కరించలేదని రాజకీయ పార్టీలు కేంద్రాన్ని నిందిస్తున్నాయిప్పుడు.

 

 

మన రాష్ట్రం సమస్యని మనమే కూర్చొని పరిష్కరించుకొనేందుకు ఆసక్తి చూపనప్పుడు కేంద్రాన్నితప్పు పట్టడం కూడా తప్పే అవుతుంది. మన రాజకీయ ప్రయోజనాలు మనకి ముఖ్యమయినప్పుడు దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీకి కూడా తన ప్రయోజనాలు తనకీ ముఖ్యమే అని మన రాజకీయ పార్టీలు గ్రహించాలి. కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యని ఎన్నికల వరకు సాగదీసి ప్రయోజనం పొందాలని చూస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే, అదే తమకీ మేలనే ఆలోచన చేస్తున్నాయి. అందుకే, కేంద్రం ప్రకటన వెలువడగానే రాబోయే ఎన్నికల గురించి మాట్లాడటం మొదలుపెట్టాయి.

 

 

 ఒక తీవ్ర సమస్య మన రాష్ట్రాన్ని ఇంతగా వేదిస్తున్నపుడు దానిని ఏవిదంగా పరిష్కరించావచ్చును, అందుకు మనం ఏమి చేయాలి అని ఏరాజకీయ నాయకుడు, ఏ పార్టీ గానీ మాట్లాడటం లేదిప్పుడు. ఒక వైపువారు ఓడినట్లు,మరొక వర్గంవారు గెలిచినట్లు భావిస్తున్నారు తప్ప, సమస్య పరిష్కారం చేసుకోలేకపోయమనే విచారం ఎవరికీ కలగలేదు. తద్వారా రాష్ట్రం మరింత సమస్యలలో చిక్కుకొంటుందనే ఆలోచన, భయం కూడా ఎవరిలో లేదు. ఎవరి స్వార్ద రాజకీయ ప్రయోజనాలు వారివే. రాష్ట్రం, ప్రజల గురించి ఆలోచించే అవసరం, ఆసక్తి, ఓపిక ఎవరికీ లేవు.

 

 

మన రాజకీయ పార్టీలలో ఈ సమస్యని చిత్తశుద్దితో పరిష్కరించాలని ఆలోచన కలగనంతవరకూ కేంద్రం మరెంత కాలం చర్చలు జరిపినా, మరెన్ని సమావేశాలు నిర్వహించినా కూడా ఈ సమస్యకి పరిష్కారం దొరకడం కూడా కష్టమేనని చెప్పక తప్పదు.

 

 

ఇప్పటికయినా విజ్ఞత చూపి, బేషజాలు, స్వీయ రాజకీయ ప్రయోజనాలు, విద్వేషాలు పక్కన పెట్టి మన రాజకీయ పార్టీలు సమస్య పరిష్కారానికి కృషిచేస్తే తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. అయితే, మన రాజకీయ పార్టీలనుండి ఇంత ఆశించడం దురాశే అవుతుందని మనకి తెలుసు. ఇటువంటి రాజకీయనాయకుల చేతుల్లో ఉన్న మన రాష్ట్రాన్ని ఇక దేవుడే కాపాడాలి.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.