వైఎస్సాఆర్ కాంగ్రెస్ మీద చంద్రబాబు ఛలోక్తులు
Publish Date:Oct 3, 2012
Advertisement
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు హుషారొచ్చింది. మీకోసం వస్తున్నా 117రోజుల యాత్రలో భాగంగా బాబు అనంతపురం జిల్లాలో పర్యటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పిల్ల కాంగ్రెస్ అని వ్యంగ్యోక్తిని వదిలారు. అసలే పాదయాత్రలకు మద్దతు కూడగడుతున్నారని తెలిసి అప్రమత్తమవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తన వ్యంగ్యోక్తి ద్వారా బాబు నిద్ర లేపినట్లు అయింది. ఈ పాదయాత్రను ఎదుర్కోవాలి అని ఆ పార్టీ ఇప్పటికే సన్నాహాలు చేసుకుంటోంది. ఆ విషయం తెలియని బాబు పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు వ్యంగ్యోక్తులు, ఛలోక్తులు అప్పటికప్పుడు వదులుతున్నారు. మరి ఎంఎ పాలిటిక్స్ చదివిన చంద్రబాబు అకస్మాత్తుగా పరిస్థితిని బట్టి విమర్శలను మార్చటంలో దిట్ట అని ఎప్పటి నుంచో పేరు గడించారు కదా! అయితే ఈ విమర్శలను, వ్యంగ్యోక్తులను వదిలేటప్పుడు పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుండేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. తమ వంటి పిల్ల కాంగ్రెస్ లేకపోతే ఉపఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ చేతిలో దారుణమైన ఓటమిని బాబు చవిచూడాల్సి వచ్చేదని గుర్తుంచుకోవాలని వారు కోరుతున్నారు. 17అసెంబ్లీ స్థానాలకు 15స్థానాలు సాధించుకున్న తాము పిల్లకాంగ్రెస్ అయితే వెన్నుపోటు ద్వారా అధికారం కైవసం చేసుకున్న బాబు మాటేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యక్షంగా బాబు ప్రసంగాలపై అప్పటికప్పుడే సమాధానం ఇచ్చేందుకు వైకాపా సిద్ధమవుతోంది.
http://www.teluguone.com/news/content/tdp-president-24-17875.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





