విశాఖలో దోపిడీ దొంగల బీభత్సం
Publish Date:Oct 4, 2012
Advertisement
విశాఖను దోపిడీ దొంగలు గజగజ లాడిస్తున్నారు. పూటకో దొంగతనం చేస్తూ ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు .చైన్ స్నాచింగ్లు, కిడ్నాపులు, సైబర్నేరాలు, వైట్ కాలర్ నేరాలు సర్వ సాధారణ మయిపోయాయి. పూటకో చిట్ఫండ్ సంస్థ ప్రజల డబ్బుతో బోర్డు తిప్పేస్తున్నారు. ఇదివరలో విశాఖపట్టణం మామూలు పట్టణంలాగానే వుండేది అయితే ప్రభుత్వం గ్రేటర్ విశాఖగా మార్చిన తర్వాత విశాఖ పరిధి విస్తరించింది. పరిశ్రమలు పెగిగాయి నగర జనాభా 20 లక్షలకు చేరింది. అయితే అందుకు తగ్గట్టుగా పోలీస్ స్టేషన్లు పెరగలేదు. అందునా నగర శివార్లలో మరీ తక్కువగా పోలీస్ స్టేషన్లు ఉండటంతో దొంగలు విజృంభిస్తున్నారు. ఇదివరలా తాళాలేసిన ఇళ్లను మాత్రమే దోచుకొనడంలేదు. పగలు ఇంట్లో అందరూ ఉండగానే వారు భయోత్పాదం సృష్టించి అందినంతా దోచుకుంటున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న నగల దుకాణంలో పట్టపగలు దుకాణ యజమానిని తీవ్రంగా గాయపరచి బంగారం ఎత్తుకు పోయారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని అతని కొడుకును తీవ్రంగా గాయపరచి వారు పెద్దఎత్తున నగదు, నగలు దోచుకున్నారు. ఈ ఘటనలో రియల్ ఎస్టేట్ వ్యాపారి అతని కొడుకు హత్యకు గురిఅయ్యారు. అడపాదడప పోలీసులు వచ్చి బెంగాల్, మహారాష్ట్ర , ఇరానీ, బీహారీ దోపిడి దొంగల ముఠా అని చెబుతూ నలుగురిని అరెస్టు చేసి మీడియా ముందుకు తెస్తున్నారు తప్ప కట్టు దిట్ట మైన భద్రతా ఏర్పాట్లు చేయడం లేదు సరికదా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమీషనర్ పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి దోపిడి దొంగలనుండి సత్వరమే రక్షణ కల్పించాలని కోరుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/dacoities-24-17885.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





