బైర్రెడ్డి రాజకీయభవిష్యత్తు ఏమిటీ? టీజీ సాయంతో కాంగ్రెస్ నీడన చేరుతారా?
Publish Date:Oct 3, 2012
Advertisement
రాయలసీమను ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండుతో అనంతపురం నుంచి యాత్ర ప్రారంభించిన రాయలసీమహక్కుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్ బైర్రెడ్డి రాజశేఖరరెడ్డి రాజకీయ భవిష్యత్తు డోలాయమానంలో పడిరది. ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్రకార్యదర్శి పదివిలో ఇంత వరకూ కొనసాగారు. అయితే తమ పార్టీ అధినేత చంద్రబాబు మీకోసం వస్తున్నా యాత్ర ప్రారంభించే రోజునే తానూ యాత్ర ప్రారంభించాలని బైర్రెడ్డి నిశ్చయించుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఈయన్ని వదిలేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ విషయం ముందుగా తెలుసుకున్న బైర్రెడ్డి తాను ముందుగా రాజీనామా పంపించారు. కనీసం రాయలసీమ ప్రత్యేకరాష్ట్రం కోసం రాజీనామా చేశానని చెప్పుకోవటానికి రాజశేఖరరెడ్డి ఇది అవకాశంగా తీసుకున్నారు. ఈ అవకాశం వల్ల తాను తెలుగుదేశం పార్టీకి దూరమైన విషయం బైర్రెడ్డికి తెలుస్తూనే ఉంది. అయితే ఆయన్ని కాంగ్రెస్లోకి ఆహ్వానించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ దశలో రాయలసీమ ప్రాంతానికి చెందిన చిన్న, భారీనీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ కూడా బైర్రెడ్డి మాదిరిగా సీమ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని గొంతు విప్పారు. తనతో పాటు రెండో గొంతు కలిపిన మంత్రి వెంకటేష్ రాయలసీమ హక్కుల వేదిక నేత కూడా అవటంతో బైర్రెడ్డిని ఆయనే కాంగ్రెస్పార్టీలోకి తీసుకువెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మంత్రి వెంకటేష్ సీమకు ప్రత్యేకప్యాకేజీ కావాలని డిమాండు చేస్తున్నారు. దీంతో ఒకరకంగా కాంగ్రెస్కు బైర్రెడ్డి దగ్గరైనట్లు వాతావరణం కనిపిస్తున్నా మరోవైపు మొత్తం సీమపై పట్టుసాధించాలంటే కొంత కాలం తన రాజకీయ భవిష్యత్తు పణంగా పెట్టాలని ముఖ్యసలహాదారులు ఆయనకు సలహా ఇచ్చారట. ఈ సలహా వల్ల ఆయన ఎంత వరకూ కాంగ్రెస్కు దగ్గరవుతారన్నది ఇప్పుడే తేల్చలేకపోతున్నారు. కానీ, తెలుగుదేశం పార్టీకి దూరమయ్యాక మరో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఒక్కటే అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/seperate-rayalaseems-agitation-24-17874.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





