తూర్పులో తెలుగుదేశం కూటమిదే జేగంట!

Publish Date:Apr 5, 2024

Advertisement

రాష్ట్ర రాజకీయాలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాది ఒక విశిష్ఠ స్థానం. ఈ జిల్లాలో ఆధిక్యత సాధించిన పార్టీయే రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపడుతుందని రాజకీయవర్గాలలో ఒక గట్టి నమ్మకం వచ్చింది. స్వాతంత్రానంతరం ఎన్నికలు జరిగిన ప్రతి సారీ ఆ నమ్మకం నిజమని రుజువు అవుతూనే వస్తోంది.  తూర్పుగోదావరి ఫలితాలే  రాష్ట్రంలో అధికార పార్టీని నిర్ణయిస్తాయన్నది ఒక నమ్మకం. అందుకే  తూర్పు ఏటైతే రాష్ట్రం కూడా అటే’ అంటారు రాజకీయ పండితులు. తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది అసెంబ్లీ  నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రం మొత్తంలో అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న జిల్లా ఇదే.  ఇక్కడ ఏ పార్టీకి మెజారిటీ వచ్చిందో అది పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ స్థానాలను గెలుచుకుని అధికారంలోకి రావడం ఆనవాయితీగా వస్తున్నది.  

రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికలలో అంటే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలోని 19 నియోజకవర్గాలకు గానూ 14 నియోజకవర్గాలలో విజయం సాధించింది.  ఆ ఎన్నికలలో తెలుగుదేశం రాష్ట్రంలో మెజారిటీ స్థానాలలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. అదే విధంగా  2019 ఎన్నికల్లో  వైసీపీ  పద్నాలుగు నియోజకవర్గాలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికారాన్ని కైవశం చేసుకుంది. ఇప్పుడు 2024 ఎన్నికలలో పరిస్థితి తెలుగుదేశం కూటమికే అనుకూలంగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ వెలువడిన పలు సర్వేలలో కూడా అదే తేలింది.  రాష్ట్రంలో అధికారం చేపట్టబోయే పార్టీ ఏది అన్న దానికి రాజకీయ పండితులు కూడా తూర్పు గోదావరి ఫలితాలనే ప్రామాణికంగా తీసుకుంటారు.

ఆ ప్రకారంగా చూస్తo ఈ సారి తూర్పులో తెలుగుదేశం కూటమి హవా కనిపిస్తోంది. దీంతో రాష్ట్రంలో రాబోయేది తెలుగుదేశం కూటమి ప్రభుత్వమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక జిల్లాలో  తుని, అనపర్తిలో  అసెంబ్లీ నియోజకవర్గాలలో మాత్రమే వైసీపీకి ఒకింత సానుకూల పరిస్థితులు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.  తునిలో యనమల కుటుంబంలో  విభేదాల కారణంగా   తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. వాస్తవానికి  తుని  తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచీ 2004 వరకు జరిగిన ఆరు ఎన్నికల్లో  తెలుగుదేశం తునిలో విజయం సాధించింది.  ఆ తరువాత జరిగిన అన్ని ఎన్నికలలోనూ ఓడిపోతూ వస్తోంది. ఇక అనపర్తి విషయానికి వస్తే..  పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం బీజేపీకి వెళ్లడం కూటమికి ఒకింత ఇబ్బందికరంగా మారింది. అదే  వైసీపీకి  అనుకూలంగా మారింది.  

ఇక్కడ తెలుగుదేశం తరఫున బలమైన అభ్యర్థి  నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉన్నప్పటికీ, మిత్ర ధర్మంలో భాగంగా తెలుగుదేశం ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. దీంతో నియోజకవర్గ తెలుగుదేశం కేడర్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇక్కడ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రెబల్ గా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనపర్తి విషయంలో కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య చర్చ జరుగుతోందని అంటున్నారు. ఆ చర్చలు ఫలించి అనపర్తి నుంచి తెలుగుదేశం అభ్యర్థే పోటీలోకి దిగితే.. కూటమి విజయానికి తిరుగు ఉండదు కానీ..ప్రస్తుతానికి అయితే ఇక్కడ కూటమి వెనుకబాటులోనే ఉందని చెప్పాలి.  ఈ రెండు నియోజకవర్గాలూ మినహాయిస్తే జిల్లాలో తెలుగుదేశం కూటమి ముందంజలో ఉందని సర్వేలు చెబుతున్నాయి.  దీనిని బట్టి రాష్ట్రంలో అధికారం చేపట్టబోయేది తెలుగుదేశం కూటమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
కాకినాడ జిల్లాలోని రంగరాయ వైద్య కళాశాల్లో లైంగిక వేధింపుల ఘటనపై నలుగురు ఆర్ఎంసి ఉద్యోగులు సస్పెన్షన్ విధించారు.
రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, పరిపాలన అంశాలను సీఎం గవర్నర్‌కు వివరించారు.
మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి ఖమ్మం కోర్టులో ఊరట లభించింది. 2014 లో ఆమెపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కోర్టు కొట్టివేసింది.
నంద్యాల శిల్పం సైకిలెక్కనుందా? అన్న టాక్ వినిపిస్తోంది. కారణం.. ఆయన ఓడిపోయినప్పటి నుంచీ వైసీపీ అంటేనే చిన్న చూపు ఏర్పడిందట. అంతే కాదు.. ఎప్పుడో ఎక్కడో ఒక సారి పార్టీ ఆఫీసుకు వచ్చి వెళ్తున్నారట. దీంతో నంద్యాలలో పార్టీ క్రమంగా పట్టు తప్పుతున్నట్టు ఇంటర్నల్ టాక్.
బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కల్తీ కల్లు ఘటనకు బాధ్యుడిగా, ఎక్సైజ్ సీఐ వేణు కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌, భారత్‌ మధ్య మూడో టెస్టులో టీమిండియా పేసర్ల విజృంభణతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్ 387 పరుగులకు ఆలౌట్ అయింది.
తెలంగాణలో ఈనెల 14న తుంగతుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా కొత్త రేషన్‌కార్డుల పంపిణీ ఉంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
బిగ్ బ్యూటిఫుల్ బిల్‌పై ఇటీవల సంతకం చేసిన అమెరిక అధ్యక్షుడు ట్రంప్ భారత్ సహా ఇతర దేశాలకు మరో షాక్ ఇచ్చారు. వీసా ఫీజులను భారీగా పెంచారు. ఈ ఫీజు వల్ల భారతీయులపై సైతం తీవ్ర ప్రభావం చూపనుంది.
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కైప ఎస్సీ కాలనీలో కుక్కల దాడిలో క్రిందపడి చిన్నారి మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.
అధికారంలో ఉన్నంత కాలం తప్పొప్పులు, మంచిచెడులు అన్న తేడా లేకుండా ఇష్టారీతిగా బూతులుతో రెచ్చిపోయిన మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కోడాలి నాని, వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత మాట్లాడడమే మరిచిపోయాడా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేంత నిశబ్దాన్ని.. అదేనండీ మౌనాన్ని పాటిస్తున్నారు.
ఆపరేషన్ కగార్ దెబ్బకు మవోయిస్టులు దిగివచ్చారు. ఛత్తీస్‌గఢ్‌ నారాయణపూర్ జిల్లా ఎస్పీ ప్రభాత్ కుమార్ ఎదుట 22 మంది మవోలు లోంగిపోయారు. వీరిలో 8 మంది మహిళలు ఉన్నారు.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్‌ భార్గవ సిట్‌ ఎదుట హాజరయ్యారు. తన అనారోగ్యం రీత్యా రాలేనని సిట్ విచారణకు హాజరుకాలేనని ఉదయం ఆయన విచారణాధికారులకు సమాచారం పంపించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఇవ్వడం తమ విజయమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్పందించారు. బీసీ రిజర్వేషన్లు కవితకు ఏం సంబంధం అని ప్రశ్నించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.