కాంగ్రెస్ గూటికి కిళ్లి కృపారాణి.. షర్మిలలో వైఎస్సార్ ను చూస్తున్నానని వ్యాఖ్య

Publish Date:Apr 5, 2024

Advertisement

కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ కిల్లి కృపారాణి వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చెయ్యడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. వైసిపి లో తనకు అన్యాయం కన్నా.. అవమానాలు ఎక్కువ జరిగాయని చెప్తూ కన్నీటి పర్యంతం అయ్యారు ఈ కేంద్ర  మాజీ మంత్రి.. అసలు కృపారాణిని వైసిపి ఎలా ట్రీట్ చేసింది.. ఇప్పుడు ఆమె రాజీనామా ఎంత మేర ప్రభావం చూపనుంది..?
కిల్లి కృపారాణి.. ఉత్తరాంధ్ర ప్రాంతం శ్రీకాకుళం జిల్లా కు చెందిన సీనియర్ పొలిటీషియన్.. శ్రీకాకుళం ఎంపిగా అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న అప్పటి  తెలుగుదేశం నేత, కేంద్ర మాజీ  మంత్రి కింజరాపు ఎర్రంనాయుడుపై కాంగ్రెస్ నుండి పోటీ చేసి భారి మెజారిటి తో ఓడించి అప్పట్లో పెను సంచలనమే సృష్టించారు కృపారాణి.. అదిమొదలు.. ఆమె రాజకీయ ప్రస్థానం అప్రతిహాతంగా దూసుకుపోయింది. కృపారాణి క్యాపబిలిటి గుర్తించిన సోనియా గాంధీకి కృపారాణి మరింత దగ్గరయ్యారు.. అందుకే కేంద్ర సహాయ మంత్రి పదవి సైతం కృపారాణి కి చేరువ చేశారు. అయితే రాష్ట్ర విభజన అంశంలో పాపాన్ని మూటగట్టుకుని ఒక్కసారి పతన దశకు చేరుకున్న ఎపి కాంగ్రెస్ లో అందరు నేతలు బయటకు వెళ్ళినా కృపారాణి చాలా కాలం ఆ  పార్టీ లో ఉన్నారు. ఓ వైపు కృపారాణి కాంగ్రెస్ లో కొనసాగినా.. అప్పట్లో వై.ఎస్.జగన్మోహనరెడ్డి  వైసిపి స్థాపించిన తొలినాళ్ళలో చేపట్టిన ఓదార్పు యాత్ర శ్రీకాకుళం జిల్లా పర్యటనలో సైతం కృపారాణి భర్త రామ్మోహన్ అన్నీ తానై చూసుకున్నారు. అలా వైకాపా కు ముందు నుండి దన్నుగా నిలిచిన కుటుంబంగా కిల్లి ఫ్యామిలి పేరు సంపాదించుకుంది. కానీ వైసిపి లో చేరడానికి మాత్రం కృపారాణి చాలా కాలం టైం తీసుకుంది. జగన్ నుండి పిలుపు వస్తుందని 2014 నుండి 2019 వరకూ ఎదురుచూసిన కృపారాణి ఎంతకూ అటువైపుగా ఎలాంటి కబురు లేకపోవడంతో అనూహ్య పరిణామాల మధ్య 2019 ఎన్నికలకు నెల రోజుల ముందు వైసిపి కండువా కప్పుకున్నారు.

జగన్ ఓదార్పు యాత్ర సమయంలో కాంగ్రెస్ పార్టి అధిష్టాన నిర్ణయం కాదని వైసిపి సంస్థాగత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న తమకు పార్టీలో రెడ్ కార్పెట్ ఉంటుందని భావించి జాయిన్ అయిన కృపారాణికి.. ఇన్నేళ్ళు అయినా.. సాధారణ కార్యకర్త లానే ట్రీట్ చేసింది తప్ప చెప్పుకోతగ్గ పోస్టింగ్ ఒక్కటి కూడా వైసిపి ఇవ్వలేదు.. మధ్యలో జిల్లా పార్టీ అధ్యక్షురాలి పదవి ఇచ్చినా.. అది కేవలం కొన్ని నెలలు మాత్రమే పరిమితం చేసి.. తరువాత ఆమెకు తెలియకుండానే ధర్మాన కృష్ణదాస్ కు ఆ పదవిని బదిలీ చేసేశారు.  పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా భాధ్యతలు నిర్వర్తించిన సమయంలో సైతం కృపారాణి మాటకు పార్టీలో విలువ  అంతంతమాత్రమే అని చెప్పాలి..

జిల్లా అధ్యక్షురాలి పదవిని వేరొకరికి ఇచ్చేసిన తరువాత.. పార్టీ నామినేటెడ్ పదవుల్లోనూ, నూతన రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యుల  ప్రస్తావన వచ్చినప్పుడు రాష్ట్రంలోని మీడియా అంతా కూడా ముందు కృపారాణి పేరే ఉంటుందని వార్తల కనిపించేవి.. అయితే అప్పుడు కూడా చివరికి కృపారాణి కి మొండి చెయ్యే మిగిలేది.

అప్పట్లో జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ మోహన్ రెడ్డిని కలిసే వి.ఐ.పి లిస్టు లో కూడా కృపారాణి పేరు లేకపోవడం, జగన్ కలిసేందుకు వచ్చిన సమయంలో కృపారాణి ని జిల్లా పోలీసులు అడ్డుకోవడం, అవమాన భారంతో ఏడుస్తూనే ఆమె అక్కడి నుండి వెనుతిరగడం పెద్ద సంచలనంగా మారింది.  

జరగాల్సిన అవమానాలు అన్నీ జరిగిపోయాయి..  సార్వత్రిక ఎన్నికలకు సమయం అసన్నమైన సమయంలో.. ఇక అన్నీ సర్దుకుంటాయని కృపారాణి భావించారు. తనకు పార్టీ అందిస్తుంది అనుకున్న పదవులు అన్నీ కూడా ఫిల్ అయిపోయాయి.. ఇక మిగిలించి శ్రీకాకుళం పార్లమెంట్ స్థానమే కదా.. ఆల్రేడి శ్రీకాకుళం పార్లమెంట్ బరిలో పలుమార్లు పోటీ చేసి ఒకసారి గెలిచిన అనుభవం ఉన్న తనకే ఈ టికెట్ అని గంపెడాశలు పెట్టుకున్న కృపారాణికి చివరికి అదికూడా దక్కలేదు. శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్ధిగా పేరాడ తిలక్ పేరు ప్రకటించినప్పటికీ కృపారాణి గడచిన కొద్ది రోజులుగా సైలెంట్ గానే ఉన్నారు.

జిల్లా లో నేతలు అందరూ ఎవరికీ వారు ఎన్నికల పనుల్లో నిమఘ్నమయిపోతు.. కనీసం తన సపోర్ట్ కూడా ఎవరూ అడగకపోవడం కృపారాణిని, ఆమె క్యాడర్ ను మరింత నీరు గార్చింది. జగన్ మోహన రెడ్డి తన తమ్ముడు.. ఇది తన తమ్ముడి పార్టీ అని ఎప్పుడూ చెప్పుకునే కృపారాణి.. పార్టీ లో జరుగుతున్న వరుస అవమానాలు, అన్యాయాలు చూసి సహించలేకపోయారు.. ఇన్ని జరుగుతున్నా జగన్మోహన రెడ్డి నుండి కాని, అధిష్టానం లోని పెద్దల నుండి కానీ కనీస ఓదార్పు, భరోసా లేకపోవడంతో తన విధేయతకు ఉన్న వీరతాడును తీసేశారు..    రాజీనామా చేసేశారు...

రాజీనామా ప్రకటిస్తూ కృపా రాణి ప్రెస్ మీట్ లో కన్నీరు కార్చడం.. ఆమెకు జరిగిన అవమానాలు అన్నీ మీడియా ముందు ఏకరువు పెట్టడం.. ఇప్పుడు ఇవే రాష్ట్రంలో సంచలనంగా మారాయి. తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటాను అని చెప్పిన కృపారాణి తిరిగి కాంగ్రెస్ పార్టీ లో చేరారు.  కడప జిల్లాలో ప్రచారంలో భాగంగా కిళ్ళి కృపారాణికి కండువా కప్పి షర్మిల కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. కడప పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటిస్తున్న షర్మిల వద్దకు చేరుకున్న కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ సందదర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ కోసం ఎంతో కష్టపడ్డానని, ఉత్తరాంధ్రలో పార్టీని నిలబెట్టానని చెప్పారు. అలాంటి తనను జగన్ పక్కన పెట్టారన్న కృపారాణి కష్టపడ్డా తనకు గుర్తింపు లేదని చెప్పారు. తమకు వైఎస్సార్ దేవుడు అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ది అని అన్నారు. వైఎస్సార్ ను వైఎస్ షర్మిల లో చూస్తున్నామని అన్నారు. షర్మిలమ్మ న్యాయకత్వం లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వస్తుందన్నారు. జగన్ ఒక నియంత అని, ఈ నియంత ను గద్దె దించాలని, షర్మిలమ్మ కి కడప ఎంపీగా ఇక్కడ ప్రజలు అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు. 

 ఈసారి అసెంబ్లీ కి పోటీ చేస్తానని గతంలో తెలుగు వన్ కు ఇచ్చిన ఇంటర్వ్యులో స్పష్టం చేసిన కృపారాణి.. టెక్కలి అసెంబ్లీ బరిలో నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. టెక్కలి లో అభ్యర్ధి ప్రకటించకపోవడం వెనుక మతలబు ఇదే అయ్యే అవకాశం ఉంది. టెక్కలిలో కృపారాణి అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేస్తే కనుక.. అది వైసిపి కి పెద్ద ఎఫెక్ట్ లానే కనిపిస్తోంది. ఇన్నాళ్ళు వైసిపి తరపున తన కోటరీని పెంచుకున్న కృపారాణి.. తన వర్గం ఓట్లను ఇప్పుడు కాంగ్రెస్ కు బదిలీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. టెక్కలి లో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గెలుపును అడ్డుకోవడానికి అనేక వ్యూహాలు రచిస్తున్న వైకాపా అధిష్టానానికి ఇప్పుడు కృపారాణి రూపంలో స్పీడ్ బ్రేకర్ అడ్డు వచ్చింది. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న ఈ తరుణంలో ఈ స్పీడ్ బ్రేకర్ ను దాటి మళ్ళీ వేగం పుంజుకోవాలి అంటే వైసిపి చాలానే కష్టపడాలి..

By
en-us Political News

  
మాజీ మంత్రి హరీశ్‌రావుకు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో సికింద్రాబాద్‌ సన్‌ సైన్‌ ఆసుపత్రిలో హరీశ్‌రావు చేరారు
అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో అరెస్టైన జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు జైలు నుంచి విడుదలయ్యారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో హాజరైన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనంతరం నేరుగా తెలంగాణ భవన్ చేరుకున్న మాజీ మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకు పోయిన వందలాది మంది మన విధ్యార్ధులను మన విదేశాంగ శాఖ ఆ దేశంతో దౌత్య పరమైన చర్చలు జరిపి, మన విధ్యార్ధులను సురక్షితంగా స్వదేశానికి తీసుకు వచ్చింది.
వైసీపీ మాజీ మంత్రి మాజీ మంత్రి పేర్నినానికి బిగ్ షాక్ తగిలింది. నూజీవీడు కోర్టు ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఫార్ములా-ఈ కార్‌ కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు అధికారులు ఆయనను విచారించారు.
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపటి నుంచి రైతుల అకౌంట్లలో రైతు భరోసా నిధులు జమ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,034 రైతు వేదికల్లో రైతునేస్తం’కార్యక్రమం ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటన కోసం ఉపయోగించే హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇదే హెలికాప్టర్ ను రాష్ట్రపర్యటనలో కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ కోసం కేటాయించారు. ఆయన తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లేందుకు సోమవారం (జూన్ 16) హెలికాప్టర్ వినియోగించాల్సి ఉంది.
వైయస్సార్ కడప జిల్లాలో అరుదైన పుట్టగొడుగు కనిపించింది. పుట్టగొడుగులు మామూలుగా అయితే దాని బరువు 50 గ్రాములులేదా మహా అంటే వంద గ్రాముల లోపే ఉంటాయి.
2021 నవంబర్ 15వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బండి సంజయ్ ఒక ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో ఆయన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో భారీ వాహనాలతో, ముందస్తు అనుమతి లేకుండా కాన్వాయ్‌తో ర్యాలీ చేపట్టారని ఎన్నికల అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆపరేషన్ కగార్ కు నిరసనగా ఈ నెల 20న రెండు తెలుగు రాష్ట్రాల బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఆపరేషన్ కగార్ పేరిట కేంద్రం అటవీ ప్రాంతాలలో మిలటరీ ఆపరేషన్ ద్వారా హక్కులను కాలరాస్తున్నదని దుయ్యబట్టింది.
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌‌కు జైలు వెళ్లాలని కుతూహలంగా ఉన్నట్లు ఉందని సీతక్క తెలిపారు.
భారత ప్రధాని మోదీ ప్రస్తుతం సైప్రస్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3ను ప్రధాని మోదీ అందుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.