తెదేపా, వైకాపాలలో ఏది బెస్ట్?

Publish Date:May 5, 2014

Advertisement

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితవ్యాన్ని తేల్చనున్న కీలకమయిన ఎన్నికలు రేపు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీతో సహా మిగిలిన అన్ని పార్టీలు ఈ ఎన్నికలలో నామమాత్రపు పాత్ర పోషిస్తాయని దాదాపు స్పష్టమయింది. అందువల్ల ఇక ఈ యుద్ధం ప్రధానంగా అభివృద్ధి మంత్రం పటిస్తున్న తెదేపా, వైకాపాల మధ్యనే జరగనుంది. రెండు పార్టీలు కూడా తాము మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపగలమని, సుపరిపాలన అందించగలమని, పేదల సంక్షేమం కోసం పాటుపడగలమని, ప్రత్యర్ధపార్టీకి ఓటేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని వాదించాయి. ప్రజలు కూడా వాటి వాదనలు ఆసాంతం విని వాటిని బేరీజు వేసుకొని రేపు తమ తీర్పు చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆ రెండు ప్రధాన పార్టీల బలాలు, బలహీనతలు మరొకసారి చూద్దాం.

 

తెలుగుదేశం పార్టీకి సానుకూలాంశాలు:

1.చంద్రబాబు కార్యదక్షత, సమర్ధమయిన పాలన అందించగల శక్తి, అనుభవం. పార్టీలో సమర్ధులు, పరిపాలనానుభవం గల నేతలు, నిర్మాణరంగంలో ఆరితేరిన ప్రముఖ రియాల్టర్లు, పారిశ్రామికవేత్తలు కలిగిఉండటం.

 

2. రాష్ట్రానికి అంతులేని సంపద అందిస్తున్న అక్షయపాత్ర వంటి హై-టెక్ సిటీ నిర్మాణం చేసినందున ఇప్పుడు సీమాంద్రాకు కూడా అటువంటి సంస్థలు, పరిశ్రమలు, మౌలిక వసతులతో కూడిన నగరం నిర్మించగల అనుభవం, శక్తి సామర్ధ్యాలు కలిగి ఉండటం.

 

3. విజయావకాశాలున్న బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవడం, దాని ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీతో మంచి సంబంధాలు కలిగి ఉండటం. ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా కేంద్రానికి మద్దతు ఇస్తూ రాష్ట్రాభివృద్ధికి అవసరమయిన నిధులను తెచ్చుకోగల నేర్పుకలిగి ఉండటం. బీజేపీతో పొత్తు పెట్టుకొన్నప్పటికీ దాని మతతత్వం మాత్రం తనకు అంటించుకోకుండా సెక్యులర్ విధానానికే కట్టుబడి ఉండటం. ముఖ్యంగా సమాజంలో అట్టడుగువర్గాలకు పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత ఈయడం.

 

ప్రతికూలాంశాలు:

1. సంక్షేమ పధకాలు, సబ్సీడీలు కొనసాగించడంలో అనాసక్తి. రాష్ట్రాభివృద్ధికి మూలమయిన వ్యవసాయం, కీలక పాత్ర పోషించే ప్రభుత్వోద్యోగులు పట్ల చిన్నచూపు.

 

2. అభివృద్దిని కేవలం పట్టణాలకే పరిమితం చేయడం. గ్రామీణాభివృద్ధి పట్ల అనాసక్తి.

 

3. ప్రాధమిక, మాధ్యమిక విద్యకంటే ఉన్నత విద్యలకే పెద్దపీట వేయడం. ప్రభుత్వ కళాశాలలు, ఆసుపత్రులను నిర్లక్ష్యం చేయడం. అయితే ఈ పొరపాట్లకు తెదేపా చాలా భారీ మూల్యం చెల్లించి ఇంతకాలం ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది కనుక, బహుశః ఇకపై చంద్రబాబు అటువంటి పొరపాట్లు చేయరని ఆశించవచ్చును.

 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలాంశాలు:

1. జగన్ యువనాయకత్వంలో సరికొత్త ఆలోచనలు, ప్రణాళికలతో రాష్ట్రాన్నిత్వరితగతిన అభివృద్ధి చేయగల అవకాశం. అతని తండ్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలను కొనసాగిస్తూ, ఆయన మొదలుపెట్టిన అనేక నీటి ప్రాజెక్టులను తప్పకుండా పూర్తి చేస్తాడనే ప్రజలలో నమ్మకం.

 

2. విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల పట్ల జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ఆసక్తి కలిగి ఉన్నందున ఆయా రంగాలలో త్వరితగతిన అభివృద్ధి అయ్యే అవకాశం.

 

3. నగరాలతో సమానంగా గ్రామీణాభివృద్ధి జరగాలనే తపన ఉన్నందున, మారుమూల పల్లెలకు అభివృద్ధి అయ్యే అవకాశాలు.

 

ప్రతికూలాంశాలు:

1. ఎటువంటి పరిపాలనానుభావం లేకపోవడం. అనుభవరాహిత్యం. దుందుడుకు స్వభావం. ఈ కారణంగా ప్రభుత్వాధికారులతో, ఉద్యోగులతో నిత్యం ఘర్షణ తప్పదు. తత్ఫలితంగా ప్రభుత్వ నిర్వహణలో వైఫల్యం చెందే అవకాశం.

 

2. ముఖ్యమంత్రి అయినప్పటికీ సీబీఐ కేసులు, చార్జ్ షీట్లు కారణంగా కోర్టుల చుట్టూ తిరగవలసి రావచ్చును. అతని మద్దతు కేంద్రానికి అవసరం లేకపోయినట్లయితే జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి రావచ్చును.

 

3. కేంద్రం ప్రభుత్వంతో సానుకూలంగా వ్యవహరించి నిధులు రాబట్టే బదులు మెడలు వంచి తీసుకు వస్తానని చెపుతున్నందున, నిత్యం ఘర్షణ పడితే కేంద్రం నుండి ఆశించిన స్థాయిలో నిధులు విడుదల కాకపోయే అవకాశం. తత్ఫలితంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితి.

 

4. జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డుని బట్టి చూస్తే, అవినీతి, అక్రమాలు సర్వత్రా వ్యాప్తి చెందే ప్రమాదం.

 

సమైక్యాంధ్ర, తెలంగాణా ఉద్యమాల కారణంగా రాష్ట్రంలో పాలన గాడి తప్పిన సంగతి ప్రజలందరికీ తెలుసు. రాష్ట్ర విభజన అనంతరం ఎటువంటి ప్రధాన ఆర్ధిక వనరులు లేని ఈ పరిస్థితుల్లో కూడా లక్షల కోట్లు వ్యయమయ్యే కొత్త రాజధానిని తప్పనిసరిగా, వీలయినంత త్వరగా పునర్నిర్ముంచుకోవలసిన ఆగత్యం కూడా ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధత, నిర్లక్ష్యం కారణంగా నిత్యావసర సరుకులు ధరలు, విద్యుత్ చార్జీలు అనూహ్యంగా పెరిగిపోవడంతో సామాన్యులు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు దుర్బర జీవితం గడుపుతున్నారు. ఏవిధంగా చూసినా రాష్ట్రంలో పూర్తి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 

ఇటువంటి క్లిష్టపరిస్థితులను చక్కబెట్టి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే అన్నివిధాల సమర్ధుడు, అనుభవశాలి, కేంద్రంతో సత్సంబంధాలు గల వ్యక్తినే ప్రజలు ఎన్నుకోవలసి ఉంటుంది. లేకుంటే ప్రజలు తమ కష్టాలకు మరొక ఐదేళ్ళు పొడిగింపు కోరుకొన్నట్లే అవుతుంది. అందువల్ల ప్రజలు అన్నిటికంటే ప్రధానంగా ‘సమర్ధత’ కే ప్రాధాన్యం ఇచ్చి సరయిన వ్యక్తిని, పార్టీనే ఎన్నుకోవలసి ఉంటుంది. అలాకాకుండా కులం వంటి బలహీనతలకు లొంగి అసమర్దుడికి పట్టం కడితే అందుకు ప్రజలు భారీగా మూల్యం చెల్లించుకోకతప్పదు. అందువల్ల చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగానే జాగ్రత్తపడటం మేలు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.