జగన్‌కి ఓటుతో బుద్ధి చెప్పాల్సిన తరుణమిది

Publish Date:May 7, 2014

Advertisement

 

 

 

రాష్ట్ర విభజన జరిగిన వెంటనే వచ్చిన ఈ ఎన్నికలు, ఇంతకాలం ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతూ, మోసగించిన రాజకీయ నాయకులకు తగిన బుద్ధి చెప్పేందుకు ఒక మంచి అవకాశాన్ని అందిస్తున్నాయి. ప్రజాభిప్రాయానికి వీసమెత్తు విలువనీయకుండా, పార్లమెంటరీ విలువలను తుంగలో తొక్కి మరీ రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ తీరును అందరూ గమనించారు. రాష్ట్ర విభజనతో తీవ్ర ఆందోళన చెందిన ప్రజలకు దైర్యం చెప్పి వారికి భరోసా ఇవ్వకపోగా, అటువంటి సమయంలో కూడా వారిని నిర్లజ్జగా ఓట్లు, సీట్లు కావాలని కోరుతూ బూటకపు సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసిన వైకాపాను ప్రజలు గమనించే ఉంటారు. చంద్రబాబుది రెండు కళ్ళు, కాళ్ళ సిద్ధాంతమని నాడు వెక్కిరించిన జగన్, షర్మిలలే ఆ తరువాత మాట మార్చి తమకు ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ మూడు సమానమని చెప్పిన సంగతిని ప్రజలు గమనించే ఉంటారు.

 

 

నాడు వైకాపా చేసిన సమైక్యాంధ్ర ఉద్యమానికి విభజన తరువాత మళ్ళీ కొత్త నిర్వచనం చెప్పడం ద్వారా అంతకాలంగా తాము చేసిన ఆ ఉద్యమమంతా భూటకమని, అది సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టి, వారి ఓట్లు రాల్చుకోవడానికేనని స్పష్టమయింది. ఆ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని ప్రత్యర్ధి పార్టీలను రాజకీయంగా దెబ్బ తీసి, ఇతర పార్టీలలో బలమయిన నేతలను తమ పార్టీలోకి ఆకర్షించడాన్ని ప్రజలు గమనించే ఉంటారు. ప్రజల మనోభావాలతో ఆటలాడుకొన్న వైకాపా ఆ తరువాత ఎన్నడూ కూడా సమైక్యాంధ్ర గురించి మాట్లాడింది లేదు. కానీ ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లు ఎన్నికల గంట మ్రోగిన తరువాత ఎటువంటి పాలనానుభావం కానీ, కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఏ జాతీయ పార్టీతో సఖ్యత గానీ లేని జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అవగానే రాష్ట్రాన్ని ఎవరూ చేయలేనంతగా అభివృద్ధి చేసి, రాజధాని నిర్మిస్తామంటూ హామీలు గుప్పించారు.


ఇంతకాలంగా బూటకపు ఉద్యమాలతో ప్రజలను మభ్యపెట్టిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఐదు సంతకాలతో వారి దశదిశ కూడా మార్చేస్తానని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కూడా రాష్ట్ర విభజన సమయంలో నిఖచ్చిగా వ్యవహరించలేకపోయారు. కానీ ఆయన రెండు ప్రాంతాలలో కూడా తన పార్టీని కాపాడుకోనేందుకే ఆవిధంగా వ్యవహరించవలసి వచ్చింది. కానీ, ఆయన కూడా రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని ప్రజలందరికీ తెలుసు. రాష్ట్ర విభజన అనివార్యమని గ్రహించినందునే ఆయన సమన్యాయం చేయమని కోరుతూ పోరాడారు. అందుకే ఆయన పట్ల తెలంగాణా ప్రజలలో కూడా కొంత వ్యతిరేకత ఉంది. అంతే కాదు, కాంగ్రెస్ రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించగానే రాత్రికిరాత్రి తెలంగాణా నుండి వైకాపాలలాగా మూటాముల్లె సర్దుకొని బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డిలాగా బూటకపు సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయలేదు. తనకు 30యంపీ సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతానని హామీలు కూడా ఇవ్వలేదు. ఆయన మొదటి నుండి మాట మీదనే నిలబడి వైకాపా పెట్టిన అగ్నిపరీక్షలు ఎదుర్కొని నిలువగాలిగారు. కానీ విశ్వసనీయతకు మారుపేరని చెప్పుకొన్న వైకాపా దాని అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తికాగానే మళ్ళీ తెలంగాణాలో పోటీ చేసేందుకు ఏవిధంగా సిద్దమయిపోయారో ప్రజలే స్వయంగా చూశారు.


అపార రాజకీయ అనుభవజ్ఞుడయిన చంద్రబాబు మొదటే కొంచెం ధైర్యం చేసి, తెలంగాణా ప్రజల ఆకాంక్షలు, వారి సమస్యలు, అవసరాలు, అక్కడి రాజకీయ సమస్యలు సీమాంధ్ర ప్రజలకు వివరించి, రాష్ట్ర విభజన అనివార్యమని నచ్చజెప్పి ఉండి ఉంటే, నేడు రెండు రాష్ట్రాలలో కూడా తేదేపాకు ఎదురే ఉండేది కాదేమో! కానీ ఆయన ఎందుకో ఆ నాడు ధైర్యం చేయలేకపోయారు. అది ఆయన బలహీనతగా భావించాల్సి ఉంటుంది తప్ప ప్రజలను మోసపుచ్చడానికి కాదని ప్రజలకూ తెలుసు. ఇక మంచికో చెడుకో, కష్టమో, నష్టమో రాష్ట్రవిభజన జరిగిపోయింది. ఇటువంటప్పుడు అన్నివిధాల అనుభవజ్ఞుడు, కేంద్రంతో చక్కటి స్నేహ సంబంధాలు కలిగి రాష్ట్రాభివృద్ధికి అవసరమయిన నిధులను తేగలవాడికే ప్రజలు ఓటు వేసి గెలిపించుకోవలసి ఉంది. అలాకాదని ఏబీసీడీలు నేర్చుకొంటున్న వ్యక్తుల చేతికి రాజ్యాధికారం కట్టబెడితే, ఆవ్యక్తి అన్నీ నేర్చుకొనేవరకు చేసే తప్పులకు, తప్పుడు నిర్ణయాలకు ప్రజలే మూల్యం చెల్లించవలసి ఉంటుంది.


అందువలన కులం,మతం, డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగిపోకుండా సరయిన వ్యక్తికి, పార్టీ చేతుల్లోనే రాష్ట్రాన్ని పెట్టాల్సి ఉంటుంది. అదికూడా తిరుగులేని మెజార్టీతో అధికారం కట్టబెట్టినప్పుడే కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదేళ్ళపాతు సుస్థిరమయిన పాలన జరిగి, రాష్ట్రం త్వరిత గతిన అభివృద్ది చెందే అవకాశం ఉంటుందని ప్రజలు గుర్తుంచుకోవాలి.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.