పవన్ కళ్యాణ్ వాదనతో ఆత్మరక్షణలో పడిన జగన్

Publish Date:May 5, 2014

Advertisement

 

తెదేపా-బీజేపీ కూటమి తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్, మాజీ సీయం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి, అతని కొడుకు జగన్మోహన్ రెడ్డిలపై చేస్తున్నఆరోపణలు, చేస్తున్న వాదనలతో వైకాపా డిఫెన్స్ లో పడింది. ఇక రాష్ట్ర విభజనకు కారణం మాజీ సీయం. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డిల భూ, ధన, అధికార దాహమే కారణమని, రాజశేఖర్ రెడ్డి హయాంలో తెలంగాణా లో విచ్చలవిడిగా జరిగిన అవినీతి, భూకబ్జాలు, తెలంగాణా వినాశనమే అస్క్కడి ప్రజలలో వేర్పాటువాదానికి బీజం వేసిందని, నాటి నుండే తెలంగాణా ప్రజలు సీమాంధ్ర పాలకులను, ప్రజలను కూడా అసహ్యించుకోవడం మొదలు పెట్టరని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. ఆ తండ్రీ కొడుకుల కబంధ హస్తాల నుండి బయటపడేందుకే తెలంగాణా ప్రజలు రాష్ట్రం నుండి విడిపోవాలని పట్టుబట్టారని పవన్ కళ్యాణ్ చేస్తున్న వాదనలు సీమంధ్ర ప్రజలనే కాదు తెలంగాణా ప్రజలను కూడా విపరీతంగా అక్కట్టుకొంటున్నాయి, ఆలోచింపజేస్తున్నాయి.

 

పవన్ చేస్తున్న ఈ ఆరోపణలను ఖండించడానికి వైకాపా నేతలు ప్రయత్నించినా, రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన అవినీతి వలన అనేకమంది అధికారులు, మంత్రులు, పారిశ్రామిక వేత్తలు కోర్టులు చుట్టూ నేటికీ ప్రదక్షిణాలు చేయడం ప్రజలకు కళ్ళెదుట కనిపిస్తూనే ఉంది. అయితే ఇదంతా కాంగ్రెస్, తెదేపాలు కలిసి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదగకుండా చేసేందుకు చేసిన కుట్ర అని వాదించవచ్చు. కానీ అమెరికా దర్యాప్తు సంస్థ యఫ్.బీ.ఐ., అక్కడి కోర్టులు కూడా టైటానియం కుంభకోణం కేసులో వైయస్స్ కు ఆత్మగా చెప్పుకొంటున్న కేవేపీ రామచంద్ర రావు అరెస్టు కోసం రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడం కూడా వారి కుట్రే అని జగన్, షర్మిల అనలేరు. అదే వారి అవినీతికి ఒక నిదర్శనం.

 

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలు, వాదనలతో సీమాంధ్ర ప్రజలు ఏమాత్రం ప్రభావితమయినా అది తమ తలరాతలను కూడా మార్చేసే ప్రమాదం ఉందని జగన్, షర్మిల చాలా ఆందోళన చెందడం సహజమే. అందుకే వారిరువురూ చాలా ఆవేశంతో మాట్లాడే పవన్ కళ్యాణ్ పై పిచ్చివాడి ముద్రవేసి, ఆయన మాటలను పిచ్చివాడి ప్రేలాపనలని కొట్టిపారేసే ప్రయత్నం చేస్తున్నారు.

 

ఆయన ఆవేశం వారికి పిచ్చితనంగా కనబడుతుంటే, ప్రజలకు మాత్రం అందులో అయన దేశభక్తి, రాష్ట్రం, దేశం బాగుపడాలనే తపన కనబడుతోంది. ఒకవేళ వారన్నట్లు ఆయన నిజంగా అర్డంపర్ధం లేకుండా పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడి ఉండి ఉంటే ఆయన సభలకు ఇసుకేస్తే రాలనంత జనాలు తరలి వచ్చేవారే కాదు. ఆయనను పట్టించుకొనేవారు కూడా కాదు. అనేక సీబీఐ కేసులు ఎదుర్కొంటూ, ఈ ఎన్నికలలో ఓడిపోతే జైలు పాలయ్యే ప్రమాద స్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇవి జీవన్మరణ పోరాటం వంటివి. మరోవిధంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు ఆయన తన కేసుల నుండి బయటపడేందుకు చేస్తున్న పోరాటమని చెప్పవచ్చును. అదే మాటను పవన్ కళ్యాణ్ కుండబ్రద్దలు కొట్టినట్లు చెపితే, దానిని జీర్ణించుకోవడం చాలా కష్టమే!

 

రాజశేఖర్ రెడ్డి హయాంలో నిరుపేదలకు అందిన సంక్షేమ ఫలాలకు, ప్రతిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా కొన్ని వందల రెట్లు భారీ మూల్యం చెల్లించారు. అదంతా జగన్మోహన్ రెడ్డి వద్ద పోగుబడిందని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. మరి ఇంత తార్కికంగా ఆయన చేస్తున్నఆరోపణలకు నేరుగా జవాబు చెప్పకుండా ఆయన పిచ్చివాడని ఎద్దేవా చేయడం ధనమధమే తప్ప మరొకటి కాదని చెప్పవచ్చును.

 

జగన్మోహన్ రెడ్డి నేటికీ చెట్టుపేరు చెప్పుకొని కాయలు అమ్ముకొంటున్నట్లు తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణం తాలూకు సానుభూతిని, ఆయన అమలుచేసిన సంక్షేమ పధకాలను చెప్పుకొనే ప్రజలను ఓట్లు కోరుతున్నారు. అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా ఆయనపైనే చేస్తున్న విమర్శలు, ఆరోపణలు జీర్ణించుకోవడం వైకాపాకు కష్టమే కాదు నష్టం కూడా. జగన్ నేటికీ సంజాయిషీ చెప్పుకొనే పరిస్థితిలోనే ఉన్నారు తప్ప, దైర్యంగా గుండెల మీద చేయేసుకొని తమకు ఎటువంటి అవినీతి మరకలు అంతలేదని చెప్పలేరు. ఏది ఏమయినప్పటికీ మరొక రెండు రోజుల్లో ప్రజలే అంతిమ తీర్పు చెప్పబోతున్నారు. అప్పుడే ఎవరి వాదనలలో నిజాయితీ ఉందో, ఎవరివి ఉన్మాద ప్రేలాపనలో తేలిపోతుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.