రాష్ట్రంలోనే కాదు సభలో కూడా ఎదురు ఉండకూడదంటే ఎలా?

Publish Date:Nov 13, 2014

Advertisement

 

తెలంగాణా అసెంబ్లీ వ్యవహారాల శాఖా మంత్రి హరీష్ రావు అవసరమయితే తెదేపా సభ్యులను సభ నుండి సస్పెండ్ చేసయినా సరే సభను నిర్వహిస్తామని మొన్న హెచ్చరించారు. చెప్పినట్లే అన్నంత పనీ చేసి చూపించారు కూడా. సభ సజావుగా సాగనీయకుండా అడ్డుపడుతున్నారంటూ పదిమంది తెదేపా సభ్యులను ఏకంగా వారం రోజుల పాటు సభ నుండి సస్పెండ్ చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు సభలో మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యులు నోటికి ఎంతవస్తేంతా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తమ యంపీ కవితపై నిరాధారమయిన ఆరోపణలు చేసినందుకు రేవంత్ రెడ్డి సభలో క్షమాపణలు చెప్పవలసిందే అంటూ పట్టుబట్టారు. కానీ రేవంత్ రెడ్డి అందుకు అంగీకరించలేదు. బహుశః అందుకే తెదేపా సభ్యులందరినీ సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారని సభ నుండి సస్పెండ్ చేయించినట్లు కనిపిస్తోంది.

 

రేవంత్ రెడ్డి తప్పుగా మాట్లాడినట్లు భావిస్తే ఆయన ఒక్కరిని సభ నుండి సస్పెండ్ చేసి ఉంటే సరిపోయేది. కానీ ఆ మిషతో మొత్తం తెదేపా సభ్యులు అందరినీ సభ నుండి వారం రోజుల పాటు సస్పెండ్ చేయడం చాలా అప్రజాస్వామిక చర్య. తెలంగాణా రాష్ట్రంలో తమ పార్టీకి అసలు వేరే పార్టీ నుండి పోటీయే ఉండకూడదని భావించే తెరాస అధినేత కేసీఆర్, శాసన సభలో కూడా తమకు ఎవరు ఎదురు చెప్పకూడదు. తమ తప్పులు ఎత్తి చూపుతూ తమను విమర్శించ రాదు. తమను ప్రశ్నించకూడదు...అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే తమను సభలో గట్టిగా నిలదీస్తున్న తెదేపా సభ్యులను సభ నుండి సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నారు.

 

తెరాస చర్యలను సభలో మిగిలిన కాంగ్రెస్, బీజేపీ సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. ఈవిధంగా ప్రతిపక్ష సభ్యులందరినీ ఏదో ఒక సాకుతో సభ నుండి సస్పెండ్ చేసుకొంటూపోతే చివరికి సభలో అధికార పక్ష సభ్యులే మిగులుతారని కాంగ్రెస్ సభ్యుడు కె జానారెడ్డి ఎద్దేవా చేసారు. నిజానికి తెరాస కూడా అదే మేలని భావిస్తుండవచ్చు. కానయితే ఆ విషయం బహిరంగంగా చెప్పడం మంచిది కాదని ఊరుకొని ఉండవచ్చును. అంతే. సభలో బీజేపీ సభ్యులు కూడా తెరాస ప్రభుత్వాన్ని కడిగి పడేస్తున్నారు కనుక, బహుశః నేడో రేపో వారిని కూడా సభ నుండి సస్పెండ్ చేసి బయటకు పంపివేస్తారేమో! ఒకవేళ తెరాస నేతలు శాసనసభలో ప్రతిపక్ష సభ్యుల గొంతు వినబడకూడదని భావిస్తున్నట్లయితే ఈ సభా సమావేశాలు నిర్వహించడమే అనవసరం. కానీ అది మన దేశంలో వీలుపడదు కనుకనే నిర్వహించవలసి వస్తోంది.

 

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపా సభ్యులు, దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చాలా గట్టిగా నిలదీస్తున్నప్పటికీ, అధికార పార్టీ సభ్యులు వారికి ధీటుగా సమాధానాలు చెపుతూ ప్రతివిమర్శలు చేస్తున్నారు తప్ప ఈవిధంగా ప్రతిపక్ష సభ్యులందరినీ సభ నుండి బయటకి పంపేసి సభలో తమ మాటకు ఎదురులేకుండా చేసుకోవాలని ప్రయత్నించలేదు.

 

నియంతృత్వ పోకడలకు ప్రజాస్వామ్యంలో తావు లేదు. ఒకవేళ అటువంటి లక్షణాలు కనబరిస్తే దానిని చక్క దిద్దగల సమర్ధత మన రాజ్యాంగ వ్యవస్థలకు ఉంది కనుకనే నేటికీ మనదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా నిలబడి ఉంది. అధికారంలో ఉన్నవారికి సహనం చాలా అవసరం. అది లేకపోతే ప్రజల ముందు తామే అభాసుపాలవుతామని తెరాస నేతలు గ్రహిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.