త్వరలో ఏపీకి మరో రెండు భారీ పరిశ్రమలు

Publish Date:Nov 15, 2014

Advertisement

 

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పరిశ్రమలన్నీ దాదాపు హైదరాబాదుకే తరలిపోయేవి. ఆ కారణంగానే రాష్ట్రంలో మరే జిల్లాలో చెప్పుకోదగ్గ పెద్ద పరిశ్రమ ఒక్కటీ కనబడటం లేదు. కానీ రాష్ట్ర విభజన తరువాత ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. రాష్ట్ర విభజనకు ముందు పారిశ్రామిక ప్రగతి ప్రసక్తే వినని ఆంద్రప్రదేశ్ లో విభజన తరువాత ఈ ఐదు నెలలోనే భారీ పరిశ్రమలు రాష్ట్రానికి క్యూ కడుతుండటం చాలా శుభ పరిణామం.

 

కొన్ని రోజుల క్రితం హీరో మోటార్ సైకిల్స్ కంపెనీ దక్షిణ భారతదేశంలో తన మొట్ట మొదటి ఉత్పత్తి కేంద్రాన్ని చిత్తూరులో స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసింది. సుమారు రూ.1600కోట్లతో ఆ కర్మాగారం నెలకొల్పుతున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి మరో భారీ సంస్థ రాబోతోంది.

 

భారతదేశంలో మంచి పేరు మోసిన ‘క్రిషబ్ కో’ ఎరువుల తయారీ కర్మాగారం నెల్లూరులో సర్వేపల్లి వద్ద గల పారిశ్రామిక వాడలో నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం 286 ఎకరాల భూమిని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏ.పి.ఐ.ఐ.సి.) బదలాయిస్తూ నిన్నే ఒక జీ.వో. జారీ చేసింది. ఏ.పి.ఐ.ఐ.సి. సంస్థ ఆ భూమిని ఎకరం ఏడూ లక్షల చొప్పున ‘కృషబ్ కో’కు అమ్ముతుంది. అదే ప్రాంతంలో యూ.పి.ఐ. పాలిమర్స్ అనే పైపులు, నీటిని వెదజెల్లే స్ప్రిన్క్లర్స్ మరియు డ్రిప్ ఇరిగేష్ పరికరాలు తయారుచేసే కర్మాగారం కోసం మరో 50 ఎకరాల భూని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్నన్నే ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు కాకుండా అదే ప్రాంతంలో 150 ఎకరాల విస్తీరణంలో కంటైనర్ కార్పోరేషన్ సంస్థ స్థాపించేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు వచ్చింది. త్వరలోనే దానికీ భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జీ.ఓ.జారీ చేసే అవకాశాలున్నాయి.

 

నిజానికి ‘కృషబ్ కో’ యాజమాన్యం రాష్ట్రంలో ఈ భారీ కర్మాగారం స్థాపించేందుకు 2012లోనే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొంది. కానీ అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యమే ఇప్పుడు రాష్ట్రానికి వరంగా మారడం విశేషం. ఈ సంస్థ మొత్తం రూ.2000 కోట్లు రెండు దశలలో పెట్టుబడి పెడుతుంది. ఈ ఎరువుల కర్మాగారంలో రోజుకి 1600టన్నుల ఎరువు తయారవుతుంది. ఈ కర్మాగారం ద్వారా నేరుగా 300 నుండి 400 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తే, ప్యాకింగ్, రవాణా, కేటరింగ్, హోటల్ పరిశ్రమల ద్వారా పరోక్షంగా అనేక మందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది అని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏ.పి.ఐ.ఐ.సి.) చైర్మన్ పి.కృష్ణయ్య మీడియాకు తెలిపారు. త్వరలోనే ఈ క్రిషబ్ కో యాజమాన్యానికి భూమిని కేటాయించబోతున్నామని, వచ్చే ఏడాది మార్చిలోగా కర్మాగార నిర్మాణ కార్యక్రమాలు మొదలవుతాయని ఆయన తెలిపారు. రెండేళ్లలో పరిశ్రమ పూర్తి స్థాయిలో ఉత్పత్తి మొదలుపెట్టగలదని క్రిషబ్ కో యాజమాన్యం తెలిపింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేసినట్లయితే బహుశః మరిన్ని భారీ, మధ్య తరహా పరిశ్రమలు, ఐటీ సంస్థలు రాష్ట్రానికి క్యూ కట్టవచ్చును.

 

 

 

By
en-us Political News

  
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.