Publish Date:Mar 12, 2026
త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై హైదరాబాద్కు చెందిన పారావీల్ కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సంచలన సర్వే నివేదిక విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం తమిళనాడులో మళ్లీ ఎం. కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేసింది. రాష్ట్రంలోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ల వారీగా శాంపిల్స్ సేకరించి శాస్త్రీయ విధానంతో అధ్యయనం నిర్వహించినట్లు సంస్థ వెల్లడించింది.
చెన్నైలో నిర్వహించిన సమావేశంలో సంస్థ సీఈఓ కిరణ్ కొండేటి ఈ సర్వే వివరాలను వెల్లడించారు.సర్వే ప్రకారం డీఎంకేకు 41.5 శాతం ఓటు షేర్ లభించే అవకాశం ఉందని, (అన్నాడీఎంకే)కు 36.2 శాతం మద్దతు లభించవచ్చని తెలిపారు. ఇక టీవీకేకు 13.6 శాతం, నామ్ తమిళర్ కట్చికి 7.9 శాతం ఓట్లు వచ్చే అవకాశముందని సర్వేలో తేలిందన్నారు. ముఖ్యంగా చెన్నైలో టీవీకేకు గణనీయమైన స్థాయిలో స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
కోవై, డెల్టా జిల్లాలు, దక్షిణ, ఉత్తర, పశ్చిమ తమిళనాడు ప్రాంతాల్లో ఓటర్ల సెంటిమెంట్ను విశ్లేషిస్తూ పాలనపై ప్రజల అభిప్రాయాలు, ప్రభుత్వ వ్యతిరేక ధోరణులపై వివరంగా అధ్యయనం చేశామని కొండేటి తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో తమ సంస్థ “కేకే పారావీల్” అనే వెబ్సైట్ను ప్రారంభించి ఎగ్జిట్ పోల్స్ 2026 పేరుతో పారదర్శకంగా సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు.తమ సంస్థకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేవని స్పష్టం చేసిన ఆయన, గతంలో జరిగిన 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఫలితాలను కూడా తమ సంస్థ ముందుగానే అంచనా వేసిందని గుర్తుచేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి కూటమి అఖండ విజయం సాధిస్తుందని తమ సర్వే ముందుగానే పేర్కొన్నట్లు కిరణ్ కొండేటి వివరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tamil-nadu-assembly-elections-36-215377.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.