Publish Date:Nov 30, 2013
తెలంగాణ తెచ్చింది మేమేనని చెప్పుకోవడానికి అటు టీ కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ చేస్తున్న ఫీట్లు చూస్తుంటే నవ్వొస్తోంది. తెలంగాణ వచ్చేసిందని తెలంగాణ కాంగ్రెసోళ్ళు కృతజ్ఞతల సభలు.. ఆ సభలు.. ఈ సభలు అంటూ బిజీగా వుంటే, టీఆర్ఎస్సోళ్ళు మేం మాత్రం తక్కువా అని దీక్షాదివస్ అనే కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్ నిరాహారదీక్ష విరమించి నాలుగేళ్ళయిన సందర్భంగా ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ‘దీక్షాదివస్’ నిర్వహించారు.
తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహారదీక్ష చేసిన పొట్టి శ్రీరాములు మరణించినప్పుడు ఆయన్ని తెలుగువారు ఎంతగా కీర్తించారో, ఇప్పుడు కేసీఆర్ని కూడా టీఆర్ఎస్ నాయకులు అంతకు పదిరెట్లు కీర్తిస్తున్నారు. ఒక వి‘భజనుడు’ కేసీఅంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్ అని గొంతు చించుకు అరిస్తే, మరొక విభజనుడు కేసీఆర్ చేసిన నిరాహారదీక్ష చరిత్రలో నిలిచిపోతుందని అని నమ్మకంగా చెప్పాడు. కేసీఆర్ కారణంగానే తెలంగాణ ఉద్యమం ఇంత ‘శాంతియుతం’గా జరుగుతోందని ఒక విభజనుడు పులకరించిపోతూ వివరించాడు. తెలంగాణ పోరాటం క్రెడిట్ అంతా కేసీఆర్ అకౌంట్లోకే చేరాలని ఇంకొక విభజనుడు వెర్రిగా అరిచాడు.
ఈ సమావేశం సందర్భంగా మరో కామెడీ కూడా చేశారు. కేసీఆర్ని శ్రీరాముడి గెటప్లో చూపిస్తూ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీని చూసి టీఆర్ఎస్ సేన మురిసిపోయిందేమోగానీ, దారినపోయే జనం మాత్రం దాన్ని చూసి నవ్వుకున్నారు. కేసీఆర్ చేసిన దీక్ష చరిత్ర సృష్టించిందని టీఆర్ఎస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఫ్లూయిడ్లతో చేసిన సదరు దీక్ష ఎంత చరిత్ర హీనమైనదో వాళ్ళ మనసులని అడిగితే చెబుతుంది. ఇదే దీక్షా శిబిరంలో టీఆర్ఎస్ చేసిన ఒక ప్రకటన విమర్శనార్హంగా వుంది. తెలంగాణ రాగానే, తెలంగాణ కోసం అమరవీరులైన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తారట. వారి కుటుంబానికి 5 నుంచి 10 లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తారట. ఇలా ప్రకటించడం ద్వారా టీఆర్ఎస్ నాయకులు ఏ ప్రయోజనం ఆశిస్తున్నారో, ఎవర్ని రెచ్చగొట్టదలచుకున్నారో వారికే తెలుసు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/t-cong-success-meet-39-27946.html
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు.
తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ పట్లే కక్షగట్టినట్లుగా వ్యవహరించారు. ఇంత కాలం తన వెన్నంటి ఉండి, తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దౌర్జన్యాలకు దిగారు. పార్టీ అధినేతపైనా, అధినేత కుటుంబంపైనా కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తల్లిలాండి భువనేశ్వరిని సైతం దుర్భాషలాడారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.